అన్వేషించండి

Jagananna Arogya Suraksha: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’లో ఆశా వర్కర్‌ మృతి- రూ.50 లక్షల నష్టపరిహారం డిమాండ్

Jagananna Arogya Suraksha: ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో విషాద ఘటన జరిగింది. విధులు నిర్వహిస్తూ ఓ ఆశా వర్కర్‌ మృతి చెందారు.

Jagananna Arogya Suraksha: ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో విషాద ఘటన జరిగింది. విధులు నిర్వహిస్తూ ఓ ఆశా వర్కర్‌ మృతి చెందారు. తాడేపల్లిలోని ప్రకాశ్‌నగర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో శుక్రవారం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆశావర్కర్‌ కృపమ్మ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. సిబ్బంది వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కృపమ్మ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారుల ఒత్తిడే కృపమ్మ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 30న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది. స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్‌ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పె­షలిస్ట్‌ వైద్యుల సేవలను అందిస్తున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.  

ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలను అందిస్తున్నారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉంటుున్నారు. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్‌ సప్లిమెంటేషన్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్‌ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.  

టోకెన్లు లేకున్నా వైద్య సేవలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు.  రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
HeatWave 2026: వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
Diet for Hypothyroidism : థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? వైద్యులు సూచిస్తోన్న తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే
థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? వైద్యులు సూచిస్తోన్న తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే
Blast Zone OTT : యాక్షన్ కింగ్ అర్జున్ బ్లాస్ట్ జోన్ - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
యాక్షన్ కింగ్ అర్జున్ బ్లాస్ట్ జోన్ - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
Embed widget