అన్వేషించండి

Andhra Pradesh News: నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!

Cyclone Montha Latest News | ముందుగానే MRO లు, ఇంటింటికీ వెళ్ళి గర్భిణుల్ని అలెర్ట్ చేశారు. సిబ్బంది రాత్రంతా ఫీల్డ్ లోనే ఉన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం అర్ధరాత్రి వరకు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు.

 గడిచిన రెండు రోజులుగా  ఏపీ విపత్తు నిర్వహణల శాఖ, ప్రభుత్వం, వాతావరణ కేంద్రం చేసిన కృషి ఫలించింది అనే చెప్పాలి. కొంతమంది ప్రభుత్వం అతి చేస్తుందా అన్నట్టు విమర్శలు గుప్పించే ప్రయత్నం చేసినా             " మెంథో " తుఫాన్ గండం నుండి చాలా తక్కువ నష్టం తో ఏపీ బయట పడింది అంటే నిజంగా అది వివిధ శాఖల సంయుక్త నిర్వహణే అని ఒప్పుకుని తీరాలి.

3645 మంది గర్భిణీలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు

రాష్ట్ర వ్యాప్తంగా 1906 షెల్టర్ లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నెలలు నిండిన 3645 మంది గర్భిణిలను ముందుగానే ఆయా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. దుబ్రిగుంట మండలంలో సాకేరి అనిత అనే గర్భిణీ కి ప్రసవ వేదన రావడం తో సురేష్ అనే 108 సిబ్బంది స్వయంగా తన చేతుల మీదుగా పొంగుతున్న వాగు దాటించి ఆమెను కాపాడిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. 


Andhra Pradesh News: నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!

అడుగడుగునా హెచ్చరిక లు జారీ చేసిన  విపత్తు నిర్వహణ ల శాఖ 

విరుచుకు పడుతున్న తుఫాన్ గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ  మరివైపు ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేస్తూ వచ్చింది ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ. అంతేకాకుండా తగినన్ని SDRF, NDRF బృందాలు తీర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి మకాం వేశాయి. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న ఏరియాల నుండి  ప్రజలను తరలించి రక్షిత కేంద్రాలకు చేర్చాయి. దీనివల్ల తుఫాను కారణంగా ప్రాణ నష్టం  అత్యంత అల్పం గా ఉండేలా జాగ్రత్త పడ్డారు.  విరిగిన చెట్లను అప్పటికప్పుడే కట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసారు.

 1000 విద్యుత్ బృందాలు.. 11 వేలమంది నిరంతరం పనిలో 

తుపాను కారణంగా వివిధ చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, ట్రాన్స్ ఫార్మర్లు పాడవడంతో 28,083 సర్వీసులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. అయితే వాటిలో 21,057 సర్వీసులకు విద్యుత్ సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు. వివిధ ప్రాంతాల్లో స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ లైన్లపై చెట్లు కూలడంతో తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో 246 గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడితే అర్ధరాత్రికి కల్లా 197 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించేందుకు మూడు డిస్కంల పరిధిలో 1,000 బృందాలు పనిచేస్తున్నాయనీ.సుమారు 11,761 మంది వివిధ చోట్ల నిరంతరాయం గా పనులు నిర్వహిస్తున్నారనీ.. కావలసిన సామాగ్రిని ఆయా గ్రామాలకు ముందు నుండే తరలించిన అధికారులు  విద్యుత్ అంతరాయం  తక్కువ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంటింటికీ స్వయంగా తిరిగిన అధికారులు

 ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  ప్రాంతాల్లో MRO స్థాయి అధికారులు స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు. వీలైనంత మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. ఇక కలెక్టర్ రేంజ్ అధికారులు అయితే  ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు పరిస్థితి ని సమీక్షిస్తూ వచ్చారు.  విశాఖపట్నం, విజయవాడలాంటి సిటీల్లో పోలీస్ కమీషనర్ లు ముందుగానే కొండఛరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను  హెచ్చరిస్తూ స్వయంగా తిరిగారు.

అర్ధరాత్రి వరకూ సెక్రటె్రియేట్ లోనే  చంద్రబాబు, తెల్లవార్లూ RTGS లోనే లోకేష్

 2014 లో " హుద్ హుద్ " అనుభవం తో  "మొoథా"  తుఫాన్ నష్టం వీలైనంత తక్కువగా ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్వయంగా సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీయం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత. ఇతర అధికారులతో పదేపదే సమీక్షలు నిర్వహిస్తూ  వివిధ శాఖలు సమన్వయంగా పనిచేసే లా చూసారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి తుఫాను తీరం దాటిన తర్వాతనే ఇంటికి వెళితే  మంత్రి లోకేష్ తెల్లవార్లూ RTGS సెంటర్లోనే ఉండి పరిస్థితి ని సమీక్షిస్తూ వచ్చారు. తుఫాను తీరం దాటినా మరో 48 గంటల పాటు భారీ వర్షాలు  భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో  ఇప్పటికీ ప్రభుత్వం, అధికారులు,సిబ్బంది అలర్ట్ గానే ఉన్నారని గవర్నమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే SRDF బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  చురుగ్గా పనిచేస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Heart Attacks : Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Rama Navami 2026: అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Embed widget