అన్వేషించండి

AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

PNG Connections in AP | ఎల్పీజీ నుంచి పీఎన్జీ కనెక్షన్ల వైపు ప్రజలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపం పథకం కింద రూ.2400 అందిస్తామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

AP PNG Connections | అమరావతి: అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడిచమురుతో పాటు ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అవాంతరాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ల నుంచి పీఎన్‌జీ కనెక్షన్లకు మారేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా వారికి సబ్సిడీ బెనిఫిట్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. PNG కనెక్షన్‌కు మారినప్పటికీ లబ్ధిదారులకు దీపం పథకం వర్తింపజేసి నగదు వారి ఖాతాల్లో రూ.2400 జమచేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పీఎన్‌జీ కనెక్షన్‌కు మారుతున్నందుకు కేంద్రం ఇచ్చే రూ.500 రాయితీ కూడా లభించనుంది. 

ఈ నగరాలపై స్పెకల్ ఫోకస్..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న నెల రోజుల్లో లక్షకు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులను పీఎన్జీ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ నగరాల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సౌకర్యాన్ని వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.


AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

దేవాలయాలు, అన్న క్యాంటీన్లకు ప్రాధాన్యత.. 24 గంటల్లోనే కనెక్షన్
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం దేవస్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లకు కూడా PNG కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక యూనిట్లకు కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ఇందుకోసం 'ఆటోమేటిక్ పర్మిషన్ సిస్టమ్'ను తీసుకువస్తామని స్పష్టం చేశారు.

పీఎన్జీ వినియోగదారులకు 'దీపం' సబ్సిడీ బెనిఫిట్స్
గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీని 5 శాతం నుండి 25 శాతానికి పెంచడం వల్లే పీఎన్జీపై ప్రజలు ఆసక్తి చూపలేదని మంత్రి నాదెండ్ల మనోహర్  విమర్శించారు. ఇకపై 'దీపం' పథకం కింద ఇచ్చే సబ్సిడీని పీఎన్జీ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. PNG వినియోగదారులకు నిబంధనల మేరకు 2 నెలలకు ఒకసారి సబ్సిడీ ప్రయోజనం అందే విధంగా మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు సమానమైన రూ. 2400 నగదును పీఎన్జీ వినియోగదారుల ఖాతాల్లోకి డీబీటీ (DBT) ద్వారా జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 94 లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు. 

గ్యాస్ కొరత లేదు - వదంతులు నమ్మవద్దు
సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రతిరోజూ సుమారు 2.70 లక్షల నుండి 2.80 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వదంతుల కారణంగా ప్రజలు అనవసరంగా గ్యాస్ బుక్ చేయడంతో కొంత ఒత్తిడి పెరిగిందని, ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందని ఆయన వివరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ కూడా పాల్గొన్నారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget