అన్వేషించండి

AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

PNG Connections in AP | ఎల్పీజీ నుంచి పీఎన్జీ కనెక్షన్ల వైపు ప్రజలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపం పథకం కింద రూ.2400 అందిస్తామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

AP PNG Connections | అమరావతి: అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడిచమురుతో పాటు ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అవాంతరాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ల నుంచి పీఎన్‌జీ కనెక్షన్లకు మారేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా వారికి సబ్సిడీ బెనిఫిట్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. PNG కనెక్షన్‌కు మారినప్పటికీ లబ్ధిదారులకు దీపం పథకం వర్తింపజేసి నగదు వారి ఖాతాల్లో రూ.2400 జమచేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పీఎన్‌జీ కనెక్షన్‌కు మారుతున్నందుకు కేంద్రం ఇచ్చే రూ.500 రాయితీ కూడా లభించనుంది. 

ఈ నగరాలపై స్పెకల్ ఫోకస్..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న నెల రోజుల్లో లక్షకు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులను పీఎన్జీ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ నగరాల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సౌకర్యాన్ని వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.


AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

దేవాలయాలు, అన్న క్యాంటీన్లకు ప్రాధాన్యత.. 24 గంటల్లోనే కనెక్షన్
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం దేవస్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లకు కూడా PNG కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక యూనిట్లకు కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ఇందుకోసం 'ఆటోమేటిక్ పర్మిషన్ సిస్టమ్'ను తీసుకువస్తామని స్పష్టం చేశారు.

పీఎన్జీ వినియోగదారులకు 'దీపం' సబ్సిడీ బెనిఫిట్స్
గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీని 5 శాతం నుండి 25 శాతానికి పెంచడం వల్లే పీఎన్జీపై ప్రజలు ఆసక్తి చూపలేదని మంత్రి నాదెండ్ల మనోహర్  విమర్శించారు. ఇకపై 'దీపం' పథకం కింద ఇచ్చే సబ్సిడీని పీఎన్జీ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. PNG వినియోగదారులకు నిబంధనల మేరకు 2 నెలలకు ఒకసారి సబ్సిడీ ప్రయోజనం అందే విధంగా మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు సమానమైన రూ. 2400 నగదును పీఎన్జీ వినియోగదారుల ఖాతాల్లోకి డీబీటీ (DBT) ద్వారా జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 94 లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు. 

గ్యాస్ కొరత లేదు - వదంతులు నమ్మవద్దు
సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రతిరోజూ సుమారు 2.70 లక్షల నుండి 2.80 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వదంతుల కారణంగా ప్రజలు అనవసరంగా గ్యాస్ బుక్ చేయడంతో కొంత ఒత్తిడి పెరిగిందని, ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందని ఆయన వివరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ కూడా పాల్గొన్నారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget