అన్వేషించండి

DGP Meet CM : సీఎం జగన్‌తో డీజీపీ భేటీ - ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై నివేదిక !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు. తాజా రాజకీయ పరిణామాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై నివేదిక సమర్పించినట్లుగా చెబుతున్నారు.

 

DGP Meet CM :  ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు, వాలంటీర్ల వ్యవస్థపై వివాదాలు, ఏపీ ప్రజల డేటా భద్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు కారణంగా సీఎంతో డీజీపీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అధికారిక సమావేశాల తర్వాత  ముఖ్యమంత్రి జగన్  ,   డీజీపీ సమావేశం జరిగింది.  రాష్ట్రంలో తాజా పరిణామాలపై ముఖ్యమంత్రికి డైరెక్టర్ జనరల్ నివేదికను అందించినట్లుగా తెలుస్తోంది.  
 
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్ద పై తీవ్ర స్దాయిలో రాజకీయం నడుస్తోంది. ఇటీవల కాలంలో వాలంటీర్ల పని తీరు పై జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పరోక్షంగా  సహకరిస్తున్నారంటూ పవన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే దీని పై అధికార పార్టి కి చెందిన నేతలు తీవ్ర స్దాయిలో  మండిపడ్డారు. పవన్ కామెంట్స్ పై అటు వాలంటీర్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వరుసగా రెండు రోజుల  పాటు రాష్ట్రంలో నిరసనలతో హోరెత్తించారు. అయితే పవన్ మాత్రం తాను చేసిన కామెంట్స్ పై వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్  కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల పై ఉన్న ఆరోపణలను సైతం ప్రస్తావించి మరింత దూకుడు పెంచారు. 

ఆ తరువాత తన  వ్యాఖ్యల పై మరింత లోతుగా కూడ వివరణ ఇచ్చారు . అంతటితో ఆగకుండా పవన్ అదే జోష్ తో ముఖ్యమంత్రి జగన్ ను  కేంద్రంగా చేసుకొని రాజకీయ విమర్శలు చేశారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు సేకరించిన డేటాను వేరే రాష్ట్రాలకు  పంపి సొంత అవసరాలకు వినియోగిస్తున్నారంటూ అధికార పార్టి పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వాలంటీర్ల వద్ద ప్రారంభం అయిన వివాదం కాస్త, ఇప్పుడు డేటా ను కేంద్రంగా చేసుకొని రాజకీయ దుమారాన్ని రాజేసింది.  ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను కేంద్రంగా చేసుకొని ప్రారంభం అయిన రాజకీయ వివాదం ఇప్పుడు రాష్ట్ర డేటా కు సంబందించిన అంశంతో ముడిపెట్టి పవన్ కామెంట్స్ చేశారు. 

పక్క రాష్ట్రానికి డేటా ఎమి వెళ్ళింది. అసలు అందులో వాస్తవాలు ఎంత అనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గామారింది. ఈ అంశాల నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను కలిసి చర్చించారని అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ తరువాత తాజా రాజకీయ పరిణామాలను గురించి కూడ డీజీపీ సీఎంకు నివేదిక ఇచ్చారని అంటున్నారు.
 
శ్రీకాళహస్తి ఘటన పై కూడ రాజకీయం రసవత్తరంగా మారింది. స్దానిక సీఐ అంజు యాదవ్ స్దానిక జనసేన నేత సాయి పై చేయి చేసుకున్న ఘటన పై కూడ పవన్ సీరియస్ గా స్పందించారు. శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటామని పవన్ హెచ్చరించారు.  స్దానిక సీఐ దురుసుగా ప్రవర్తించిన తీరు పై   డీజీపీ .. ముఖ్యమంత్రికి వివరణ ఇఛ్చినట్లుగా చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
NTR Jr On Balakrishna Injury: బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
Nara Lokesh: మంగళగిరిలో 3 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్
మంగళగిరిలో 3 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget