అన్వేషించండి

AP Liquor Sales: ఏపీలో తగ్గిన మద్యం అమ్మకాలు, కానీ ఆదాయం మాత్రం తగ్గేదేలేదు - పలు శాఖల సమీక్షలో సీఎం జగన్

AP Liquor Sales Income: ఆదాయాలను ఆర్జించే వివిధ ప్రభుత్వ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

AP Liquor Sales: ఆదాయాలను ఆర్జించే వివిధ ప్రభుత్వ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. జూన్‌ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే సమయానికి  23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్ కు వెల్లడించారు. 

జీఎస్టీలో టాప్... 
ఆదాయాన్ని సమకూర్చే  శాఖలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో వివిధ విభాగాల పని తీరును సమీక్షించిన ముఖ్యమంత్రి టార్గెలను అధిగమించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు.  విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పని తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకూ 91 శాతం లక్ష్యం చేరిన జీఎస్టీ (కాంపెన్‌సేషన్‌ కాకుండా) పన్నుల వసూళ్లు, జరిగినట్లు ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు నివేదికను సమర్పించారు. జూన్‌ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే సమయానికి  23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు వెల్లడించారు. 

మద్యం అమ్మకాలు...
గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎంకు వెల్లడించారు. 
2018–19తో పోలిస్తే  మద్యం అమ్మకాలు తగ్గాయని, 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు, 
2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు కాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. 
2018–19 ఏప్రిల్, మే, జూన్‌ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్‌ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్‌ 56.51 శాతంగా నమెదయ్యిందని,  లిక్కర్‌ అమ్మకాల్లో మైనస్‌ 5.28 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు.

నాటు సారా కట్టడికి చర్యలు తీసుకోండి.. జగన్
నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్బంగా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని సూచించారు.  ఆయా కుటుంబాలకు పునరావాస కార్యక్రమాల కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే సర్కార్ ఖర్చు చేసిందన్న విషయాలను కూడ ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. పునరావాస కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని,  ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలని జగన్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉందని అన్నారు. 

పెరిగిన రిజిస్ట్రేషన్ ఆదాయం...
గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ఈసందర్బంగా అదికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు, కాగా ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని నివేదికలో స్పష్టం చేశారు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం అయ్యాయని, అయితే వాటిని మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 5 వేల రిజిస్ట్రేషన్‌ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయని, ఈ తరహా విధానాలను మరింతగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వీటి ద్వారా రూ. 8.03 కోట్ల ఆదాయం వచ్చిందని సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. 

గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌ సాధ్యమైందని , 2018–19లో శాఖ నుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. 2724 మైనింగ్‌ లీజుల్లో,  1555 చోట్ల తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. 

 ఏపీఎండీసీ ఆర్థిక పని తీరు గణణీయంగా మెరుగు పడిందని, 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22–23లో రూ.1806 కోట్లకు పెరిగిన ఆదాయం, పెరిగిందని వెల్లడించారు. 2023–24 నాటికి రూ.4వేల కోట్లకు ఏపీ ఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా వేసినట్లు అదికారులు చెబుతున్నారు. 
మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గుగనుల నుంచి భారీగా ఆదాయం ఆర్జిస్తున్న ఏపీఎండీసీ, సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టామని వివరించారు. 

అప్పటికి ఇప్పటికి తేడా అదే.. 
గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలుకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని లెక్కలు చెబుతున్నాయని, ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గతంలో ఆదాయాల పరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతో పాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో  సాధ్యమైందని  అభిప్రాయపడ్డారు. రవాణా రంగంలో సంస్కరణల పై దృష్టి పెట్టాలని, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల పై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరంస ఉందని, వాహనాల పై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget