అన్వేషించండి

YS Jagan on UCC: ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై ఆందోళన చెందవద్దు - ముస్లిం నేతలతో భేటీలో సీఎం జగన్

Uniform Civil Code In India: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మైనార్టీ వర్గాలతో సమావేశం అయ్యారు.

Uniform Civil Code In India: ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ముస్లిం వర్గాలతో సీఎం సమావేశం
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (Uniform Civil Code) పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మైనార్టీ వర్గాలతో సమావేశం అయ్యారు. ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులు జగన్ తో సమావేశానికి హజరయ్యారు. ఉమ్మడి పౌరస్మృతి అంశం పై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి మత పెద్దలు వివరించారు. 

మైనార్టీ వర్గాలు ఆందోళన వద్దు...
సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు, మైనార్టీలకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని అన్నారు. ముస్లింలు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. మైనార్టి వర్గాల మనసు నొప్పించేలా తమ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు.  ఉమ్మడి పౌరస్మృతి అంశం (UCC) మీద డ్రాఫ్ట్‌  ఇప్పటికీ  రాలేదని జగన్ అన్నారు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై  చర్చ విపరీతంగా నడుస్తోందన్నారు. వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.  
ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తాను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే ఇదే సమయంలో మీరంతా ఇదే  పరిస్థితుల్లో  ఉంటే  ఏం చేసేవారన్నదానిపై  ఆలోచనలు చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రాపగండా నడుస్తోందని చెప్పారు. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా  తిప్పికొట్టాలన్నారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రి అయినా.. ఏ తల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారని ప్రశ్నించారు. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని అందరి కలసి స్పష్టం చేద్దామని అన్నారు.  

లా బోర్డులో చర్చ...
భారతదేశం చాలా విభిన్నమైనదని, దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయని చెప్పారు. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారి వారి మత గ్రంధాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి  వారి పర్సనల్‌ లాబోర్డులు ఉన్నాయని, ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్‌ లాబోర్డుల ద్వారానే చేయాలన్నారు. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్‌ లాబోర్డ్స్‌తో మమేకమై,  పర్సనల్‌ లా బోర్డ్స్‌ ద్వారా అవసరం అయిన  మార్పులు పద్దతి ప్రకారం తీసుకోవాలన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
ముస్లింలకు నష్టం  కలిగేలా ఉంటే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు  వ్యతిరేకిస్తామని  సీఎం  జగన్ చెప్పారన్నారు, ఉప ముఖ్యమంత్రి  అంజాద్ బాషా. ముస్లింలకు నష్టం  కలిగించే ఎలాంటి  చర్యలను  తీసుకునే  పరిస్థితి ఉండదని  సీఎం  జగన్ స్పష్టం  చేసినట్లు తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget