అన్వేషించండి

నియోజకవర్గాల్లో పర్యవేక్షకుల నియామకంపై జగన్ ఫోకస్- టెన్షన్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు

గడప గడపకు మన ప్రభుత్వం ద్వార ప్రజల్లో వెళ్లి తీరాల్సిందేనని జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు కూడా అసలు విషయాలు బోధపడ్డాయి అంటున్నారు.

వైసీపీలో జిల్లా అధ్యక్షుల మార్పు పూర్తయ్యింది. పని తీరు బాగోలేని నేతలను మార్చేస్తామంటూ సీఎం జగన్ చెప్పినట్లుగానే జాబితాలో మార్పులు జరిగాయి. కొత్త వారికి అవకాశాలు ఇచ్చి, పాత వారిని పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు తరువాత భాగం నియోజకవర్గాల ఎమ్మెల్యేలదేనని ప్రచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

నియోజకవర్గాలపై ఫోకస్ 

వైసీపీలో నియోజకవర్గాల శాసనసభ్యులపై ఇప్పటికే ఫుల్‌గా ఒత్తిడి పెరిగింది. ఎమ్మెల్యేలకు గడప గడపకు టార్గెట్ పెట్టిన జగన్ వారి పని తీరుపై ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్ని గంటలపాటు ప్రజల్లో ఉన్నారు, వారి పని తీరు ఎలా ఉంది, ప్రజల్లో మార్కులు పడుతున్నాయా లేదా, ప్రజలకు దగ్గరగా ఉంటున్నారా లేదా అనే విషయాలను పీకే టీంతోపాటుగా, ప్రైవేట్ సంస్థలతో కూడా జగన్ సర్వే చేయిస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలతోపాటుగా, పర్యవేక్షకులను నియామకానికి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. 

ప్రస్తుత ఎమ్మెల్యేల పట్ల, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, సర్వేల్లో ఆశించిన ఫలితాలు రాని వారిని గుర్తించి, ఆయా స్థానాల్లో కొత్తవారిని అభ్యర్థులుగా తీసుకొస్తారన్న చర్చ వైసీపీలో మొదలైంది. ఇప్పటికే ఈ తరహా ప్రచారం కొన్నినియోజకవర్గాల్లో అమలు చేశారు కూడా. ఇందుకు తాడికొండ, మైలవరం వంటి నియోజవకర్గాలను ఉదాహరణగా చెబుతున్నారు. పార్టీ తరపున ప్రత్యేకంగా సర్వే చేయడంతోపాటు.. ఐప్యాక్ టీం అన్ని నియోజకవర్గాల్లో నిఘా పెట్టి సర్వేలు చేసింది. వాటి ఫలితాల ఆధారంగానే టికెట్లు ఉంటాయన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. చాలా నియోజకవర్గాల్లో పార్టీ వర్గాలు ఐ ప్యాక్ టీంలకు టచ్‌లో ఉంటూ తాము చేసిన పనులను ప్రచారం చేసుకునే పనిలో ఉన్నారు. 

నియోజక వర్గాలకు పార్టీ పర్యవేక్షకుల నియామకంపై సీఎం గత మూడు రోజులుగా సమీక్షిస్తుండటంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందనే ప్రచారం జరుగుతుంది. పని తీరు మెరుగురచుకోండి, లేదంటే కొత్త వారిని నియమించటం ఖాయం అని సీఎం జగన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల పని తీరులో కూడా జగన్ తాను చెప్పినట్లుగానే క్లారిటి ఇచ్చారు. పని తీరు బాగోలేని వారిని, ఇప్పటికే రాజీనామాలు చేసి చేతులు ఎత్తేసిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించి, 26జిల్లాల బాబితాను ఇప్పటికే ప్రకటించారు.

ఎమ్మెల్యేలకు తలనొప్పి

గడప గడపకు మన ప్రభుత్వం ద్వార ప్రజల్లో వెళ్లి తీరాల్సిందేనని జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు కూడా అసలు విషయాలు బోధపడ్డాయి అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సంవత్సరాలపాటు కరోనా కాలం సరిపోయింది. ఆ తరువాత ఎడాది అంతంమాత్రంగానే మారింది. దీంతో ప్రజల సమస్యలు, పెండింగ్ పనులు, ఇచ్చిన హామీలు, అమలు ఇలా అన్ని విషయాలు ఎమ్మెల్యేలను చుట్టుముట్టాయి. దీంతో చాలా రోజులు తరువాత బయటకు వచ్చిన శాసన సభ్యులకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటిని అదిగమించి, ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటే, ఇదే సమయంలో నియోజకవర్గాలకు పర్యవేక్షకుల నియామకం అంటూ మరింత ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. 

సెప్టెంబరు 28న నిర్వహించిన సమీక్షలో జగన్ ఎమ్మెల్యేలు, ఎంత మంది ఎక్కడకు వెళ్లారు, ఎక్కడెక్కడ తిరాగారు, అనే విషయాలు నివేదికలతో సహా బయట పెట్టి, పని తీరుకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. దీంతొ మిగిలినవారు కూడ అలర్ట్ కావాల్సి వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget