అన్వేషించండి

Sajeeva Charitra Book Launch Event: భారత రాజకీయాల్లో 1983 ఒక సంచలనం, కాంగ్రెస్ పాలనకు NTR గుణపాఠం: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu | 1983 సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక సంచలనం, కాంగ్రెస్ పాలనకు NTR గుణపాఠం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతి: 1983వ సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక సంచలనంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సజీవ చరిత్ర’ పుస్తకాన్ని విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్సులో మంగళవారం రాత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vekaiah Naidu), త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

సజీవ చరిత్ర పుస్తకం విడుదల

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 1984లో చోటు చేసుకున్న వాస్తవాలను సజీవ చరిత్ర పుస్తకం ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కొనసాగిన కాంగ్రెస్ పాలనకు 1983లో జరిగిన ఎన్నికలు గుణపాఠంగా మారాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి తన ప్రసంగంలో స్ఫూర్తిదాయకమైన విషయాలను గుర్తుచేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని గొప్పగా ప్రకటించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ అని ప్రశంసించారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన నేత ఎన్టీఆరేనని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అమలవుతోందని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

ఆ సమయంలో 161 మంది ఎమ్మెల్యేలతో రామకృష్ణ స్టూడియోకు వెళ్లి క్యాంప్ పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో 18 నెలలకే ప్రభుత్వాలు మారడం కాంగ్రెస్ పాలనలో సాధారణమైపోయింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల సంగ్రామంలో పోరాడి గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ద్రోహానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. 

ఆ సమయంలో ఉమ్మడి ఏపీ గవర్నర్ రామ్‌లాల్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను సీఎం చంద్రబాబు తాజాగా విమర్శించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ప్రజాస్వామ్యానికి అండగా నిలవడం ఎంతో ప్రాధాన్యం కలిగిన విషయం. ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోతే రామకృష్ణ హెగ్డే మాత్రమే అప్పట్లో కర్ణాటకలో ఎన్టీఆర్‌కు ఆశ్రయం ఇచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలి
తెలుగు జాతి గర్వించే వ్యక్తి, గొప్ప నటుడు, ప్రజా పాలకుడు అయిన ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలి, అది సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ స్థిరత్వానికి కీలకంగా మారింది. ఆయన స్థాపించిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు.

వెంకయ్య నాయుడు నాయకులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలను సమీకరించడంలో ఇంద్రసేనారెడ్డి చేసిన కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం, సంక్షేమంపై చూపిన నిబద్ధతను స్మరించుకుంటూ, తన ఆలోచనలతో దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన నేతగా  ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget