అన్వేషించండి

Sajeeva Charitra Book Launch Event: భారత రాజకీయాల్లో 1983 ఒక సంచలనం, కాంగ్రెస్ పాలనకు NTR గుణపాఠం: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu | 1983 సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక సంచలనం, కాంగ్రెస్ పాలనకు NTR గుణపాఠం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతి: 1983వ సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక సంచలనంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సజీవ చరిత్ర’ పుస్తకాన్ని విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్సులో మంగళవారం రాత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vekaiah Naidu), త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

సజీవ చరిత్ర పుస్తకం విడుదల

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 1984లో చోటు చేసుకున్న వాస్తవాలను సజీవ చరిత్ర పుస్తకం ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కొనసాగిన కాంగ్రెస్ పాలనకు 1983లో జరిగిన ఎన్నికలు గుణపాఠంగా మారాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి తన ప్రసంగంలో స్ఫూర్తిదాయకమైన విషయాలను గుర్తుచేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని గొప్పగా ప్రకటించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ అని ప్రశంసించారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన నేత ఎన్టీఆరేనని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అమలవుతోందని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

ఆ సమయంలో 161 మంది ఎమ్మెల్యేలతో రామకృష్ణ స్టూడియోకు వెళ్లి క్యాంప్ పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో 18 నెలలకే ప్రభుత్వాలు మారడం కాంగ్రెస్ పాలనలో సాధారణమైపోయింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల సంగ్రామంలో పోరాడి గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ద్రోహానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. 

ఆ సమయంలో ఉమ్మడి ఏపీ గవర్నర్ రామ్‌లాల్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను సీఎం చంద్రబాబు తాజాగా విమర్శించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ప్రజాస్వామ్యానికి అండగా నిలవడం ఎంతో ప్రాధాన్యం కలిగిన విషయం. ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోతే రామకృష్ణ హెగ్డే మాత్రమే అప్పట్లో కర్ణాటకలో ఎన్టీఆర్‌కు ఆశ్రయం ఇచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలి
తెలుగు జాతి గర్వించే వ్యక్తి, గొప్ప నటుడు, ప్రజా పాలకుడు అయిన ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలి, అది సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ స్థిరత్వానికి కీలకంగా మారింది. ఆయన స్థాపించిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు.

వెంకయ్య నాయుడు నాయకులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలను సమీకరించడంలో ఇంద్రసేనారెడ్డి చేసిన కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం, సంక్షేమంపై చూపిన నిబద్ధతను స్మరించుకుంటూ, తన ఆలోచనలతో దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన నేతగా  ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget