అన్వేషించండి

Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 లక్ష్యం ఇదే- కీలకాంశాలతో పాలసీ సిద్ధం చేసిన ప్రభుత్వం

Andhra Pradesh Latest Updates: పెట్టుబడులు ఆకర్షణతోపాటు, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం డ్రోన్ పాలసీ తీసుకురానుంది. అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చర్చించనుంది.

Amaravati News: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024"కు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గతంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్‌ 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌ వేదికగా జరిగే సమ్మిట్‌పై శుక్రవారం ఏపీ సీఎస్‌ నీరభ్‌ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిహ్వరించారు. 

డ్రోన్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు 

డ్రోన్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని వివిధ శాఖల కార్యదర్శులు పరిశీలించాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం సహా ఇతర సమస్యల్లేకుండా చూడాలని ఆదేశించారు. వివిధ శాఖల నుంచి 10 మంది ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలన్నారు. 

భారీగా రానున్న ప్రతినిధులు

ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో  ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితోపాటు ఇతర మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. వీళ్లతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీళ్లతోపాటు వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు కూడా తరలి రానున్నారు. 

రెండు రోజులు 9 సెషన్లు

రెండు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై చర్చించేందుకు 9 సెషన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి.

ఐదు వేల డ్రోన్‌లతో ప్రదర్శన

ఈ సమ్మిట్‌లో దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీదారులు తమ ఉత్పత్తులు ప్రదర్శించేందుకు 40 సెంటర్లు ఉంటాయి. 22న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్ వద్ద 5వేల డ్రోన్లతో అతి పెద్ద డ్రోన్ షో ఏర్పాటు చేశారు. లేజర్ షో, ఫైర్ వర్క్స్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి మరింత శోభను తీసుకురానున్నాయి. 

పెట్టుబడులు- ఉపాధి

ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి డ్రోన్ వాడకం, తయారీ కేంద్రంగా ఏపీని ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని యోచిస్తోంది. వీటితోపాటు యువతను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చూస్తోంది. ఈ లక్ష్యాలతోనే డ్రోన్ పాలసీని రూపొందించింది. ఈ సమ్మిట్‌లో డ్రోన్ పాలసీని విడుదల చేసి చర్చకు పెట్టనుంది.  

వివిధ శాఖల్లో డ్రోన్ సేవలను విస్తృతపరచడంతోపాటులో డ్రోన్ ఇన్నోవేషన్‌లో రాష్ట్రం వాటాను 25 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డ్రోన్ పైలట్‌ల ద్వారా రిపేర్‌లో శిక్షణ ఇవ్వడంతో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దీన్ని ఓ సెబ్జెక్ట్‌గా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని కూడా చూస్తోంది ప్రభుత్వం. 

మరింత సరళతరంగా పాలసీ

డ్రోన్‌ వాడకంపై ఇప్పుడు చాలా పరిమితులు ఉన్నాయి. వాటిని తగ్గించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. డ్రోన్ నిర్వహణకు ఇప్పుడు దాదాపు పాతి నిబంధనలు ఉన్నాయి. వాటిని ఐదుకు పరిమితం చేయాలని చూస్తోంది. వాటిని తగ్గించడమే కాకుండా అనధికారింగా ఎవరైనా అక్రమాలకు వాడితే వేసే శిక్షలు కూడా ఆ స్థాయిలోనే ఉండేలా చూస్తోంది. రూల్స్‌కు వ్యతిరేకంగా డ్రోన్స్ వాడితే లక్ష రూపాయల వరకు ఫైన్ వేసేలా.. 300 కిలోల నుంచి 500 కిలోల వరకు బరువు ఉన్న వాటిని వాడేలా చూస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్సుల కోసం సెక్యూరిటీ క్లియరెన్సుతో సంబంధం లేకుండా అనుమతులు తీసుకోవాలని చూస్తున్నారు. గ్రీన్ జోన్‌లో వాడుకునేందుకు అనుమతులు అవసరం లేదు. రెడ్, ఎల్లో జోన్లలో మాత్రం అధికారుల పర్మిషన్ అవసరం. 

Also Read: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget