అన్వేషించండి

Ambati Rambabu: తుంగభద్ర డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోతే, జగన్‌ కి ఏమిటి సంబంధం?: అంబటి రాంబాబు ఫైర్‌

Andhra Pradesh News | వరద ఉధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోతే, దానికి మాజీ సీఎం జగన్ ను బాధ్యులు చేయడం ఏంటని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tungabhadra dam gate washed away | గుంటూరు: వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్‌లో ఒక గేట్‌ కొట్టుకుపోతే, దానికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ ని బాధ్యులను చేస్తూ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యామ్‌ నిర్వహణను తుంగభద్ర బోర్డు చూస్తోందన్న ఆయన, అందులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేంద్ర జల సంఘం (CWC) ప్రాతినిథ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు తుంగభద్ర డ్యామ్‌లో భారీ వరదకు 19వ గేట్‌ కొట్టుకుపోతే, దానికి గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌ ఎలా బాధ్యులవుతారని అంబటి రాంబాబు నిలదీశారు.

తుంగభద్ర డ్యామ్‌లో 19వ క్రస్ట్‌ గేట్‌ కొట్టుకుపోవడం వల్ల రిజర్వాయర్‌ నుంచి దాదాపు 90 వేల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. దీనివల్ల ఏపీలో వరదముప్పు రావడమే కాకుండా, ఆయకట్టుకు ఈ ఏడాది నీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని అంబటి రాంబాబు తెలిపారు. అందువల్ల వీలైనంత త్వరగా మరమ్మతు చేసి, రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేయాలని డిమాండ్‌ చేశారు.

పులిచింతల గేట్ కొట్టుకపోతే రిపేర్ చేశాం..

గతంలో తమ ప్రభుత్వ హయాంలో పులిచింతల ప్రాజెక్టులో 16వ గేట్‌ కొట్టుకుపోతే, కేవలం 20 రోజుల్లో దాన్ని రిపేర్‌ చేశామన్నారు. అయినా ఆనాడు ఎల్లో మీడియాలో బురద రాతలు రాశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అలాగే, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్‌ కూడా కొట్టుకుపోతే.. దానికీ మేమే కారణం అంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. నిజానికి చంద్రబాబు నిర్వాకం వల్లనే గుండ్లకమ్మ గేట్‌ కొట్టుకుపోయిందని, ఆ ప్రాజెక్టుపై రూ.6 కోట్లు ఖర్చు చేసి రంగులు వేసి, విగ్రహం పెట్టారు తప్ప, గేట్లకు కనీస మరమ్మతులు చేయలేదని అంబటి ధ్వజమెత్తారు.
 

తుంగభద్ర డ్యామ్‌ నిర్మించి 71 ఏళ్లు పూర్తయ్యాయని, కానీ ఆ ప్రాజెక్టు గ్యారెంటీ పీరియడ్‌ 45 ఏళ్లు మాత్రమే అని అంబటి రాంబాబు తెలిపారు. ఇవన్నీ విస్మరించి ఏం జరిగినా.. అన్నింటికి వైయస్సార్‌ లేదా మాజీ సీఎం వైఎస్ జగన్‌ ని బాధ్యులను చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని అంబటి రాంబాబు ఆక్షేపించారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న చంద్రబాబు, ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని, ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారని, అన్నింటికీ జగన్‌ ని నిందిస్తున్నారని ఇదిసరికాదని ఏపీ ప్రభుత్వానికి అంబటి రాంబాబు హితవు పలికారు.

Also Read: AP Liquor Policy: మందుబాబులకు గుడ్ న్యూస్, ఏపీలో భారీగా తగ్గనున్న మద్యం ధరలు, క్వార్టర్ ధర ఎంతంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget