అన్వేషించండి

Minister Kottu Satyanarayana :షూటింగ్ గ్యాప్ లో ట్వీట్లు, చంద్రబాబును నిలబెట్టుకోవాలనే పవన్ తాపత్రయం- మంత్రి కొట్టు సత్యనారాయణ

Minister Kottu Satyanarayana : చంద్రబాబు కోసం తాపత్రయపడుతున్న పవన్ కు ఎలాంటి రాజకీయ విలువలు లేవని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు.

Minister Kottu Satyanarayana : పవన్ ట్వీట్లతో ప్రజలతో ఉన్నాను అనే భ్రమలో ఉన్నారని మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ ఎద్దేవా చేశారు.  షూటింగ్ గ్యాప్ లో  ట్వీట్ లు చేయ‌టం ప‌వ‌న్ కు అల‌వాట‌ని వ్యాఖ్యానించారు. అంతే కాదు పవన్ కు రాజకీయ విలువలు లేవని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని, మా సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందని కొట్టు సత్యనారాణ ఆవేద‌న వ్యక్తం చేశారు. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ ను వ్యతిరేకిస్తున్నారన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. 600 మందితో యాత్ర చేయమంటే టీడీపీ వాళ్లు ఎందుకు పాల్గొంటున్నారని ఆయ‌న ప్రశ్నించారు. టీడీపీ నేత‌లు రైతులు ముసుగులో చేస్తున్న పాద‌యాత్ర విష‌యాన్ని  కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

దేవాల‌యాల్లో టికెట్ ధ‌ర‌ను పెంచ‌లేదు 

ఏపీలోని  ఆల‌యాల్లో టికెట్ ధర‌ల‌ను ఎక్కడా పెంచ‌లేద‌ని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్లకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపినట్లు మంత్రి సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, భీమవరం గుణుపూడి సోమేశ్వర స్వామి దేవాలయం, శ్రీకాకుళం పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దేవాలయం, తిరుపతి తిమ్మయ్యపట్నం శ్రీ కోదండరామ స్వామి దేవాలయలం, పాలక మండళ్లకు  రాష్ట్ర ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపిందన్నారు.  రాష్ట్రంలో 2009 తర్వాత 13 సంవత్సరాల తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం జరిగింది. దేవాలయాలు, మఠాలకు సంబంధించి ప్రభుత్వానికి కూడా లేని అత్యున్నతమైన అధికారాలు ధార్మిక పరిషత్ కు రాజ్యాంగ పరంగా ఉన్నాయని ఆయన తెలిపారు.  

ధార్మిక పరిషత్ సమావేశం 

దేవాలయాలు, మఠాల నిర్వహణలో ఎటువంటి అన్యాయాలు, అక్రమాలకు తావులేకుండా వాటిని  క్రమబద్దీకరించడానికి ఈ ధార్మిక పరిషత్ అధికారాలు ఉన్నాయని మంత్రి కొట్టు తెలిపారు. ధార్మిక పరిషత్ తొలి సమావేశంలో  రాష్ట్రంలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఆదాయం ఉన్న  దేవాలయాల పాలక మండళ్లను ఆమోదించడంతో పాటు మఠాలకు సంబంధించిన వాటిపై సమగ్రంగా చర్చించామన్నారు. మఠాలకు సంబంధించి ముఖ్యంగా హాథీరాంజీ మఠం, బ్రహ్మంగారి మఠం, గాలిగోపుర మఠం, బ్రహ్మానంద మఠం, జగ్గయ్యపేట, అహాబిలం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంపై  ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించామన్నారు. వాటి విధి, విధానాలను పరిశీలించామన్నారు. హాథీరాం మఠం దాదాపు 650 సంవత్సరాల క్రింతం ఏర్పడిందని, ఈ మఠానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జగ్గయ్యపేటలోని బ్రహ్మానంద మఠం వివరాలపై నివేదిక  రూపొందించి ధార్మిక పరిషత్ కు అందజేసేందుకు ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశామన్నారు.   

నాయి బ్రాహ్మణుల‌కు న్యాయం చేస్తాం 

అసిస్టెంట్ కమిషనర్, డిప్యుటీ కమిషనర్, జాయింట్ కమిషనర్  హోదా స్థాయి దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల న్యాయమైన కోర్కెను సానుకూలంగా పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వారి జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రతి నెలా కనీస వేతనం రూ.20 వేలు అందేలాచూడాలని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు. ఇలాంటి దేవాలయాలు రాష్ట్రంలో 50  వరకూ ఉన్నాయని, వాటిలో దాదాపు 850 మంది నాయీ బ్రాహ్మణులు పనిచేస్తున్నారన్నారు. కేశఖండనకై ప్రతి వ్యక్తి నుంచి వారు రూ.25/- లు వసూలు చేస్తుంటారని, ఈ విధంగా వసూలు చేసే సొమ్మును నాయీ బ్రాహ్మణులే ఉపయోగించుకుంటారన్నారు. అయితే  అలా వసూలు  అయ్యే సొమ్ము ఆఫ్ సీజన్ లో నెలకు కనీసం రూ.20 వేలు కూడా ఉండకపోవడం వల్ల వారి జీవనోపాధి చాలా కష్టంగా ఉంటుందని నాయీ బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.  ప్రతి దేవాలయంలో సంక్షేమ ట్రస్టు ఉందని, ఆ ట్రస్టు ద్వారా  వీరికి కనీస వేతనంగా రూ.20 వేలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా కేశఖండనకై వసూలు చేసే సొమ్ము రూ.25/- నుంచి రూ.35/-లకు పెంచాలని నాయీ బ్రాహ్మణుల కోరుతున్నారని, ఈ విషయం కూడా ప్రభుత్వ పరిశీనలో ఉన్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Advertisement

వీడియోలు

Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
క్రూయిస్ కంట్రోల్‌తో Hero Xtreme 160R 2026 అవతార్‌ - లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లలో ప్రత్యక్షం
2026 Hero Xtreme 160R షోరూమ్‌లలోకి ముందే వచ్చేసింది - కొత్త ఫీచర్లు, కొత్త అటిట్యూడ్‌
US Shutdown: ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
Embed widget