అన్వేషించండి

Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Jublhills: ముస్లిం టోపీ పెట్టుకునే పరిస్థితి వస్తే తల నరుక్కుంటానని బండి సంజయ్ ప్రకటించారు. జూబ్లిహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Bandi Sanjay Controversial comments:  బోరబండ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘‘ఓట్ల కాంగ్రెసోళ్లు తురకోళ్ల లెక్క  టోపీ పెట్టుకుని, నమాజ్ చేస్తూ డ్రామాలాడుతున్నరు. మళ్లా చెబుతున్నా.. నేను అట్లాంటి పని చేయను. ఎందుకంటే నేను హిందువును. ఇతర మతాలను గౌరవిస్తా తప్ప కించపర్చను. ఒకవేళ టోపీ పెట్టుకునే పరిస్థితే వస్తే నా తల నరుక్కుంటా. టోపీ మాత్రం పెట్టను’’  అని ప్రకటించారు.  జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో నిర్వహించిన సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై సంజయ్ మాటల తూటాలు పేల్చారు. ‘‘కాంగ్రెసోళ్లను చూస్తుంటే అనుమానమొస్తుంది. వీళ్ల డీఎన్ఏను చెక్ చేయాల్సిందే...’’అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఇది నా మాట కాదు. గోపీనాథ్ తల్లి చెప్పిన మాటనే చెబుతున్నా. సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషమున్నా గోపీనాథ్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలి. కేటీఆర్ ను బొక్కలో వేసి థర్డ్ డిగ్రీ విచారణ చేయాలి. అప్పుడే వాస్తవాలు బయటపడతాయి’’అని వ్యాఖ్యానించారు.  
  
కేసీఆర్ పెద్ద మూర్ఖుడు.. ఆయన కొడుకు ఇంకా మూర్ఖుడు. ఈమధ్య జనతా గ్యారేజ్ డైలాగ్ కొడుతున్నడు. మూడేళ్ల తరువాత వాళ్ల అయ్య బయటకు వస్తడట. సీఎం అయితడు. జనం చస్తుంటే రాడు.. రైతులు అల్లాడుతుంటే రాడు. యాక్సిడెంట్స్ అయి జనం పోతుంటే రాడు... ఇగ సీఎం ఎక్కడైతడు? అసలు కేటీఆర్ కు తండ్రి సీఎం కావాలనే ఆశ లేనేలేదు....తండ్రిని పక్కకు తోసి ఎప్పుడెప్పుడు సీఎం కావాలని చూస్తున్నడు కేటీఆర్ కు వావి వరసల్లేవు. చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదు. హింస పెట్టిండు.. కల్వకుంట్ల కవిత.... అంతో ఇంతో తల్లిదండ్రులను అంతో ఇంతో మంచిగ చూసుకునేది ఆడపిల్లలే మీ అన్న, మీ బావ, మీ బాబాయి కొడుకుతో జాగ్రత్త.... అప్పుడప్పుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకో అని సలహా ఇచ్చారు. 

 ప్రజలు అల్లాడుతుంటే ఓదార్చింది మేం... రైతుల బాధను పంచుకుంది మేం.. ఈ రెండేళ్లలో కేసీఆర్, ఆయన కొడుకు ఎన్నడైనా వచ్చాడా? అందుకే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కనువిప్పు కావాలి. మాగంటి గోపీనాథ్ చావుకు కారణం కేటీఆరేనని ఆమె తల్లే చెబుతోంది. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా. గోపీనాత్ మరణంపై విచారణ జరపాలి. రేవంత్ రెడ్డి... నీకు రోషం, పౌరుషం ఉంటే విచారణ జరపాలి. ట్విట్టర్ టిల్లును లోపలేసి థర్డ్ డిగ్రీ చేసి విచారణ జరపాల్సిందే అన్నారు.  
 
 .ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్...వాళ్లతో జాగ్రత్త. వాళ్లతో జత కొడుతున్న కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారు జాగ్రత్త. 6 గ్యారంటీలను అమలు చేస్తామని మాట ఇచ్చిన తప్పిన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తానన్న రేవంత్ రెడ్డి .... రూ.9 వేల కోట్ల అవినీతిపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాసిండు. ఎవరిని కాపాడేందుకు లక్ష కోట్ల అవినీతిపై విచారణ అడగడం లేదు?  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి దోచుకున్న పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే. హైదరాబాద్ లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోందంటే అది మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులేజ నేను సవాల్ చేస్తున్నా... హైదరాబాద్ అభివ్రుద్ధిపై లెక్కా పత్రంతో చర్చించేందుకు మేం సిద్ధం. మేం అభివ్రుద్ధి గురించి మాట్లాడుతుంటే వాళ్లు మతం గురించి మాట్లాడుతున్నరు. వాళ్లవి లక్ష ఓట్లు మాత్రమే... మరి మన ఓట్లు 3 లక్షలు ఓట్లు. కానీ వాళ్ల ఓట్ల కోసం ఒవైసీ సంకనాకుతున్నరు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అని మండిపడ్డారు. 

ఒక వర్గం ఓట్ల కోసం టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చిండు. రేవంత్ టోపి పెట్టుకుంటే పక్కనే ఉన్న అజహరుద్దీన్ కూడా ఓట్ల బిచ్చగాళ్ల లెక్క చూసి నవ్వుతున్నడు. అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? నీకు దమ్ముంటే...ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? జూబ్లిహిల్స్ ఓటర్లరా... 30 శాతం ఓట్ల కోసం 70 శాతం ఓట్లను పక్కనపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ది  చెప్పాలని పిలుపునిచ్చారు. 

హిందువులారా... మీరంతా ఓటు బ్యాంకుగా మారి మీ సత్తా చాటండి. ముస్లింల ఇండ్లకు పోయి మిక్సర్, గ్రైండర్, కుట్టు మిషన్లు ఇస్తూ దండం పెడుతున్నరు. హిందువులను మాత్రం పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి 40 వేల బురఖాలను తెప్పించాడట. బురఖాలు వేయించి దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలని చూస్తున్నడు. ఎన్నికల కమిషన్ ను కోరుతున్నా.... మీరు దొంగ ఓట్లపై నజర్ పెట్టండి. రాముడి వారుసులైన బీజేపీకి ఓటేయాలని జూబ్లిహిల్స్ ఓటర్లను కోరుతున్నా. 3 లక్షల మంది హిందూ ఓటర్లంతా ఒక్కటైతే ఎట్లా ఉంటదో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రుచి చూపించాలన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈనెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు
ఈనెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు
Special Intensive Revision Voters Telangana: పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget