అన్వేషించండి

Lakshmi Parvati : చంద్రబాబు అధికార దాహమే అసలు కారణం, 1995 సంక్షోభంపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Lakshmi Parvati : అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు, బాలయ్య సంభాషణపై లక్ష్మీ పార్వతి స్పందించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్ చనిపోవడానికి కారణమంటూ విమర్శలు చేశారు.

Lakshmi Parvati : అన్ స్టాపబుల్ షో లో 1995లో జరిగిన పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. ఈ షో ప్రోమో వచ్చినప్పటి నుంచి సంచలనం సృష్టించింది. 1995 ఆగస్టు సంక్షోభం గురించి మొదటిసారి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పందించారు. 1995 ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు వేరే పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 1995 పరిణామాలపై చంద్రబాబు మొదటిసారి నోరు విప్పారన్నారు. చంద్రబాబు 40-50 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని అప్పుడు ఎన్టీఆర్ తనతో చెప్పారని లక్ష్మీ పార్వతి చెప్పారు. వేరే పార్టీ పెట్టేందుకు చంద్రబాబు అప్పుడు దాసరి నారాయణరావు, చిరంజీవిని కలిశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. టీడీపీ ఓడిపోతుందని కూడా చంద్రబాబు అప్పుడు ప్రచారం చేయించారన్నారు. తమ పెళ్లి కారణంగా టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారని  లక్ష్మీపార్వతి ఆరోపించారు.

చంద్రబాబు అధికార దాహమే! 

టీడీపీలో తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆనాడు తాను పార్టీలో ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎన్టీఆర్ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార దాహంతో చంద్రబాబు కుట్ర చేసి పార్టీ లాగేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్‌ను చంపేసిందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చారన్న కోపంతో కొంతమంది ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి చంద్రబాబు ఆందోళనలు చేయించారన్నారు. పార్టీ క్రమశిక్షణా చర్యలు కింద కొంత మంది ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ సస్పెండ్ చేశారు. 20 మందిని సస్పెండ్ చేశారని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు.  అన్ స్టాపబుల్ షో లో ఇద్దరు వెన్నుపోటుదారులు ఒకరినొకరు సమర్ధించుకున్నారని బాలకృష్ణ, చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చంద్రబాబుకి ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదన్నారు.  బాలకృష్ణను బాగా అభిమానించనని, కాని వారి మాటలు వింటే అసహ్యం వేస్తుందన్నారు. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగారని మండిపడ్డారు. ఈ షోలో బాలకృష్ణ, చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. 

బిగ్ డెసిషన్ 

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్ అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు 1995 నాటి ఆగస్టు సంక్షోభం తెరవనుక పరిస్థితులపై తొలి సారిగా స్పందించారు. ఇప్పటి వరకూ అందరూ తననే నిందిస్తున్నా.. ఆ సంక్షోభ సమయంలో తనవైపు ఉండి చివరికి పార్టీలు మారి తననే వేలెత్తి చూపిస్తున్నా ఇప్పటి వరకూ చంద్రబాబు స్పందించలేదు. కానీ తొలిసారి ఆ అంశంపై బాలకృష్ణ షోలో స్పందించారు. తన  జీవితంలో తీసుకున్న బిగ్ డెసిషన్ అని అప్పుడేం జరిగిందో వివరించారు. 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ పూర్తిగా బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రభావంలో ఉండిపోయారన్నారు. అయితే ఆ వ్యక్తి లక్ష్మి పార్వతి అని చంద్రబాబు చెప్పలేదు. ఆమె పేరును కూడా ప్రస్తావించలేదు. పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయని.. ఈ అంశంపై మాట్లాడేందుకు బీవీ మోహన్ రెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణలతో కలిసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లామన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని బతిమాలుకున్నామన్నారు. అయినా వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరం కలిసి చర్చించిన తర్వాతనే పార్టీని కాపాడుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

Also Read : Babu Balakrishna AHA : అన్‌స్టాపబుల్ క్లారిటీ - ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు చెప్పిన సీక్రెట్స్ ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Embed widget