అన్వేషించండి

Lakshmi Parvati : చంద్రబాబు అధికార దాహమే అసలు కారణం, 1995 సంక్షోభంపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Lakshmi Parvati : అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు, బాలయ్య సంభాషణపై లక్ష్మీ పార్వతి స్పందించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్ చనిపోవడానికి కారణమంటూ విమర్శలు చేశారు.

Lakshmi Parvati : అన్ స్టాపబుల్ షో లో 1995లో జరిగిన పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. ఈ షో ప్రోమో వచ్చినప్పటి నుంచి సంచలనం సృష్టించింది. 1995 ఆగస్టు సంక్షోభం గురించి మొదటిసారి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పందించారు. 1995 ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు వేరే పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 1995 పరిణామాలపై చంద్రబాబు మొదటిసారి నోరు విప్పారన్నారు. చంద్రబాబు 40-50 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని అప్పుడు ఎన్టీఆర్ తనతో చెప్పారని లక్ష్మీ పార్వతి చెప్పారు. వేరే పార్టీ పెట్టేందుకు చంద్రబాబు అప్పుడు దాసరి నారాయణరావు, చిరంజీవిని కలిశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. టీడీపీ ఓడిపోతుందని కూడా చంద్రబాబు అప్పుడు ప్రచారం చేయించారన్నారు. తమ పెళ్లి కారణంగా టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారని  లక్ష్మీపార్వతి ఆరోపించారు.

చంద్రబాబు అధికార దాహమే! 

టీడీపీలో తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆనాడు తాను పార్టీలో ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎన్టీఆర్ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార దాహంతో చంద్రబాబు కుట్ర చేసి పార్టీ లాగేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్‌ను చంపేసిందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చారన్న కోపంతో కొంతమంది ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి చంద్రబాబు ఆందోళనలు చేయించారన్నారు. పార్టీ క్రమశిక్షణా చర్యలు కింద కొంత మంది ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ సస్పెండ్ చేశారు. 20 మందిని సస్పెండ్ చేశారని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు.  అన్ స్టాపబుల్ షో లో ఇద్దరు వెన్నుపోటుదారులు ఒకరినొకరు సమర్ధించుకున్నారని బాలకృష్ణ, చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చంద్రబాబుకి ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదన్నారు.  బాలకృష్ణను బాగా అభిమానించనని, కాని వారి మాటలు వింటే అసహ్యం వేస్తుందన్నారు. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగారని మండిపడ్డారు. ఈ షోలో బాలకృష్ణ, చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. 

బిగ్ డెసిషన్ 

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్ అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు 1995 నాటి ఆగస్టు సంక్షోభం తెరవనుక పరిస్థితులపై తొలి సారిగా స్పందించారు. ఇప్పటి వరకూ అందరూ తననే నిందిస్తున్నా.. ఆ సంక్షోభ సమయంలో తనవైపు ఉండి చివరికి పార్టీలు మారి తననే వేలెత్తి చూపిస్తున్నా ఇప్పటి వరకూ చంద్రబాబు స్పందించలేదు. కానీ తొలిసారి ఆ అంశంపై బాలకృష్ణ షోలో స్పందించారు. తన  జీవితంలో తీసుకున్న బిగ్ డెసిషన్ అని అప్పుడేం జరిగిందో వివరించారు. 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ పూర్తిగా బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రభావంలో ఉండిపోయారన్నారు. అయితే ఆ వ్యక్తి లక్ష్మి పార్వతి అని చంద్రబాబు చెప్పలేదు. ఆమె పేరును కూడా ప్రస్తావించలేదు. పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయని.. ఈ అంశంపై మాట్లాడేందుకు బీవీ మోహన్ రెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణలతో కలిసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లామన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని బతిమాలుకున్నామన్నారు. అయినా వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరం కలిసి చర్చించిన తర్వాతనే పార్టీని కాపాడుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

Also Read : Babu Balakrishna AHA : అన్‌స్టాపబుల్ క్లారిటీ - ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు చెప్పిన సీక్రెట్స్ ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila fires on Jagan: అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget