అన్వేషించండి

Lakshmi Parvati : చంద్రబాబు అధికార దాహమే అసలు కారణం, 1995 సంక్షోభంపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Lakshmi Parvati : అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు, బాలయ్య సంభాషణపై లక్ష్మీ పార్వతి స్పందించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్ చనిపోవడానికి కారణమంటూ విమర్శలు చేశారు.

Lakshmi Parvati : అన్ స్టాపబుల్ షో లో 1995లో జరిగిన పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. ఈ షో ప్రోమో వచ్చినప్పటి నుంచి సంచలనం సృష్టించింది. 1995 ఆగస్టు సంక్షోభం గురించి మొదటిసారి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పందించారు. 1995 ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు వేరే పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 1995 పరిణామాలపై చంద్రబాబు మొదటిసారి నోరు విప్పారన్నారు. చంద్రబాబు 40-50 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని అప్పుడు ఎన్టీఆర్ తనతో చెప్పారని లక్ష్మీ పార్వతి చెప్పారు. వేరే పార్టీ పెట్టేందుకు చంద్రబాబు అప్పుడు దాసరి నారాయణరావు, చిరంజీవిని కలిశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. టీడీపీ ఓడిపోతుందని కూడా చంద్రబాబు అప్పుడు ప్రచారం చేయించారన్నారు. తమ పెళ్లి కారణంగా టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారని  లక్ష్మీపార్వతి ఆరోపించారు.

చంద్రబాబు అధికార దాహమే! 

టీడీపీలో తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆనాడు తాను పార్టీలో ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎన్టీఆర్ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార దాహంతో చంద్రబాబు కుట్ర చేసి పార్టీ లాగేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్‌ను చంపేసిందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చారన్న కోపంతో కొంతమంది ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి చంద్రబాబు ఆందోళనలు చేయించారన్నారు. పార్టీ క్రమశిక్షణా చర్యలు కింద కొంత మంది ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ సస్పెండ్ చేశారు. 20 మందిని సస్పెండ్ చేశారని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు.  అన్ స్టాపబుల్ షో లో ఇద్దరు వెన్నుపోటుదారులు ఒకరినొకరు సమర్ధించుకున్నారని బాలకృష్ణ, చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చంద్రబాబుకి ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదన్నారు.  బాలకృష్ణను బాగా అభిమానించనని, కాని వారి మాటలు వింటే అసహ్యం వేస్తుందన్నారు. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగారని మండిపడ్డారు. ఈ షోలో బాలకృష్ణ, చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. 

బిగ్ డెసిషన్ 

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్ అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు 1995 నాటి ఆగస్టు సంక్షోభం తెరవనుక పరిస్థితులపై తొలి సారిగా స్పందించారు. ఇప్పటి వరకూ అందరూ తననే నిందిస్తున్నా.. ఆ సంక్షోభ సమయంలో తనవైపు ఉండి చివరికి పార్టీలు మారి తననే వేలెత్తి చూపిస్తున్నా ఇప్పటి వరకూ చంద్రబాబు స్పందించలేదు. కానీ తొలిసారి ఆ అంశంపై బాలకృష్ణ షోలో స్పందించారు. తన  జీవితంలో తీసుకున్న బిగ్ డెసిషన్ అని అప్పుడేం జరిగిందో వివరించారు. 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ పూర్తిగా బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రభావంలో ఉండిపోయారన్నారు. అయితే ఆ వ్యక్తి లక్ష్మి పార్వతి అని చంద్రబాబు చెప్పలేదు. ఆమె పేరును కూడా ప్రస్తావించలేదు. పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయని.. ఈ అంశంపై మాట్లాడేందుకు బీవీ మోహన్ రెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణలతో కలిసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లామన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని బతిమాలుకున్నామన్నారు. అయినా వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరం కలిసి చర్చించిన తర్వాతనే పార్టీని కాపాడుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

Also Read : Babu Balakrishna AHA : అన్‌స్టాపబుల్ క్లారిటీ - ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు చెప్పిన సీక్రెట్స్ ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Who is Sameer Minhas: వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
Embed widget