అన్వేషించండి

Pawan Kalyan : ఓటమి భయంతోనే వైసీపీ దాడులు, తీరు మారకుంటే రోడెక్కక తప్పదు - పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఓటమి భయంతోనే వైసీపీ నేతలు జనసేన టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ తీరుమారకుంటే తానే స్వయంగా రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు.

 Pawan Kalyan : విజయవాడ, జగ్గయ్య పేట నియోజకవర్గాల్లో జనసైనికులపై వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ నేతలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తెలియజేస్తుందన్నారు. విజయవాడలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ను జనసేన జెండా ఆవిష్కరించకుండా అడ్డుకోవడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు జేసీబీతో కూల్చివేసిన ఘటనలో దోషులపై కేసు నమోదు చేయకుండా జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో పోలీసులు ఆలోచించుకోవాలన్నారు. 

పోలీసులు తలదించుకునే పరిస్థితి రాకూడదు 

జనసేన తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని అనుమతి లేదనే సాకుతో పోలీసులు అడ్డుకుంటున్నారని, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు ప్రవర్తిస్తున్నారని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు.  అధికార పార్టీ నేతలు అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని గ్రామ గ్రామాన పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మెలు మున్సిపల్‌, పంచాయతీల ముందస్తు అనుమతి తీసుకుంటున్నారా? అని నిలదీశారు. వాటన్నింటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలారా?, అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. జనసేన పార్టీ ఉనికిని లేకుండా చేయడం ఎవరి తరం కాదని, ప్రజలే పార్టీని కాపాడుకుంటారన్నారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే రోడ్డు మీదకు రాలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తానే స్వయంగా రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. పోలీసుల సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారని, మరో పార్టీ అధికారంలోకి వస్తే తలదించుకునే పరిస్థితి రాకూడదన్నారు. 

జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ 

 విజయవాడలో శుక్రవారం జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేసేందుకు వైసీపీ నేతలు యత్నించడంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కు అక్కడు చేరుకుని నిరసన తెలిపారు. రోడ్డు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని పోతిన మహేష్ ఆరోపించారు.   

Also Read : Nara Lokesh On Anna Canteen : ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహిస్తాం, తెనాలి ఘటనపై లోకేశ్ ఫైర్

Also Read : Tenali Anna Canteen : తెనాలిలో "అన్న క్యాంటీన్" రగడ - అక్కడ కర్ఫ్యూ కంటే ఎక్కువగా రూల్స్ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget