By: ABP Desam | Updated at : 29 Apr 2022 08:13 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎస్ ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు
AB Venkateswararao Meets CS : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ సెక్రటేరియట్ కు వచ్చారు. యూనిఫాంలో వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ సమీర్శర్మను కలిశారు. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ సమీర్ శర్మ దృష్టికి తీసుకెళ్లానని ఏబీవీ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎస్కు రిపోర్ట్ చేశానన్నారు. పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. పోస్టింగ్ ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ను కోరానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రెండేళ్లకు పైగా సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వా్న్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ సచివాలయానికి వచ్చారు.
వివాదం ఏమిటి?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో నిబంధనలు అతిక్రమించారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం అభియోగాలు చేసింది. సస్పెన్షన్కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీవీ పనిచేశారు.
పరువు నష్టం దావా వేస్తానన్న ఏబీవీ
ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన కేసులకు ప్రభుత్వ సీపీఆర్వో చేసిన ప్రచారానికి సంబంధం లేదని తనపై దేశద్రోహం ఆరోపణలు చేశారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారందరిపై పరువు నష్టం దావా వేస్తానని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ఆయనకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తన సస్పెన్షన్ గడువు ముగిసిందని తనను విధుల్లోకి తీసుకుని పూర్తి జీతం ఇవ్వాలని ఆయన సీఎస్కు లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో విధుల్లోకి తీసుకుంటారా లేక మరో నిర్ణయం ఏమైనా ఉంటుందా వేచి చూడాలి.
Anantapur News: డిసెంబర్ 1 ఎయిడ్స్ డే: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ పింఛను ఎంతో తెలుసా
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా
Nara Lokesh: అమ్మ, చెల్లిని చూసినా జగన్కి భయమే, నాగార్జున సాగర్ ఇష్యూ కోడికత్తి లాంటిదే - లోకేశ్
Nagarjuna Sagar Issue: కృష్ణాబోర్డు చేతికి నాగార్జున సాగర్ డ్యాం - కేంద్ర బలగాల పర్యవేక్షణ! సమస్యకు పరిష్కారం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>