అన్వేషించండి

AB Venkateswararao : సచివాలయంలో సీఎస్ ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు, పోస్టింగ్ ఇస్తారా?

AB Venkateswararao Meets CS : ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర సెక్రటేరియట్ కు వచ్చి సీఎస్ సమీర్ శర్మను కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎస్ కు అందించి పోస్టింగ్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

AB Venkateswararao Meets CS : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ సెక్రటేరియట్ కు వచ్చారు. యూనిఫాంలో వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ సమీర్‌శర్మను కలిశారు. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ సమీర్ శర్మ దృష్టికి తీసుకెళ్లానని ఏబీవీ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎస్‌కు రిపోర్ట్ చేశానన్నారు. పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. పోస్టింగ్ ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌ను కోరానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రెండేళ్లకు పైగా సస్పెన్షన్‌ కొనసాగించడం కుదరదని ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వా్న్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ సచివాలయానికి వచ్చారు.

వివాదం ఏమిటి? 

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో నిబంధనలు అతిక్రమించారని ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం అభియోగాలు చేసింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ కు చెందిన అధికారి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ పనిచేశారు.

పరువు నష్టం దావా వేస్తానన్న ఏబీవీ 

ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన కేసులకు ప్రభుత్వ సీపీఆర్వో చేసిన ప్రచారానికి సంబంధం లేదని తనపై దేశద్రోహం ఆరోపణలు చేశారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారందరిపై పరువు నష్టం దావా వేస్తానని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ఆయనకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తన సస్పెన్షన్ గడువు ముగిసిందని  తనను విధుల్లోకి తీసుకుని పూర్తి జీతం ఇవ్వాలని ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో విధుల్లోకి తీసుకుంటారా లేక మరో నిర్ణయం ఏమైనా ఉంటుందా వేచి చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget