అన్వేషించండి

Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే

Hyderabad Chennai High Speed Rail Corridor: హైదరాబాద్ నుంచి చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌లో అమరావతికే తొలి ప్రాధాన్యమని తేలింది. అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం అమరావతి మీదుగా నిర్ధారణ.
  • మూడు హైస్పీడ్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్‌లో 854 కి.మీ. విస్తరింపు.
  • పలమనేరు కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యంలో 11 కి.మీ. సొరంగం.
  • హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సర్వేలు త్వరగా పూర్తిచేయాలని అధికారులు కసరత్తు.

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేందుకు కొంత సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమయంలో ఈ హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం తెలిసిందే. అయితే ప్రతిష్ఠాత్మక హైదరాబాద్‌- అమరావతి- చెన్నై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగానే నిర్మించనున్నారు. అమరావతికి సమీపం ఉన్న రావెల వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కానుండటంతో బుల్లెట్ రైలు ఎలైన్‌మెంట్‌ కూడా దానికి ఆనుకొని ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. అయితే, విమానాశ్రయానికి ఆనుకొని కారిడార్ నిర్మిస్తే అది అమరావతి నగరంతో పాటు విజయవాడకు కూడా బాగా దూరమవుతుందని అధికారులు గుర్తించారు. దాంతో మొదట అనుకున్నట్లుగానే అమరావతి మీదుగానే ఈ హైస్పీడ్ రైలు కారిడార్ వెళ్లేలా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (FLS), డీపీఆర్‌ (DPR) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (NHSRCL)కు సూచించింది.

తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 760 కి.మీ కారిడార్
ఈ హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్ మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఇందులో మొత్తం 18 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణ పరిధిలో 180.32 కి.మీ. పొడవు ఉండే ఈ మార్గంలో హైదరాబాద్, శంషాబాద్, భారత్‌ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద రైల్వే స్టేషన్లు రానున్నాయి. కారిడార్ సగాని కంటే ఎక్కువ దూరం ఏపీలోనే ఉంటుంది. అత్యధికంగా ఏపీలో 518.54 కి.మీ. మేర ఈ కారిడార్ ఉండనుండగా.. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి ఏపీలో మొదటి స్టేషన్‌ అవుతుంది. ఆ తర్వాత వరుసగా అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి వద్ద స్టేషన్లను నిర్మిస్తారు. ఇక తమిళనాడులో కేవలం 61.23 కి.మీ మార్గంలో తిరువళ్లూరు, చెన్నై ఔటర్‌ రింగ్‌రోడ్‌/ మింజూర్, చెన్నై సెంట్రల్‌ స్టేషన్లు ఉంటాయి.


Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే

పలమనేరు అటవీ ప్రాంతంలో సొరంగ మార్గం
మరోవైపు, చెన్నై- బెంగళూరు కారిడార్‌లో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక్కడ పలమనేరు అటవీ ప్రాంతంలో 11.8 కి.మీ. మేర సొరంగ మార్గాన్ని (Tunnel) నిర్మించనున్నారు. చెన్నై-బెంగళూరు కారిడార్ మొత్తం 306 కి.మీ. పొడవుండగా, ఇందులో అత్యధికంగా తమిళనాడులో 133 కి.మీ, కర్ణాటకలో 101 కి.మీ, ఏపీలో 72 కి.మీ విస్తరించి ఉండనుంది. 

Also Read: Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఈ మార్గంలో ఏపీలోని చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటక పరిధిలోని స్టేషన్లు కలిపి మొత్తం 7 స్టేషన్లు వస్తాయి. ఈ 2 ప్రధాన కారిడార్లను అనుసంధానిస్తూ తిరుపతి- చిత్తూరు మధ్య ప్రత్యేక లింక్ కారిడార్‌ను కూడా చంద్రబాబు సూచనల మేరకు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ పరిశీలిస్తోంది.

ఏపీ మీదుగా వెళ్లనున్న మూడో కారిడార్ అయిన హైదరాబాద్‌- బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్ మొత్తం 597 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మార్గం అత్యధికంగా ఏపీలో 264 కి.మీ., తెలంగాణలో 239 కి.మీ, కర్ణాటకలో 94 కి.మీ. మేర ఉండనుంది. ఈ రూట్‌లో 3రాష్ట్రాల్లో కలిపి మొత్తం 15 స్టేషన్లు వచ్చేలా ప్రతిపాదించారు. తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్ సహా 6 స్టేషన్లు రానుండగా.. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ వెళ్తుంది. ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించిన సర్వేలు త్వరగా పూర్తిచేసి తుది నివేదికలు సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

Frequently Asked Questions

హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు ఎంత మరియు ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది?

ఈ కారిడార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవునా వెళ్తుంది. ఇది అమరావతి మీదుగానే సాగుతుంది.

హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ స్టేషన్లు ఉంటాయి?

ఆంధ్రప్రదేశ్‌లో దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి వద్ద స్టేషన్లను ప్రతిపాదించారు. కారిడార్‌లో 518.54 కి.మీ. ఏపీలోనే ఉంటుంది.

చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌లో సొరంగ మార్గం ఎక్కడ నిర్మిస్తున్నారు?

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా 11.8 కి.మీ. పొడవున సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది?

ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. దీని మొత్తం పొడవు 597 కిలోమీటర్లు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Sundararaja Swamy: తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget