Fact Check : తిరుపతిలో దేవుడి బొమ్మలు తీసేసి వైఎస్ఆర్సీపీ రంగులు వేశారా ? రాజకీయ విమర్శల్లో నిజం ఎంత ?
తిరుపతిలో గోడలకు ఉన్న దేవుడి బొమ్మలను తొలగించి వైఎస్ఆర్సీపీ రంగులు వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ?

Fact Check : ఆంధ్రప్రదేశ్లో ఆన్ని రాజకీయ పరమైన అంశాలే. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా అలంకరణలు చేశారు. అయితే రెండు రోజులుగా సోషల్ మీడియాలో తిరుపతిలో ముఖ్యంగా అలిపిరికి వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ రంగుు, ఫ్లెక్సీలతో నింపేశారని వీడియోలు వైరల్ అయ్యాయి. ఎక్కడా దేవుడి బొమ్మలే కనిపించలేదు. గోడలకు ఉండాల్సిన దేవుడి బొమ్మలు తొలగించి వైఎస్ఆర్సీపీ రంగులు వేశారని కొంత మంది మండిపడ్డారు.
Previously on that wall their use to be Paintings of Heritage and Culture of our State If u zoom u can observe it .
— Tyrion Lannister 🦅 (@shaulhameed24) September 26, 2022
But now due to 2 days tirp of @ysjagan they re-painted with their party colors.
Naasam ayipotaru ra @YSRCParty
React @TrendPSPK @PawanKalyan @mnadendla #Tirupati pic.twitter.com/a83VLbhp70
అయితే ఈ ఆరోపణలను వైఎస్ఆర్సీపీ ఖండించింది. దేవుడి బొమ్ములు అలాగే ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండి పడింది.
చంద్రబాబూ! @ncbn @JaiTDP ఇంత పచ్చి అబద్ధాన్ని చూపించి ప్రజలను మోసం చేయడానికి సిగ్గనిపించలేదా! #ShameOnTDP pic.twitter.com/577OpEhb1R
— YSR Congress Party (@YSRCParty) September 28, 2022
ఈ విమర్శలకు తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని స్పష్టం చేసింది. ఆ మేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కి.మీ. మేర దేవతా మూర్తుల బొమ్మలు చెరిపేసి, 10 మీ. ఉన్న చోటు చూపించి మోసం అంటావ్ ఏంటి ఫేక్ ఫెలో ? కేవలం నాలుగు బొమ్మలు మిగిల్చి, మోసం అంటావా ?
— Telugu Desam Party (@JaiTDP) September 28, 2022
హిందూ దేవతలంటే, ఎందుకు అంత కక్ష @ysjagan ?
రాష్ట్రంలో హిందూ మతం లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నావా ?#JaganPaniAyipoyindhi https://t.co/BfVEa2hY1n pic.twitter.com/kxygrTN2BW
తిరుపతిలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలకు దేవుడి బొమ్ములు చాలా కిందట వేశారు. దేవదేవుడ్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల మనసుల్లో ఆ బొమ్మలుమరింత ఆధ్యాత్మికం నింపుతాయని అనుకున్నారు. అయితే కొంత మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యాత్సాహుంతో చాలా భాగంగోడలకు వైఎస్ఆర్సీపీరంగులు వేసేశారు. రాత్రికి రాత్రి ఈ రంగులు వేసేయడంతో చాలా మంది తిరుపతి ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఈ విషయమే ఇప్పుడు దుమారంరేపుతోంది. అయితే అన్ని బొమ్మలపై అలా చేయలేదని.. కొన్ని దేవుడి బొమ్మలను ఉంచారని తాజా వీడియోల్లో స్పష్టమవుతోంది.
ఫేక్ Reddy..ఫేక్ సీఎం..
— cnu krishna (@KrishnaCnu) September 28, 2022
అబద్దాలతో పుట్టి..అబద్దాలతో గెలిసిన వైసీపీ..అదే అబద్దాలు చెప్పుకుంటూ ప్రజల్లో చులక అవుతోంది.. pic.twitter.com/zQBCrxhuUW
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

