అన్వేషించండి

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

అగ్రిగోల్డ్ బాధితులు మళ్లీ ఉద్యమబాట పడుతున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన భారీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు.

AP Agri Gold  :   ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని  సెప్టెంబర్ 6వ తేదీన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్రందన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.  అగ్రిగోల్డ్ ఖాతాదారులు చెమటోడ్చి పొదుపు చేసుకున్న నగదుతో యాజమాన్యం వేలకోట్ల ఆస్తులు పెంచుకొని జల్సాలు చేస్తున్నారని బాధితుల తరపున పోరాడుతున్న నేతలు చెబుతున్నారు.  దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ సమస్య ఉందన్నారు. 

అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై తలోమాట 

ప్రస్తుత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అగ్రిగోల్డ్ ఆస్తులు 36 వేల కోట్లు అని గతంలో ప్రకటించారని అగ్రిగోల్డ్ బాధితులు గుర్తు చేస్తున్నారు.  ముఖ్యమంత్రి జగన్ రూ.20వేల కోట్లు మాత్రమే ఉందని చెప్తున్నారన్నారు. యాజమాన్యం మాత్రం రూ.2200 కోట్లు అని చెబుతూ ఖాతాదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 20వేల కోట్ల నుండి 2200 కోట్లకు మధ్య మిగిలిన రూ. 18 వేల కోట్లు  ఎవరిదో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  2017 మార్చి 23వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ.250 కోట్లు చెల్లిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 35 మాసాలు గడిచినా మాట తప్పి మడమతిప్పి అగ్రిగోల్డ్ ఖాతాదారులను నట్టేట ముంచారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హామీ ఇచ్చి జగన్ మోసం చేశారంటున్న బాధితులు

సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2019లో రూ.240 కోట్లు చెల్లించి రూ.20వేల లోపు డిపాజిట్ దారులకు 120 రోజులలో నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు.  నేటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలకు రూ. లక్షా 67వేల కోట్లు చెల్లిస్తున్నామని ప్రకటించారని, రాష్ట్రంలోని 10 లక్షల అగ్రిగోల్డ్ బాధితులకు రూ.3040  కోట్లు ఎందుకు చెల్లించడం లేదని  ప్రశ్నించారు. అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సమస్యలతో పాటు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పట్ల కూడా స్పందించి పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీన వేలాది మందితో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ప్రకటించారు. 

సెప్టెంబర్ ఆరో తేదీన ఆక్రందన ప్రదర్శన

సెప్టెంబర్ ఆరో తేదీన ఆక్రందన ప్రదర్శనను విజయవంతం చేయాలని అగ్రిగోల్డ్ బాధిత సంఘ నేతలు పిలుపునిచ్చారు.  అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.  కేవలం 20 శాతం మంది సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయని మిగిలిన 80 శాతం సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో గద్దె దించడానికి అగ్రిగోల్డ్ బాధితుల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.3 వేల కోట్లు బటన్ నొక్కి విడుదల చేయడానికి ఎవరు అడ్డుపడుతున్నారని  వారు ప్రశ్నించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Diesel Shortage in AP: డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!
డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!
Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!
ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Tips for Child Sleep : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
Embed widget