అన్వేషించండి

Achennaidu : వాలంటీర్లను తక్షణం రాజకీయ ప్రచారం నుంచి తప్పించాలి - సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ !

Andhra News : వాలంటీర్లను వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని.. వారిని తక్షణం తప్పించాలని సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు దువ్వాడ శ్రీనివాస్ పైనా స్పందించారు.

Achennaidu Letter to the Election Commission : రాజకీయ ప్రచారంలో సచివాలయ వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీకి  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.  ఎన్నికల కార్యకలాపాల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించిందని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం తరుపున వాలంటీర్లు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారని వెల్లండించారు. వాలంటీర్లు తన సైన్యం అంటూ ముఖ్యమంత్రి అభివర్ణించారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లను ఎంచుకునే సీనియర్ సిటిజన్లకు దరఖాస్తులను సులభతరం చేయమని వాలంటీర్లకు చెప్పిన మంత్రి ధర్మనపై కూడా అచ్చెన్న ఫిర్యాదు చేశారు.
Achennaidu : వాలంటీర్లను తక్షణం రాజకీయ ప్రచారం నుంచి తప్పించాలి - సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ !
 
ఎన్నికల ప్రచారాలకు సహకరించాలని వాలంటీర్లకు 15 రోజులుగా వైకాపా నాయకులు డబ్బు, బహుమతులు ఇస్తున్నారని తెలిపారు. వాలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఇస్తున్నందున, రాజకీయ ప్రచారం చేయడం అనైతికమన్నారు. ఈ విషయాన్ని అత్యవసర అంశంగా పరిగణలోనికి తీసుకొని రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయాన్ని నిషేధించాలని అచ్చెన్న కోరారు. 
Achennaidu : వాలంటీర్లను తక్షణం రాజకీయ ప్రచారం నుంచి తప్పించాలి - సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ !
 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేస్తూ.. అచ్చెన్నాయుడు మరో లేఖ కూడ ారాశారు. 2021-22 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అక్రమల కేసుల పెట్టి అరెస్టు చేయించారని  తెలిపారు. అదే విషయాన్ని దువ్వాడ స్వయంగా చెప్పారన్నారు.  ఇప్పుడు అదే నేర వ్యూహాన్ని పునరావృతం చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. 


ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈసీ కూడా వాలంటీర్ల అంశంపై స్పష్టత ఇచ్చింది.   ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు విధుల అప్పగింతకు సంబంధించి కీలక సూచనలు చేసింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడానికి అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖరాసింది. ఇదే సమయంలో ఎన్నికల్లో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపైనా ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఈవోకు ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేసింది. ప్రతీ పోలింగ్ బూత్‌లో రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చని ఈసీ సూచించింది. అయితే ఓటర్ల వేలుకు ఇంకుపూసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతకంటే ముఖ్యమైన పనులేవీ వారికి అప్పగించవద్దంటూ ఏపీ సీఈవోకు లేఖలో సూచించింది. అలాగే బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్‌ విధుల్లోకి తీసుకోవద్దని.. వారికి పోలింగ్‌ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది. 

అయితే వాలంటీర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ నేతలు.. వారి ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నరు. పథకాలు అందవని బెదిరించేలా చేస్తున్నరు. ఈ కారణంగా విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి.              

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget