అన్వేషించండి

Achennaidu : వాలంటీర్లను తక్షణం రాజకీయ ప్రచారం నుంచి తప్పించాలి - సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ !

Andhra News : వాలంటీర్లను వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని.. వారిని తక్షణం తప్పించాలని సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు దువ్వాడ శ్రీనివాస్ పైనా స్పందించారు.

Achennaidu Letter to the Election Commission : రాజకీయ ప్రచారంలో సచివాలయ వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీకి  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.  ఎన్నికల కార్యకలాపాల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించిందని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం తరుపున వాలంటీర్లు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారని వెల్లండించారు. వాలంటీర్లు తన సైన్యం అంటూ ముఖ్యమంత్రి అభివర్ణించారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లను ఎంచుకునే సీనియర్ సిటిజన్లకు దరఖాస్తులను సులభతరం చేయమని వాలంటీర్లకు చెప్పిన మంత్రి ధర్మనపై కూడా అచ్చెన్న ఫిర్యాదు చేశారు.
Achennaidu : వాలంటీర్లను తక్షణం రాజకీయ ప్రచారం నుంచి తప్పించాలి - సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ !
 
ఎన్నికల ప్రచారాలకు సహకరించాలని వాలంటీర్లకు 15 రోజులుగా వైకాపా నాయకులు డబ్బు, బహుమతులు ఇస్తున్నారని తెలిపారు. వాలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఇస్తున్నందున, రాజకీయ ప్రచారం చేయడం అనైతికమన్నారు. ఈ విషయాన్ని అత్యవసర అంశంగా పరిగణలోనికి తీసుకొని రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయాన్ని నిషేధించాలని అచ్చెన్న కోరారు. 
Achennaidu : వాలంటీర్లను తక్షణం రాజకీయ ప్రచారం నుంచి తప్పించాలి - సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ !
 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేస్తూ.. అచ్చెన్నాయుడు మరో లేఖ కూడ ారాశారు. 2021-22 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అక్రమల కేసుల పెట్టి అరెస్టు చేయించారని  తెలిపారు. అదే విషయాన్ని దువ్వాడ స్వయంగా చెప్పారన్నారు.  ఇప్పుడు అదే నేర వ్యూహాన్ని పునరావృతం చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. 


ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈసీ కూడా వాలంటీర్ల అంశంపై స్పష్టత ఇచ్చింది.   ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు విధుల అప్పగింతకు సంబంధించి కీలక సూచనలు చేసింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడానికి అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖరాసింది. ఇదే సమయంలో ఎన్నికల్లో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపైనా ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఈవోకు ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేసింది. ప్రతీ పోలింగ్ బూత్‌లో రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చని ఈసీ సూచించింది. అయితే ఓటర్ల వేలుకు ఇంకుపూసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతకంటే ముఖ్యమైన పనులేవీ వారికి అప్పగించవద్దంటూ ఏపీ సీఈవోకు లేఖలో సూచించింది. అలాగే బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్‌ విధుల్లోకి తీసుకోవద్దని.. వారికి పోలింగ్‌ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది. 

అయితే వాలంటీర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ నేతలు.. వారి ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నరు. పథకాలు అందవని బెదిరించేలా చేస్తున్నరు. ఈ కారణంగా విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి.              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Tirumala News: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
Aditya 369 Re Release: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... 'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ మారిందోచ్... థియేటర్లలోకి వారం ముందుగా
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... 'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ మారిందోచ్... థియేటర్లలోకి వారం ముందుగా
Embed widget