అన్వేషించండి

Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని కేంద్రం తెలిపింది. మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేసింది.

 
Amaravati In LokSabha : మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని రాజసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. అమరావతి రాజధానిని విభజన చట్టం ప్రకారమే నిర్ణయించారని తెలిపారు. రాజధానిని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని కేంద్రం చెప్పిందా .. అలా చెప్పి ఉంటే.. మూడు రాజధానుల విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు దానికి విరుద్ధంగా ఉన్నట్లే కదా అని.. వైఎస్ఆర్‌సీపీ పక్ష నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.  

రాజధాని అంశంపై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి     

అమరావతి రాజధాని విభజన చట్టం ప్రకారం ఏర్పడిందని స్పష్టం చేస్తూ.. లోక్ సభలో  కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ విజయసాయిరెడ్డికి సమాధానం ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఐదు, ఆరు సెక్షన్ల కింద నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించిందని.. ఆ కమిటీ రిపోర్టును కేంద్రం.. ఏపీ ప్రభుత్వానికి పంపిందన్నారు. తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఖరారు చేసిందని.. 2015లోనే నోటిపై చేసిందని నిత్యానందరాయ్ తన సమాధానంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం బిల్లులు తెచ్చిందని తెలిపారు. 
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక  అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

మూడు రాజధానుల చట్టాల గురించి కేంద్రానికి చెప్పలేదన్న కేంద్రమంత్రి    

పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ అసెంబ్లీలో చట్టాలు చేశారన్నారు. ఆ తర్వాత ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.  అయితే ఈ చట్టాలను చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని నిత్యానందరాయ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజదాని అంశం కోర్టుల పరిధిలో ఉందన్నారు.
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక  అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

విభజన చట్టం ప్రకారం అమరావతిని ఖరారు చేశారన్న నిత్యానందరాయ్      

అమరావతిపై కేంద్ర మంత్రి సమాధానం రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి విరుద్ధంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటయిందని కేంద్రం చెప్పినందున.. ఇక మళ్లీ మళ్లీ మార్చడం సాధ్యం కాదని చెప్పినట్లయిందని అంటున్నారు. అదే సమయంలో మూడు రాజధానుల గురించి అసలు కేంద్రానిక ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పడంతో..  అసలు ఆ నిర్ణయాలతో కేంద్రానికి ఏం సంబందం లేదని చెప్పినట్లయిందని అంటున్నారు. 

సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం ఇదే చెబితే అమరావతికి అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?    

ఇప్పటి వరకూ బీజేపీ నేతలు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెబుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని నేరుగా చెప్పడానికి కేంద్ర మంత్రి సంశయించారు. విషయంలో కోర్టులో ఉందని చెప్పడంతో పాటు.. అమరావతి విభజన చట్టం ప్రకారం ఏర్పాటయిందని క్లారిటీ ఇచ్చారు. త్వరలో సుప్రీంకోర్టులో జరగనున్న అమరావతి కేసుల విచారణ సమయంలోనూ.. కేంద్రం ఇదే తరహాలో అఫిడవిట్ దాఖలు చేస్తే.. అది అమరావతి రైతులకు మరింత ఊరటనిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget