అన్వేషించండి

Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని కేంద్రం తెలిపింది. మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేసింది.

 
Amaravati In LokSabha : మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని రాజసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. అమరావతి రాజధానిని విభజన చట్టం ప్రకారమే నిర్ణయించారని తెలిపారు. రాజధానిని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని కేంద్రం చెప్పిందా .. అలా చెప్పి ఉంటే.. మూడు రాజధానుల విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు దానికి విరుద్ధంగా ఉన్నట్లే కదా అని.. వైఎస్ఆర్‌సీపీ పక్ష నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.  

రాజధాని అంశంపై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి     

అమరావతి రాజధాని విభజన చట్టం ప్రకారం ఏర్పడిందని స్పష్టం చేస్తూ.. లోక్ సభలో  కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ విజయసాయిరెడ్డికి సమాధానం ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఐదు, ఆరు సెక్షన్ల కింద నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించిందని.. ఆ కమిటీ రిపోర్టును కేంద్రం.. ఏపీ ప్రభుత్వానికి పంపిందన్నారు. తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఖరారు చేసిందని.. 2015లోనే నోటిపై చేసిందని నిత్యానందరాయ్ తన సమాధానంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం బిల్లులు తెచ్చిందని తెలిపారు. 
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

మూడు రాజధానుల చట్టాల గురించి కేంద్రానికి చెప్పలేదన్న కేంద్రమంత్రి    

పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ అసెంబ్లీలో చట్టాలు చేశారన్నారు. ఆ తర్వాత ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.  అయితే ఈ చట్టాలను చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని నిత్యానందరాయ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజదాని అంశం కోర్టుల పరిధిలో ఉందన్నారు.
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

విభజన చట్టం ప్రకారం అమరావతిని ఖరారు చేశారన్న నిత్యానందరాయ్      

అమరావతిపై కేంద్ర మంత్రి సమాధానం రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి విరుద్ధంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటయిందని కేంద్రం చెప్పినందున.. ఇక మళ్లీ మళ్లీ మార్చడం సాధ్యం కాదని చెప్పినట్లయిందని అంటున్నారు. అదే సమయంలో మూడు రాజధానుల గురించి అసలు కేంద్రానిక ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పడంతో..  అసలు ఆ నిర్ణయాలతో కేంద్రానికి ఏం సంబందం లేదని చెప్పినట్లయిందని అంటున్నారు. 

సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం ఇదే చెబితే అమరావతికి అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?    

ఇప్పటి వరకూ బీజేపీ నేతలు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెబుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని నేరుగా చెప్పడానికి కేంద్ర మంత్రి సంశయించారు. విషయంలో కోర్టులో ఉందని చెప్పడంతో పాటు.. అమరావతి విభజన చట్టం ప్రకారం ఏర్పాటయిందని క్లారిటీ ఇచ్చారు. త్వరలో సుప్రీంకోర్టులో జరగనున్న అమరావతి కేసుల విచారణ సమయంలోనూ.. కేంద్రం ఇదే తరహాలో అఫిడవిట్ దాఖలు చేస్తే.. అది అమరావతి రైతులకు మరింత ఊరటనిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget