అన్వేషించండి

Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని కేంద్రం తెలిపింది. మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేసింది.

 
Amaravati In LokSabha : మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని రాజసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. అమరావతి రాజధానిని విభజన చట్టం ప్రకారమే నిర్ణయించారని తెలిపారు. రాజధానిని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని కేంద్రం చెప్పిందా .. అలా చెప్పి ఉంటే.. మూడు రాజధానుల విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు దానికి విరుద్ధంగా ఉన్నట్లే కదా అని.. వైఎస్ఆర్‌సీపీ పక్ష నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.  

రాజధాని అంశంపై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి     

అమరావతి రాజధాని విభజన చట్టం ప్రకారం ఏర్పడిందని స్పష్టం చేస్తూ.. లోక్ సభలో  కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ విజయసాయిరెడ్డికి సమాధానం ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఐదు, ఆరు సెక్షన్ల కింద నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించిందని.. ఆ కమిటీ రిపోర్టును కేంద్రం.. ఏపీ ప్రభుత్వానికి పంపిందన్నారు. తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఖరారు చేసిందని.. 2015లోనే నోటిపై చేసిందని నిత్యానందరాయ్ తన సమాధానంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం బిల్లులు తెచ్చిందని తెలిపారు. 
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

మూడు రాజధానుల చట్టాల గురించి కేంద్రానికి చెప్పలేదన్న కేంద్రమంత్రి    

పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ అసెంబ్లీలో చట్టాలు చేశారన్నారు. ఆ తర్వాత ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.  అయితే ఈ చట్టాలను చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని నిత్యానందరాయ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజదాని అంశం కోర్టుల పరిధిలో ఉందన్నారు.
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

విభజన చట్టం ప్రకారం అమరావతిని ఖరారు చేశారన్న నిత్యానందరాయ్      

అమరావతిపై కేంద్ర మంత్రి సమాధానం రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి విరుద్ధంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటయిందని కేంద్రం చెప్పినందున.. ఇక మళ్లీ మళ్లీ మార్చడం సాధ్యం కాదని చెప్పినట్లయిందని అంటున్నారు. అదే సమయంలో మూడు రాజధానుల గురించి అసలు కేంద్రానిక ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పడంతో..  అసలు ఆ నిర్ణయాలతో కేంద్రానికి ఏం సంబందం లేదని చెప్పినట్లయిందని అంటున్నారు. 

సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం ఇదే చెబితే అమరావతికి అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?    

ఇప్పటి వరకూ బీజేపీ నేతలు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెబుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని నేరుగా చెప్పడానికి కేంద్ర మంత్రి సంశయించారు. విషయంలో కోర్టులో ఉందని చెప్పడంతో పాటు.. అమరావతి విభజన చట్టం ప్రకారం ఏర్పాటయిందని క్లారిటీ ఇచ్చారు. త్వరలో సుప్రీంకోర్టులో జరగనున్న అమరావతి కేసుల విచారణ సమయంలోనూ.. కేంద్రం ఇదే తరహాలో అఫిడవిట్ దాఖలు చేస్తే.. అది అమరావతి రైతులకు మరింత ఊరటనిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Neelam Upadhyaya: బికినీలో ప్రియాంక చోప్రా మరదలు... ఈ బ్యూటీ ఒక్కప్పుడు తెలుగు హీరోయినే
బికినీలో ప్రియాంక చోప్రా మరదలు... ఈ బ్యూటీ ఒక్కప్పుడు తెలుగు హీరోయినే
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Embed widget