News
News
X

Tiger Dead : చనిపోయిన పులి - మాంసంగా చేసుకుని తిన్న గ్రామస్తులు - ఎక్కడో కాదు !

ప్రకాశం జిల్లాలో కరెంట్ షాక్ తగిలి ఓ పులి చనిపోయింది. దాన్ని మాంసంగా పంచుకుని వండుకుని తిన్నారు కొంత మంది గ్రామస్తులు

FOLLOW US: 
Share:

Tiger Dead  :   పులిని చూడాలి కానీ కలవాలనుకోకు చంపేస్తుంది అనే సినిమా డైలాగుల్ని మనం చాలా విని ఉంటాం. కానీ వాళ్లు పులిని చూడటమే కాదు.. కోసుకుని తిన్నారు. అయితే చంపేసి తిన్నారా.. చచ్చిపోయింది కనిపిస్తే తిన్నారా అన్నది పక్కన పెడితే... పులిని మాంసంగా చేసుకుని పంచుకుని తినేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.                                                                             

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ప్రాంతం అటవీ ప్రాంతం. పులులు కూడా తిరుగుతూ ఉంటాయి. అలా ఓ పులి  విద్యుత్ కంచెకు తగిలి చనిపోయింది. దీన్ని గమనించిన   కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు.  పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.   ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి సమీప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.                                              

కానీ అసలు అటవీ సిబ్బందికి తెలియనిదేమిటంటే అప్పటికే అది చనిపోయిందని వండుకుని తినేశారని. తర్వతా  పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి చనిపోయింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పులి మాంసాన్ని వండుకుని తినేశారు. ఈ విషయం అటవీ అధికారులకు తెలియకుండా గుట్టుగా ఉన్నారు. కానీ ఈ పులి మాంసాన్ని పంచుకునే విషయంలో కొంత మందితో విబేధాలు రావడంతో బయటకు పొక్కింది.  దీంతో ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.                     

  

పులి మాంసాన్ని పంచుకున్న వారిలో ఇద్దరిని గుర్తించి అటవీ అధికారులు పిలిపించి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.   తల్లి కోసం రెండు పులి కూనలు వెతుకుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో కరెంట్ కంచెకు తగిలి చనిపోయిన పులి.. ఈ కూనల తల్లేనని అటవీ అధికారులు భావిస్తున్నారు. మామూలుగా అయితే ఇలా కరెంట్ తీగలను పెట్టడానికి నిబంధనలు అంగీకరించవు. అయితే తమపై జంతువులు దాడి చేస్తున్నాయని.. పంటలను నాశనం చేస్తున్నాయన్న కారణంగా వీటిని అటవీ ప్రాంతంలోని గ్రామస్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి వల్ల వన్యప్రాణాలు మృత్యువాత పడుతున్నాయి. 

Published at : 20 Feb 2023 02:19 PM (IST) Tags: prakasam district news tiger death villagers who ate tiger meat

సంబంధిత కథనాలు

AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?

AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?

Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు

Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

టాప్ స్టోరీస్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు