అన్వేషించండి

PRC : ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు !

పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రకటన వచ్చింది. ఇప్పటికే 27శాతం ఐఆర్ వస్తున్నా ఫిట్‌మెంట్ మాత్రం 23.29కే పరిమితం చేశారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న పీఆర్సీ అంశంపై ప్రకటన చేసింది. ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద 27 శాతం ఇస్తున్నారు. దాని కన్నా రెండు, మూడు శాతం ఎక్కువగా అయినా ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నా.. చివరికి మూడున్నర శాతం వరకూ తగ్గించి ఖరారు చేశారు. దీంతో ఉద్యోగుల జీతం తగ్గనుంది. అయితే ఉద్యోగుల జీతాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో  ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?

ప్రస్తుతం 60 ఏళ్లకు రిటైర్ అవుతారు. 2014 ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 57 ఏళ్లు మాత్రమే ఉండేది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ వయసు పరిమితిని అరవైకి పెంచారు. అప్పట్లో ఉద్యోగసంఘాలు వయసు పెంపును డిమాండ్ చేశాయి. బాధ్యతలు పూర్తిగా తీరక ముందే రిటైరవుతున్నామని .. వయసు పెంచాలని కోరాయి. అయితే ఈ సారి ఉద్యోగ సంఘాలు వయసు పరిమితి పెంపు కోసం ఎలాంటి డిమాండ్ చేయలేదు. అయితే ప్రభుత్వం మాత్రం అనూహ్యంగా రిటైర్మెంట్ వయసును 62కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

ఈ నిర్ణయం వల్ల వచ్చే రెండేళ్ల పాటు రిటైరయ్యే ఉద్యోగులు ఉండరు. ఈ కారణంగా వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ గురించిన చింత ఉండదు. ఇప్పటికే పెద్ద ఎత్తున రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు ఎవరూ రిటైర్ కారు కాబట్టి ఈ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రకటించి పీఆర్సీ జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.

Also Read: అడ్డంగా బుక్కైన బంగార్రాజు.. టికెట్‌ రేట్‌ ఇష్యూలో నాగార్జునపై ట్రోల్స్‌

కొత్త పీఆర్సీ వల్ల ప్రభఉత్వంపై అదనంగా రూ. పది వేల కోట్లకుపైగా భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లను రెండు వారాల్లో పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా కారణంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ నెలాఖరు కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. 

Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget