అన్వేషించండి

చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనకు 2 దశాబ్దాలు - అప్పుడేం జరిగిందంటే ?

2 దశాబ్దాల కిందట బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తున్న చంద్రబాబుపై నక్సలైట్లు క్లైమోర్ మైన్లతో దాడి చేశారు. ఈ ఘటన నుంచి ఆయన ప్రాణాలు కాపాడుకున్నారు. అప్పుడేం జరిగిందంటే?

 2003 అక్టోబర్ 1న టీడీపీ అధినేత, అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు పునర్జన్మ పొందారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలోని అలిపిరి ఘాట్ రోడ్డులో బాంబు దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్‌ కావడంతో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రజలతోపాటు వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే బతికానని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు.

క్లైమోర్ మైన్స్ తో పేల్చివేత
అక్టోబర్ 1 2003న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా, మావోయిస్టులు బాంబులు పేల్చారు. చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారును నక్సలైట్లు శక్తివంతమైన క్లైమోర్ మైన్స్ తో పేల్చివేశారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఘాట్ రోడ్డులోని అలిపిరి టోల్ గేట్ వద్ద బాంబు దాడి జరిగింది. 

బాంబు పేలుడు శబ్దం 2 కిలోమీటర్లు దూరం వరకు
బాంబు పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దాడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు పేలిపోయి, ఓ రాయిని ఢీకొని పల్టీలు కొట్టింది. సంఘటనా స్థలంలో మరో రెండు బాంబులు లభించాయి. అత్యంత పకడ్బందీగా రూపొందించుకున్న పథకం మేరకే నక్సలైట్లు ఈ దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన చంద్రబాబును చికిత్స కోసం హైదరాబాదు తరలించారు. చంద్రబాబుతో పాటు అప్పటి ఐటి శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి కూడా గాయాల పాలయ్యారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఎవరెవరిపై కేసులు
ఈ కేసులో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి సహా అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జీ, పాండురంగారెడ్డి అలియాస్ సాగర్, హరగోపాల్ అలియాస్ రామకృష్ణతో పాటు 35 మందిని నిందితులుగా చేర్చారు.  ఈ కేసు పదకొండేళ్ల పాటు విచారణ జరిగింది. రామ్మోహన్ రెడ్డి, నరసింహా రెడ్డి, మాలచంద్రలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులకు నాలుగేళ్ల శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2011లోనే తిరుపతి సెషన్స్ కోర్టు తొలి తీర్పు వెలువరించింది. దీనిపై నిందితులు హైకోర్టుకు వెళ్లారు. ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. రెండో ఛార్జీషీటులోని ముగ్గురిని దోషులుగా కోర్టు తేల్చింది.

నక్సైలైట్లు పక్కా ప్లాన్
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉండేది. వారిని అణిచివేయటానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించారు. దీంతో ఆయన్ని చంపాడానికి ప్రణాళికలు రచించారు. అలిపిరి టోల్ గేట్ వద్ద నక్సలైట్లు ఏకంగా తొమ్మిది శక్తిమంతమైన బాంబులను అమర్చారు. చంద్రబాబును అంతమొందించేందుకు శాయశక్తులా ప్రయత్నాంచారు. బుల్లెట్ వాహనం కారణంగా ప్రాణాలతో బయటపడ్డారు. స్వామి వారే రక్షించాడని పలు మార్లు చెప్పుకున్నారు.                         

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget