అన్వేషించండి

Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 14,440 కేసులు నమోదు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. 

ఏపీలో కొత్తగా 46,650 కరోనా పరీక్షలు చేయగా.. 14,440 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. వైరస్ బారి నుంచి కొత్తగా 3,969 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విశాఖ జిల్లాలో 2,258, అనంతపురం-1,534, గుంటూరు-1,458, ప్రకాశం 1,399, కర్నూలు 1,238, చిత్తూరు 1,198, తూర్పు గోదావరి 1012, నెల్లూరు జిల్లా 1103 కేసులు నమోదయ్యాయి.

 

దేశంలో కరోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య తగ్గినప్పటికీ మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ వైరస్ సోకింది. దేశంలో పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరిగింది. పాజిటివిటీ రేటు పెరుగుదల ఆందోళన కలిస్తుంది. కరోనా వైరస్ కారణగా మరో 525 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారి 3.89 కోట్ల మందికి సోకగా... 4,89,409 మంది మరణించారు. 

దేశంలో ఇంకా 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో 2,59,168 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ 3,65,60,650 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలో రికవరీ రేటు 93.18 శాతానికి చేరింది. భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా 71.10 లక్షల మందికి  కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. వీటితో కలిసి ఇప్పటి వరకు 1,61,92,84,270 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల టీనెజర్లు 4,15,77,103 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు వేశారు. అలాగే 80,10,256 మందికి ప్రికాషనరీ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. 

మహారాష్ట్రలో 

మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 46,393 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి. తాజాగా కోవిడ్ బారినపడి 48 మంది మరణించారు. శనివారంతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య మహారాష్ట్రలో స్వల్పంగా తగ్గింది. ముంబయిలో కొత్తగా 3,568 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్యలో 28 శాతం తగ్గాయి. 

కేరళ, దిల్లీలో 

కేరళలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. కొత్తగా 45,136 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కొత్తగా 30,744 కరోనా కేసులు రికార్డయ్యాయి. గత వారం రోజులుగా దిల్లీలో కేసులు తగ్గాయి. అయితే ఆదివారం కేసులు మళ్లీ పెరిగాయి. శనివారంతో పోలిస్తే కేసుల సంఖ్య 11,486కు చేరింది. మరో 45 మంది మరణించారు. దిల్లీలో పాజిటివిటీ రేటు మాత్రం 21.48% నుంచి 16.36% తగ్గింది. 

Also Read: PRC: సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి.. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్

Also Read: Guntur Crime: నిండు గర్భిణీపై కత్తితో దాడి... గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని డ్రామా... అనుమానంతో భర్తే ఘాతుకం

టాప్ హెడ్ లైన్స్

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Vizag Boat Accident: ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!
ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Embed widget