అన్వేషించండి

Nellore: మార్కెట్లో మల్లెలు మరీ ప్రియం, రైతుకు మాత్రం నష్టమే - మరి లాభం ఎటు పోతోంది?

మల్లెపూలను మనం మార్కెట్ లో మూరల లెక్కన కొంటుంటాం కానీ, రైతులు మాత్రం వాటిని లీటర్ల చొప్పున అమ్ముతుంటారు. తోటల వద్ద లీటరు మల్లెపూలు 30నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది.

మల్లె పూలు మూరెంత..? అబ్బో అంత రేటా..? ఇదిగో కాస్త కొసరు వేయమ్మా..? మల్లెపూలు కొనే సమయంలో అందరూ అనే మాటలే ఇవి. కానీ ఆ మల్లె పూల వెనక రైతుల కష్టం ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆ కష్టం తెలిస్తే బేరం ఆడరు. కానీ ఆ కష్టాన్నంతా దళారులే దోచుకుంటారు కానీ, రైతులకు గిట్టుబాటయ్యేది చాలా తక్కువ. కానీ నేల రకాన్ని బట్టి, మల్లె తోటల సాగుని విడిచిపెట్టకుండా వస్తున్నారు రైతులు. నెల్లూరు జిల్లా రైతాంగం మల్లె తోటల్లో పడే కష్టం చూడండి. 

మల్లెపూలను మనం మార్కెట్ లో మూరల లెక్కన కొంటుంటాం కానీ, రైతులు మాత్రం వాటిని లీటర్ల చొప్పున అమ్ముతుంటారు. తోటల వద్ద లీటరు మల్లెపూలు 30 నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. అవే పూలు దళారుల చేయి దాటి.. వినియోగదారుల వద్దకు వచ్చే సరికి లీటరు 70 రూపాయల వరకు పలుకుతుంది. కష్టం రైతులది, లాభం దళారులది.


Nellore: మార్కెట్లో మల్లెలు మరీ ప్రియం, రైతుకు మాత్రం నష్టమే - మరి లాభం ఎటు పోతోంది?

మల్లె తోటల్లో ముఖ్యంగా కూలీలకు ఎక్కువ ఖర్చు ఉంటుంది. పురుగు మందుల పిచికారీ కోసం, ఆకులు, కొమ్మల్ని తుంచడం కోసం, మల్లె మొగ్గల్ని కోసి రవాణా చేయడం కోసం కూలీలు అవసరం అవుతారు. దాదాపుగా తోటల యజమానులే కూలీలుగా పొలంలో పనిచేసుకుంటూ.. ఆ అదనపు ఖర్చు తగ్గించుకుంటారు. 

ఒండ్రు మట్టి నేలలు మల్లె సాగుకి అనుకూలం, పొడి ఇసుక నేలల్లో కూడా మల్లె తోటల్ని సాగు చేస్తుంటారు. నీరు ఎక్కువగా నిల్వ ఉంటే మాత్రం మొక్కలు కుళ్లిపోయి చనిపోతాయి. మల్లె మొక్కలు ఎలాంటి వాతావరణ ఇబ్బందులు లేకుండా ఉంటే 10-12 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది, పూలనిస్తుంది. సహజంగా వర్షాకాలం మొదలైన వెంటనే మొక్కల్ని నాటుతుంటారు. కొమ్మల్ని, ఆకుల్ని కత్తిరించడం ద్వారా కొత్త ఇగుర్లకు అవకాశం ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మల్లె తోటల సాగుకి మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో.. ఏపీలోని గుంటూరు, ప్రకాసం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో మల్లె తోటల్ని సాగు చేస్తున్నారు. పూల అలంకరణకు, పూల దండల దయారీకోసమే కాకుండా.. సువాసననిచ్చే పరిమళ ద్రవ్యాలు, సబ్బులు, నూనె, షాంపూ తయారీలోనూ మల్లె పువ్వుల్ని వాడుతుంటారు. 

మల్లెపూలకు పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కాస్త రేటు పలుకుతుంది కానీ, మిగతా రోజుల్లో మాత్రం రైతులకు పెద్దగా లాభం ఉండదు. ఇక కరోనా కాలంలో మార్కెట్ పూర్తిగా పడిపోయింది. మల్లె రైతులకూ కూడా ప్రభుత్వం దళారుల బెడద తప్పేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరుతున్నారు. మార్కెటింగ్ కి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget