అన్వేషించండి

Loan Waiver: వ్యవసాయశాఖ, బ్యాంకుల మధ్య సమన్వయ లోపం - రుణ మాఫీ అందుకోలేకపోతున్న రైతులు

Loan Waiver: లక్ష లోపు పంట రుణాల మాఫీ ప్రయోజనాన్ని కొందరు రైతులు అందుకోలేకపోతున్నారు.

Loan Waiver: రాష్ట్రంలో రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీకి ప్రభుత్వం బ్యాంకుల్లో నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రుణ మాఫీ ప్రయోజనాన్ని కొందరు రైతులు మాత్రం అందుకోలేకపోతున్నారు. వ్యవసాయశాఖ, బ్యాంకుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకు నిబంధనల ప్రకారం పంట రుణ ఖాతా కాల పరిమితి 5 సంవత్సరాలు. ఆ మేరకు పంట రుణాన్ని రైతులు ఐదేళ్ల పాటు రీషెడ్యులు చేసుకోవచ్చు. ఆయా అప్పులు తీర్చి కొత్త ఖాతా తెరవాలి. ఇలా ఐదేళ్ల కాలంలో ఎంతో మంది రైతులు పాత ఖాతాలు మూసేసి కొత్త ఖాతాలు తెరిచి వాటి ద్వారా రుణాలు తీసుకున్నారు. ఖాతా మూసివేత, కొత్త ఖాతా ఓపెనింగ్ లాంటి వివరాలను పంటరుణమాఫీ వెబ్ సైట్లో అప్‌డేట్‌ చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. కానీ ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అనేది మాత్రం పట్టించుకోలేదు. దీంతో చాలా బ్యాంకులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఆయా రుణ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వం జమ చేసిన రుణమాఫీ సొమ్ము.. తిరిగి ట్రెజరీకి వెళ్లిపోయింది.

అయితే రైతులకు మాత్రం రుణమాఫీ అయినట్లు సమాచారం వచ్చింది. కానీ బ్యాంకులకు వెళ్తే ఇంకా రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు ఉండొచ్చని అంటున్నారు. ఈ కాలంలో ఎన్నికల కోడ్ వస్తే.. వెనక్కి వెళ్లిన రుణమాఫీ నిధులు మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న, రీషెడ్యూలు చేసుకున్న రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ బ్యాంకుల నుంచి వివరాలు తీసుకుంది. సాఫ్ట్‌వేర్‌ సాయంతో కుటుంబానికి రూ. లక్ష చొప్పున రుణమాఫీ చేసేలా అర్హులను ఎంపిక చేసింది. 42.56 లక్షల మందికి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. 

మొదట రూ.37 వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతుల కోసం రూ.1943.64 కోట్లు బ్యాంకులకు చెల్లించింది రాష్ట్ర సర్కారు. ఆగస్టు 3వ  తేదీన రూ. 41 వేల లోపు రుణాలు ఉన్న 62,758 మంది రైతులకు రూ. 237.85 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు 4వ తేదీన రూ.43 వేల లోపు రుణాలు ఉన్న 31,339 మంది రైతులకు రూ.126.50 కోట్లు రిలీజ్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రూ.99,999 పంట రుణాలు ఉన్న 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా దాదాపు 17 లక్షల మంది రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దాదాపు రూ. 8 వేల కోట్లను బ్యాంకుల్లో జమ చేసింది.

పాత రుణ ఖాతాలు మూసేసి కొత్తవి తెరచినప్పుడు బ్యాంకులు లేదా వ్యవసాయ శాఖ అధికారులు వాటిని నమోదు చేయాలి. బ్యాంకర్లు అప్‌డేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని వస్తోంది. వారిని అడిగితే.. మాకేం సమాచారం లేదు.. మీరే అప్‌డేట్‌ చేసుకోవాలని బ్యాంకర్లకు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Election Exit Poll: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
Teenmar Mallanna:  తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mangli Ram Mohan Naidu Issue | కేంద్రమంత్రి రామ్మోహన్ పై మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు | ABP DesamPM Modi Maha Kumbh 2025 | మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన ప్రధాని మోదీ | ABP DesamNaga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP DesamTrump on Gaza Strip | ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి అమెరికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Election Exit Poll: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
Teenmar Mallanna:  తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
AP Graduate MLC Elections 2024: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నేతలు- కూటమికి మేలు చేయడానికా? కీడు చేయడానికా? 
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నేతలు- కూటమికి మేలు చేయడానికా? కీడు చేయడానికా? 
TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Telangana News: తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్ శుభవార్త-  ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్ శుభవార్త- ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
Naga Chaitanya: నేషనల్ అవార్డ్స్ కాదు... ఆడియన్స్‌ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్ - నాగచైతన్య ఇంటర్వ్యూ
నేషనల్ అవార్డ్స్ కాదు... ఆడియన్స్‌ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్ - నాగచైతన్య ఇంటర్వ్యూ
Embed widget