అన్వేషించండి

Andhra Pradesh: ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. అభ్యంతరాలపై అధికారులకు ప్రశ్నలు

Lands ReSurvey : రాష్ట్రంలో భూముల రీ సర్వేకు సంబంధించి రెవిన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

Andhrapradesh Lands ReSurvey : ఆంధ్రప్రదేశ్లో భూముల రీ సర్వే నిర్వహణకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులతో కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భూముల రీ సర్వే నిర్వహణకు సంబంధించి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దానికి కారణాలు ఏమిటనీ అధికారులను మంత్రి ప్రశ్నించారు. సాధారణంగా రీ సర్వే చేయించుకునేందుకు రైతులు ఆసక్తి చూపించాలని, అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. తనకు నిత్యం రీ సర్వేపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ మాదిరిగానే భూ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తుల స్వీకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సర్వేపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ మంత్రికి వివరించారు. 13,321 గ్రామాల్లో రీసర్వే సందర్భంగా డ్రోన్లతో 1.20 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వేను పూర్తి చేసినట్లు వెల్లడించారు. 12,348 గ్రామాలకు చిత్రాలు పంపించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రైతుల ఆమోదంతో 7,110 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించామని, 6,707 గ్రామాల్లో విస్తీర్ణం నిర్ధారణ చేశామన్నారు. 6,353 గ్రామాల్లో రీ సర్వే పూర్తయినట్లు నోటిఫికేషన్ ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 6,316 గ్రామాల్లో రికార్డుల్లో నమోదు ప్రక్రియ పూర్తయిందని, సర్వే నెంబర్ల స్థానంలో 81 లక్షల ల్యాండ్ పార్సిల్లను జనరేట్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 8.64 లక్షల యజమానుల పేర్లను రికార్డులు అప్డేట్ చేశామని, 86 వేల వివాదాలు పరిష్కరించినట్లు వివరించారు. 22.48 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో నమోదు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 

క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆన్లైన్లో నమోదు చేశారన్న మంత్రి 

అధికారుల వెల్లడించిన వివరాల పట్ల మంత్రి ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సర్వేయర్లు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రీ సర్వే నిర్వహణ తీరుపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయని మరోసారి అధికారులను ప్రశ్నించారు. సర్వేకు తక్కువ సమయం కేటాయించడం వల్ల పలు ఇబ్బందులు వచ్చాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరణ ఇచ్చారు. భూముల రి సర్వేకు సంబంధించి రైతుల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపైన ఉందన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, భూముల రీ సర్వే వల్ల ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకూడదని, నష్టం వచ్చిందన్న మాట వినిపించకూడదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో అర్హత కలిగిన వారిలో 34 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదని అధికారులు మంత్రికి వివరించారు. వీరందరికీ సులువుగా ఉండేలా సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని తెలిపారు. వీరి వివరాలను వీఆర్వోల లాగిన్ కు పంపించామని అధికారులు మంత్రికి వివరించారు. సుమోటో కింద ఈ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ మంత్రికి వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma Retirement : టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
CM Chandrababu : పెన్షన్ పంపిణీలో చంద్రబాబు సంచలనం - ఒకటో తేదీన స్వయంగా పంపిణీకి శ్రీకారం
పెన్షన్ పంపిణీలో చంద్రబాబు సంచలనం - ఒకటో తేదీన స్వయంగా పంపిణీకి శ్రీకారం
Darmapuri Srinivas: డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

South Africa vs India T20 World Cup Final Weather | T20WC ఫైనల్ లో వరుణుడు అడ్డుపడితే పరిస్థితి ఏంటీRohit Sharma only Player 1St T20 World Cup and Now | చరిత్రలో ఆ ఒక్కడిగా నిలిచిన రోహిత్ శర్మ | ABPSouth Africa vs India T20 World Cup Final | ప్రపంచకప్ తుది సమరానికి భారత్, దక్షిణాఫ్రికా సిద్ధం |ABPRohit Sharma T20 World Cup 2024 Final | వరల్డ్ కప్ లో ఫైనల్ రోహిత్ రెచ్చిపోవాలంటున్న ఫ్యాన్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma Retirement : టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
CM Chandrababu : పెన్షన్ పంపిణీలో చంద్రబాబు సంచలనం - ఒకటో తేదీన స్వయంగా పంపిణీకి శ్రీకారం
పెన్షన్ పంపిణీలో చంద్రబాబు సంచలనం - ఒకటో తేదీన స్వయంగా పంపిణీకి శ్రీకారం
Darmapuri Srinivas: డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Viral Video: కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళ - సినిమా స్టైల్లో రక్షించిన జాలర్లు, వైరల్ వీడియో
కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళ - సినిమా స్టైల్లో రక్షించిన జాలర్లు, వైరల్ వీడియో
Tax On UPI Transactions: యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్‌ దాటితే ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాలి
యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్‌ దాటితే ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాలి
Rajkot Airport: రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో కుప్ప కూలిన టర్మినల్ రూఫ్‌, ఢిల్లీ తరహా ఘటనతో ఉలికిపాటు
రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో కుప్ప కూలిన టర్మినల్ రూఫ్‌, ఢిల్లీ తరహా ఘటనతో ఉలికిపాటు
IPS Officers Transfers: ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌- మరోసారి IPSల బదిలీలు
ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌- మరోసారి IPSల బదిలీలు
Embed widget