అన్వేషించండి

Farmers On Jagan: ప్రభుత్వ తీసుకున్న ఆ నిర్ణయంపై కోస్తా రైతులు హర్షం- త్వరగా అమలు చేయాలంటూ విజ్ఞప్తి

రాష్ట్రంలో పంటకాలంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకృతి వైపరిత్యాల నుంచి రక్షణతోపాటు మూడో పంటలో మార్పిడికి వీలుంటుందని అభిప్రాయపడుతోంది.

వ్యవసాయాధారమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ తొలకరిపంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడి తీవ్రంగా నష్టపోతుంది. ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టాన్ని తుపాన్లు ఏటా హరించుకుపోతున్నాయి. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు పంటకాలం ముందుకు జరగాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో రైతుల నుంచి వినిపిస్తోంది. 

సాధారణంగా ప్రతీ ఏటా అక్టోబరు నుంచి డిసెంబరు నెల వరకు తుపాన్లు, భారీ వర్షాలు ఉంటాయి. ఖరీఫ్ పంట ఆలస్యం అవుతుండడంతో నవంబరు నెలాఖరుకు పంట చేతికందే పరిస్థితి ఉంది. సరిగ్గా అదే సమయంలో ప్రకృతి వైఫరీత్యాలు విరుచుకుపడుతుంటాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికందుతుందన్న తరుణంలో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. 

గడచిన 15 ఏళ్ల కాలంలో ఏ ఒక్క తొలకరి పంట పూర్తి స్థాయిలో రైతులకు చేతికందిన దాఖలాలు లేవనే రైతులు చెబుతున్నారు. తాజాగా గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ప్రధానంగా ఈ అంశం చర్చకు వచ్చింది. ఇలాంటి సమస్య భవిష్యత్‌లో రాకుండా ఉండేందుకు తొలకరి పంటకు మందస్తుగానే నీళ్లు ఇవ్వాలని తీర్మానం చేశారు. 

ఖరీఫ్ ముందుగా ప్రారంభం అవ్వడం వల్ల మూడు పంటల సాగుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. తుపాన్లు నుంచి పంటను కాపాడుకోవచ్చని, మూడో పంటలో పంట మార్పిడికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 

మోహన్ కందా సిఫార్సు

తొలకరి పంట కాలం ముందుకు జరగాలన్న డిమాండ్ ఈ నాటిది కాకపోగా బ్రిటీష్ కాలం నాటి నల్లనీటి సాగు విధానం అమలు కావాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 2011లో తూర్పుగోదావరి జిల్లా బెండమూర్లంకలో జరిపిన పంట విరామ(క్రాఫ్ హాలిడే) ఉద్యమం సందర్భంగా మోహన్ కందా కమిటీ పర్యటించి ప్రధానంగా ఈ సిఫారసు చేసింది. రైతులు ప్రకృతి వైఫరీత్యాల నుంచి తప్పించుకునేందుకు తప్పనిసరిగా పంట కాలపరిమితిలో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా పంట కాలువల నిర్వహణలో మార్పులు చేసి రైతులకు ముందస్తుగా నీళ్లు ఇవ్వాలని సూచించింది.

అసలు బ్రిటీష్ కాలంనాటి నల్లనీటి సాగు అంటే ఏమిటి.? 

బ్రిటీష్ కాలం నుంచి 1980 వరకు పంటకాల పరిమితి సక్రమంగానే నడిచింది. కాలక్రమేపి సాగు విధి విధానం పూర్తిగా గాడితప్పింది. గతంలో పంటకు మూలాధారమైన కాలువల వ్యవస్థను ఏటా ఏప్రిల్ 15న మూసివేసి మే 15 నాటికి విడుదల చేసేవారు. ఏప్రిల్ నెలలో కాలువలు మూసివేసే తరుణంలోనే నారుమడులు వేసుకునేవారు. మళ్లీ మే 15 నాటికి పంటకాలువల్లో నీరు విడుదల అయ్యే క్రమంలో నారుమడులు సిద్ధం అయ్యేవి. మళ్లీ పంట నీరు విడుదల అయ్యేనాటికి నారుమడులు సిద్ధమై జూన్ రెండో వారం నాటికే నాట్లు పూర్తి అయ్యేవి. ఏప్రిల్ నుంచి మే నెలలోపులోనే తొలకరి పంటకు నారుమడులు వేసే ప్రక్రియను నల్లనీటి సాగు అనేవారు. ఆగస్టు మాసంలో వర్షాలు విస్తారంగా కురిసినా అవి రైతులకు మేలు చేసేవి. అక్టోబరు నాటికి పంట చేతికందే దశకు చేరుకోగా సెప్టెంబర్ మెదటి వారంలోపు 99 శాతం కోతలు పూర్తయ్యేవి. మళ్లీ నవంబర్ నెలలో రబీ(దాళ్వా) పంటకు రైతులు సన్నద్ధమయ్యేవారు. ఇలా పంట కాల సమయం ముందుకు వెళ్లి ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్నదాతలు బయటపడేవారు.

ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నదేంటి..? 

ప్రకృతి వైఫరీత్యాల నుంచి రైతులను గట్టెక్కించడంతోపాటు మూడు పంటలు వేసుకునేందుకు ముందస్తుగా సాగునీరు ఇవ్వడం వల్ల ప్రయోజనముంటుందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం స్పిల్ వే పూర్తి చేసి ఎగువ కాపర్ డ్యాంను నిర్మించడంతోపాటు అక్కడ నిల్వ ఉన్న నీటిని రివర్ స్లూయీజ్ గేట్ల ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నీళ్లు ఇచ్చే తేదీలను కూడా నిర్ణయించారు. దీనిపై రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ముందస్తుగానే నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని... ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలను గమనించగలిగిందని అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget