అన్వేషించండి

Farmers On Jagan: ప్రభుత్వ తీసుకున్న ఆ నిర్ణయంపై కోస్తా రైతులు హర్షం- త్వరగా అమలు చేయాలంటూ విజ్ఞప్తి

రాష్ట్రంలో పంటకాలంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకృతి వైపరిత్యాల నుంచి రక్షణతోపాటు మూడో పంటలో మార్పిడికి వీలుంటుందని అభిప్రాయపడుతోంది.

వ్యవసాయాధారమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ తొలకరిపంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడి తీవ్రంగా నష్టపోతుంది. ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టాన్ని తుపాన్లు ఏటా హరించుకుపోతున్నాయి. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు పంటకాలం ముందుకు జరగాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో రైతుల నుంచి వినిపిస్తోంది. 

సాధారణంగా ప్రతీ ఏటా అక్టోబరు నుంచి డిసెంబరు నెల వరకు తుపాన్లు, భారీ వర్షాలు ఉంటాయి. ఖరీఫ్ పంట ఆలస్యం అవుతుండడంతో నవంబరు నెలాఖరుకు పంట చేతికందే పరిస్థితి ఉంది. సరిగ్గా అదే సమయంలో ప్రకృతి వైఫరీత్యాలు విరుచుకుపడుతుంటాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికందుతుందన్న తరుణంలో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. 

గడచిన 15 ఏళ్ల కాలంలో ఏ ఒక్క తొలకరి పంట పూర్తి స్థాయిలో రైతులకు చేతికందిన దాఖలాలు లేవనే రైతులు చెబుతున్నారు. తాజాగా గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ప్రధానంగా ఈ అంశం చర్చకు వచ్చింది. ఇలాంటి సమస్య భవిష్యత్‌లో రాకుండా ఉండేందుకు తొలకరి పంటకు మందస్తుగానే నీళ్లు ఇవ్వాలని తీర్మానం చేశారు. 

ఖరీఫ్ ముందుగా ప్రారంభం అవ్వడం వల్ల మూడు పంటల సాగుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. తుపాన్లు నుంచి పంటను కాపాడుకోవచ్చని, మూడో పంటలో పంట మార్పిడికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 

మోహన్ కందా సిఫార్సు

తొలకరి పంట కాలం ముందుకు జరగాలన్న డిమాండ్ ఈ నాటిది కాకపోగా బ్రిటీష్ కాలం నాటి నల్లనీటి సాగు విధానం అమలు కావాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 2011లో తూర్పుగోదావరి జిల్లా బెండమూర్లంకలో జరిపిన పంట విరామ(క్రాఫ్ హాలిడే) ఉద్యమం సందర్భంగా మోహన్ కందా కమిటీ పర్యటించి ప్రధానంగా ఈ సిఫారసు చేసింది. రైతులు ప్రకృతి వైఫరీత్యాల నుంచి తప్పించుకునేందుకు తప్పనిసరిగా పంట కాలపరిమితిలో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా పంట కాలువల నిర్వహణలో మార్పులు చేసి రైతులకు ముందస్తుగా నీళ్లు ఇవ్వాలని సూచించింది.

అసలు బ్రిటీష్ కాలంనాటి నల్లనీటి సాగు అంటే ఏమిటి.? 

బ్రిటీష్ కాలం నుంచి 1980 వరకు పంటకాల పరిమితి సక్రమంగానే నడిచింది. కాలక్రమేపి సాగు విధి విధానం పూర్తిగా గాడితప్పింది. గతంలో పంటకు మూలాధారమైన కాలువల వ్యవస్థను ఏటా ఏప్రిల్ 15న మూసివేసి మే 15 నాటికి విడుదల చేసేవారు. ఏప్రిల్ నెలలో కాలువలు మూసివేసే తరుణంలోనే నారుమడులు వేసుకునేవారు. మళ్లీ మే 15 నాటికి పంటకాలువల్లో నీరు విడుదల అయ్యే క్రమంలో నారుమడులు సిద్ధం అయ్యేవి. మళ్లీ పంట నీరు విడుదల అయ్యేనాటికి నారుమడులు సిద్ధమై జూన్ రెండో వారం నాటికే నాట్లు పూర్తి అయ్యేవి. ఏప్రిల్ నుంచి మే నెలలోపులోనే తొలకరి పంటకు నారుమడులు వేసే ప్రక్రియను నల్లనీటి సాగు అనేవారు. ఆగస్టు మాసంలో వర్షాలు విస్తారంగా కురిసినా అవి రైతులకు మేలు చేసేవి. అక్టోబరు నాటికి పంట చేతికందే దశకు చేరుకోగా సెప్టెంబర్ మెదటి వారంలోపు 99 శాతం కోతలు పూర్తయ్యేవి. మళ్లీ నవంబర్ నెలలో రబీ(దాళ్వా) పంటకు రైతులు సన్నద్ధమయ్యేవారు. ఇలా పంట కాల సమయం ముందుకు వెళ్లి ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్నదాతలు బయటపడేవారు.

ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నదేంటి..? 

ప్రకృతి వైఫరీత్యాల నుంచి రైతులను గట్టెక్కించడంతోపాటు మూడు పంటలు వేసుకునేందుకు ముందస్తుగా సాగునీరు ఇవ్వడం వల్ల ప్రయోజనముంటుందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం స్పిల్ వే పూర్తి చేసి ఎగువ కాపర్ డ్యాంను నిర్మించడంతోపాటు అక్కడ నిల్వ ఉన్న నీటిని రివర్ స్లూయీజ్ గేట్ల ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నీళ్లు ఇచ్చే తేదీలను కూడా నిర్ణయించారు. దీనిపై రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ముందస్తుగానే నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని... ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలను గమనించగలిగిందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget