అన్వేషించండి

Operation Sindoor PM Modi Master Stroke | మోదీ, సైన్యం కలిసి కొట్టిన దెబ్బకు విలవిలాడుతున్న పాకిస్థాన్ | ABP Desam

 కశ్మీర్ మీద దాడి చేశారు. అమాయకులైన పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఏ ఒక్కడినీ వదిలిపెట్టను. తప్పు చేసిన ప్రతీవాడికి వాడు కలలో కూడా ఊహించని శిక్షపడుతుంది. ఉగ్రవాదులను వాళ్లని పెంచి పోషిస్తున్న వాళ్లను మట్టిలో కలిపేసే సమయం వచ్చింది. ఇదీ ఏప్రిల్ 24న బిహార్ లో ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన మాట. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లో పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో 25మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా మూగగా రోదించిన ఘటన ఇది. ఊహించని విషాదాన్ని కడుపులో దాచుకుంటూ దేశాన్ని నడిపించిన నాయకుడిగా ప్రధాని మోదీ సంయమనంతో వ్యవహరించారు. త్రివిధ దళాలతో కూడిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ రెండు సార్లు జరిపిన మోదీ..దారుణానికి ఒడిగట్టిన ఉగ్రమూకలకు బుద్ధి ఎలా చెప్పాలా అని ప్రణాళికలు రచించారు. యుద్ధానికి దిగటం భారత్ కు కష్టం కాదు కానీ యుద్ధం తెచ్చే వినాశనం తెలిసి సమస్యకు పరిష్కారం కోసం అనేక మార్గాలను అన్వేషించారు. ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్, సీనియర్ కేబినెట్ మంత్రుల సలహాలతో ఓ నిర్ణయానికి వచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, కశ్మీర్, పాకిస్థాన్ లలోని ఉగ్రవాద శిబిరాలపై ఏకకాలంలో దాడులు చేయాలని. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. గత పదిహేను రోజులగా దీనికోసం అత్యంత రహస్యంగా ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ అందిస్తున్న అండదండలు కూడా బాహ్య ప్రపంచం ముందు మరోసారి ఆవిష్కృతమయ్యేలా ఏకంకాలంలో తొమ్మిది చోట్ల వేర్వేరు చోట్ల ఉగ్రశిబిరాలపై దాడులు చేయాలని ప్లాన్ చేశారు. ఆ ఉగ్రవాద సంస్థలు ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు. ఫలితంగా బయటి దేశాలు నోరెత్తకుండా ఈ విషయంలో చచ్చినట్లు భారత్ కే సపోర్ట్ చేసేలా రాజకీయ చతురతను ప్రదర్శించారు మోదీ. త్రివిధ దళాలకు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తూనే ఎలా దాడులు చేయాలి..ఎప్పుడు చేయాలి..ఏక కాలంలో సమన్వయంతో శత్రుదేశానికి చిక్కకుండా ఉగ్రమూకలపై విరుచుకుపడటం ఎలా అనే విషయాలపై సైన్యానికి మోదీ పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చేశారు. ఫలితమే ఆరో తారీఖు అర్థరాత్రి నుంచి మొదలై ఏడో తారీఖు తెల్లవారుజాము వరకూ జరిగిన ఆపరేషన్ సిందూర్. దెబ్బకు పాకిస్థాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఎక్కడా పాక్ సైనిక శిబిరాలపై దాడులు చేయకుండా..ఆ విషయాన్ని అధికారికంగా చెబుతూనే..కేవలం ఉగ్రశిబిరాలపై పంజా విసిరి పాకిస్థాన్ ప్రభుత్వానికి మింగలేని కక్కలేని ఓ విపరీతమైన పరిస్థితిని ఇప్పుడు తీసుకువచ్చి పెట్టారు మోదీ. ఇప్పుడిక పాకిస్థాన్ జుట్టుపీక్కోలేక...ఉగ్రవాద సంస్థలకు సమాధానం చెప్పుకోలేక..వాళ్ల అవస్థ చూడాలి. ఇదీ మోదీ మాస్టర్ ప్లాన్ అంటే.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget