అన్వేషించండి

కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?

ఊరందరికీ ఓ దారైతే..ఉలిపిరికట్టెది మరో దారి అన్నట్టుగా ఉంది కెనడా వైఖరి. భారత్‌తో అన్ని దేశాలూ ఫ్రెండ్‌షిప్ చేయాలని చూస్తున్నాయి. పాత విభేదాలు ఏమున్నా అవన్నీ పక్కనపెట్టి కలిసిపోతున్నాయి. సొంత లాభం కొంతచూసుకున్నా.. భారత్‌తో మైత్రిని కంటిన్యూ చేయాలనే చూస్తున్నాయి దాదాపు అన్ని దేశాలు. పొరుగున ఉన్న పాకిస్థాన్ మాత్రం ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. భారత్‌ని చిరకాల శత్రువుగానే చూస్తోంది ఆ దేశం. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అన్న స్థాయిలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది పాక్. ఇప్పుడు కెనడా వైఖరిని చూస్తుంటే..మరో పాకిస్థాన్‌లా తయారైనట్టుగా ఉంది. పాక్‌ ఎలా అయితే..భారత్‌ని కవ్విస్తోందో..అదే విధంగా ఉంది కెనడా తీరు. ఏకంగా భారత హైకమిషనర్‌పైనే సంచలన ఆరోపణలు చేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల లిస్ట్‌లో ఆయన పేరు చేర్చింది. దీనిపై భారత్ భగ్గుమంది. ఏ మాత్రం ఆధారాలు చూపించకుండా..హైకమిషనర్ స్థాయి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడమే కెనడాపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. 

పాకిస్థాన్ కూడా ఇంతే. ఆర్నెల్ల క్రితం పాక్ ఇంటిలిజెన్స్ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో భారత్‌ పెద్ద ఎత్తున హత్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. 2019 తరవాత దేశ భద్రత పేరుతో నరమేధం సృష్టిస్తోందనీ...ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా తీవ్రంగా స్పందించారు. యాంటీ ఇండియా ప్రాపగండా అని మండి పడ్డారు. అయినా..ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు పాకిస్థాన్. ఇప్పుడు కెనడా తీరు చూడబోతే ఇలాగే ఉంది. ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే నీళ్లు నములుతోంది. కానీ..అంతా ఇండియానే చేసిందని ఆరోపిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన ట్రూడో కూడా యాంటీ ఇండియా అజెండాతోనే పాలిటిక్స్ చేస్తున్నారు. పైగా రాజకీయాలపై ప్రభావం చూపించే సిక్కుల కోసం ఈ పొటిలికల్ గేమ్ ఆడుతున్నారన్న వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. కెనడా బహిరంగంగా అతివాద సంస్థలతో స్నేహం చేస్తోందని ఇండియా తేల్చి చెబుతోంది. తీవ్రవాదులతో సన్నిహితంగా ఉండడం, భారత్‌పై విషం చిమ్మడం...అనవసరపు ఆరోపణలు చేయడం. ఇవన్నీ చూస్తుంటే..కెనడా పాకిస్థాన్‌కి డూప్‌లా తయారైందన్న మాట వినిపిస్తోంది.

న్యూస్ వీడియోలు

కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?
కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Damagundam Radar Center Foundation: దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
Kurnool news : కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Telangana DSC 2024: తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరంఫ్రెండ్‌ని కాపాడిన రతన్ టాటా, పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తిభారత్‌ కెనడా మధ్య మరోసారి రాజుకున్న వివాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Damagundam Radar Center Foundation: దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
Kurnool news : కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Telangana DSC 2024: తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
Personal Finance: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో నష్టపోవద్దు - మీ డబ్బును పెంచే బెస్ట్‌ ఐడియాలు వేరే ఉన్నాయ్‌!
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో నష్టపోవద్దు - మీ డబ్బును పెంచే బెస్ట్‌ ఐడియాలు వేరే ఉన్నాయ్‌!
Diwali Shopping: 70 కోట్ల మంది షాపింగ్‌ - ఇంత డబ్బును ఎక్కడ నుంచి తెస్తున్నారబ్బా?
70 కోట్ల మంది షాపింగ్‌ - ఇంత డబ్బును ఎక్కడ నుంచి తెస్తున్నారబ్బా?
World Food Day 2024 : ప్రపంచ ఆహార దినోత్సవం 2024.. ఈ ఏడాది థీమ్, చరిత్ర, లక్ష్యాలు ఇవే
ప్రపంచ ఆహార దినోత్సవం 2024.. ఈ ఏడాది థీమ్, చరిత్ర, లక్ష్యాలు ఇవే
Andhra Pradesh Crime News: అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !
అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !
Embed widget