చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నెమలి వాహనంపై వినాయకు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం మూలవిరాట్ కు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సిద్ధి, బుద్ధి, సమేత శ్రీ స్వామి వారిని అలంకార మండపంలో ఉంచి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఉత్సవ మూర్తులను నెమలి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ వాహన సేవకు చినకాంపల్లె, అగరం పల్లె, కాణిపాకం, పరిసర గ్రామస్థులు, రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామి వారి వాహన సేవకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. ఈ సేవలో ఆలయ అధికారులు, ఉభయదారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Nara lokesh Visits PES Hospital : తారకరత్నను బెంగుళూరుకు తరలించిన వైద్యులు | DNN | ABP Desam
Tarakaratna Heart stroke : కుప్పం యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు | DNN | ABP Desam
Breaking News | Taraka Ratna Heart Stroke In Lokesh Yuvagalam: తారకరత్నకు హార్ట్ స్ట్రోక్..!
Kalki Bhagwan Darsanam Ekam Trust: పునఃప్రారంభమైన కల్కి అమ్మ భగవాన్ దర్శనం
Nara Lokesh In Kuppam: మరికాసేపట్లో మొదలవబోతున్న నారా లోకేష్ పాదయాత్ర
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?