అన్వేషించండి

Kumbh Mela 2025 : కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ ఖరీదు రూ.4.32 కోట్లు- సోషల్ మీడియాలో లెటర్‌ వైరల్

Kumbh Mela 2025 - Steve Jobs : దివంగత, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1974లో చేతితో రాసిన లేఖ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో అతను కుంభమేళాను సందర్శించాలనే కోరికను వ్యక్తం చేశాడు.

Kumbh Mela 2025 - Steve Jobs : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో 45రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జనవరి 13 నుంచి ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ మేళాకు ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ (Steve Jobs) సతీమణి పావెల్ జాబ్స్ వెళ్లారు. కుంభమేళాకు వెళ్లాలనుకున్న తన భర్త స్టీవ్ జాబ్స్ కోరికను నెరవేర్చారు. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేస్తుండొచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయమేటంటే.. స్టీవ్ జాబ్స్ 1974లోనే కుంభమేళాకు వెళ్లాలనుకున్నారట. అందుకోసం స్టీవ్ 1974లో వేసిన ప్లాన్ కు సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖను ఇటీవలే బోన్హామ్స్ సంస్థ వేలం వేయగా.. 5 లక్షల డాలర్లకు పైగానే అమ్ముడుపోవడం చెప్పుకోదగిన విషయం.

వైరల్ అవుతోన్న స్టీవ్ జాబ్స్ కుంభమేళా టూర్ ప్లాన్ లెటర్

అప్పట్లో స్టీవ్ జాబ్స్ కుంభమేళా వెళ్లాలనుకున్నారని, అందుకు 1974లో ఓ ప్లాన్ కూడా చేశారని తాజాగా అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్ వెల్లడించారు. 19వ పుట్టిన రోజున స్టీవ్ జాబ్స్ తనకు రాసిన లేఖలో బౌద్ధమతం గురించి చెప్పారని.. భారత దేశంలో జరిగే కుంభమేళాకు వెళ్లాలని ఆశపడుతున్నట్లు చెప్పారన్నారు. టిమ్ బ్రౌన్ రాసిన లేఖకు ప్రతిస్పందనగా స్టీవ్ జాబ్స్ ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉందని, తాను చాలా సార్లు ఏడ్చానని కూడా ఆయన లేఖలో రాశారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళాకు భారత దేశానికి వెళ్లాలనుకుంటున్నాని చెప్పిన స్టీవ్.. మార్చిలో వెళ్తానని, కానీ దాని గురించి ఇంకా కచ్చితమైన ప్లాన్ లేదని తెలిపాడు. జాబ్స్ స్వయంగా తన చేతితో రాసిన ఈ లేఖను 2021లో వేలం వేయగా.. రూ.4.32 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది జాబ్స్ లోని ఆధ్యాత్మికతను వెలికితీసింది.

నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించిన స్టీవ్

జాబ్స్ ఎప్పుడూ కుంభమేళాకు హాజరు కానప్పటికీ, అతను ఉత్తరప్రదేశ్ లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాడు. నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరమే మరణించాడని అతనికి ఆ తరువాత తెలిసింది. అయినప్పటికీ, జాబ్స్ కైంచి ధామ్ ఆశ్రమాన్ని ఎంచుకున్నాడు. అతను భారతదేశంలో ఏడు నెలలు గడిపాడు. సంస్కృతి, ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. 

కోరిక తీరకుండానే కనుమూసిన స్టీవ్ జాబ్స్

స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి ఆపిల్ కంపెనీని ప్రారంభించే కంటే 2ఏళ్ల ముందే ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయన తన చిరకాల వాంఛ తీరకుండానే అక్టోబర్ 5. 2011న 56 ఏళ్ల వయసులో స్టీవ్ జాబ్స్ మృతి చెందాడు. 

ప్రయాగ్ రాజ్ లో స్టీవ్ భార్య

స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఇటీవలే 40 మంది సభ్యుల బృందంతో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె గురువు స్వామి కైలాసానంద గిరి ఆశ్రమంలో ఉన్నట్టు సమాచారం. ఆమె ఆమె ధ్యానం, క్రియా యోగా, ప్రాణాయామం వంటి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ... భారతీయ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అనుభవిస్తున్నారు.

Also Read : Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన కొడుకు ఏం చేశాడంటే?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget