అన్వేషించండి

Viral News: లక్కున్నోడు.. రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసిన తండ్రి, 35 ఏళ్ల తరువాత వాటి విలువ ఎంతో తెలుసా!

JSW Shares Worth Rs | ఓ వ్యక్తి 1990లో ఒక లక్ష రూపాయలకు జిందాల్ కంపెనీ షేర్లు కొన్నారు. నేటి వాటి విలువ ఏకంగా రూ.80 కోట్లు కావడం హాట్ టాపిక్ గా మారింది.

Man Uncovers Father's 1990s JSW Shares Worth Rs 1 Lakh | మనం తీసుకునే నిర్ణయం మంచిది, అయితే మన సంకల్పం గొప్పది అయితే ఏదో రూపంలో మంచే జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అదే విధంగా తమ పిల్లల భవిష్యత్ కోసం బంగారు బాటలు వేయాలని భావించి ఓ తండ్రి చేసిన ప్రయత్నం నేడు వారి సంతానికి కోట్లు తెచ్చి పెట్టింది. అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం అనడానికి ఈ ఘటన ఉదాహరణగా మారింది.

దాదాపు 35 ఏళ్ల కిందట చేసిన లక్ష రూపాయల పెట్టుబడి విలువ నేడు రూ.80 కోట్లు అయింది. 1990లో ఓ వ్యక్తి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేశాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాక ఆ పేపర్లు ఇంట్లో ఎక్కడో పెట్టారు. దాదాపు 35 ఏళ్ల తరువాత ఆయన కుమారుడికి ఈ షేర్స్ డాక్యుమెంట్స్ కనిపించడంతో వివరాలు చెక్ చేసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మూడున్నర దశాబ్దాల కిందట తన తండ్రి చేసిన లక్ష రూపాయల పెట్టుబడి నేడు రూ.10 లక్షలో, కోటి రూపాయలో కాదు ఏకంగా రూ.80 కోట్లకు చేరింది. సౌరవ్ దత్తా అనే నెటిజన్ ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. అయితే ఇది నిజమా కాదా అనే అనుమానం సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో ఉన్న కంపెనీ షేర్లను 1990లో ఓ వ్యక్తి కొన్నాడు. అయితే సరైన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ ప్రయోజనం ఉంటుంది. లాంగ్ టర్మ్ వరకు ఆగితే ఫలితాలు ఊహించని స్థాయిలో ఉంటాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇది చూసిన వారు పూర్తి వివరాల కోసం చెక్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం అతడి పంట పండింది, వాళ్ల నాన్న చేసిన మంచి ప్రయత్నం వృథా కాలేదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కొందరైతే ఈ పోస్ట్ చూసి జోక్ అంటున్నారు. మరికొందరేమే ఇన్వెస్ట్ చేసి మరిచపోవడం ద్వారా కలిగిన భారీ ప్రయోజనం అని చెబుతున్నారు. తమ తల్లిదండ్రులు, లేక తాతనో ఇలాగే ఎన్నో షేర్లు కొన్నారని.. వాటిని ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియడం లేదని కొందరు నెటిజన్లు స్పందించడం విశేషం. అయితే సంబంధిత కంపెనీని సంప్రదిస్తే ప్రయోజనం ఉంటుందని, వాటి విలువను కచ్చితంగా క్లెయిమ్ చేయవచ్చు అని సూచిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget