అన్వేషించండి

Sri Krishna Janmashtami : పురాణాల్లో ఒక్కరు కాదు ఇద్దరు కృష్ణులు ఉన్నారని తెలుసా?

Krishna Janmashtami :మన పురాణాల్లో ఒక్కరు కాదు ఇద్దరు కృష్ణులు ఉన్నారని తెలుసా?పరుశురాముడకి హరిధనుస్సు ఇచ్చింది ఎవరు? రాముడిని ఆ ధనుస్సు ఎక్కుపెట్టమంటూ ఎందుకు పరుశురాముడు సవాల్ చేశాడు.

 Hindu Mythology: ఈరోజు కృష్ణాష్టమి. దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు. అయితే మన పురాణాల్లో మనకు తెలిసిన కృష్ణుడు మాత్రమే కాకుండా మరో కృష్ణుడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఇంతకీ ఎవరతను అనే ఆశక్తి కలిగించే ఆ కథనం మీకోసం 

నైమిశారణ్యంలో మునులకు సూతుడు చెప్పిన పురాణాలు
పూర్వకాలంలో నైమిశారణ్యంలో చాలా కాలంపాటు యజ్ఞాలు జరిగాయి. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సూతుడు అనే ముని అక్కడ ఉన్న మునులకు అనేక పురాణాలను చెప్పాడు. వాటిలో విష్ణుపురాణం కూడా ఉంది. విష్ణువు అవతారాలను గురించి ఆయన మునులకు చెబుతూ పరుశురామ అవతార కథలో భాగంగా తన తండ్రి జమదగ్నిని చంపిన క్షత్రియులను నాశనం చేస్తానంటూ పరశు రాముడు ప్రతిజ్ఞ చేయడం గురించి చెప్పాడు. అప్పటికే శివుడిని మెప్పించి పరశువు (గొడ్డలి) ఆయుధంగా పొంది పరశురాముడుగా మారిన ఆయన మరొకసారి శివుడిని పూజించి భార్గవ అస్త్రాన్ని వరంగా సాధించాడు. అప్పటి నుంచి ఆయన పేరు భార్గవ రాముడుగా కూడా పిలుస్తున్నారు. 

శివుడితో పాటే కృష్ణుడు
ఆ శక్తులతోపాటు హరి శక్తి కూడా కావాలని భావించిన పరుశురాముడు గోలోకంలో ఉండే కృష్ణుడి వద్దకు వెళ్లి ఆయనను పూజించి కృష్ణ కవచాన్ని పొందాడు. అది శరీరంపై ఉండగా ఎలాంటి ఆయుధం కూడా పరశురాముడిని తాకలేదు. దానితో పాటే కృష్ణుడు ఒక సాటిలేని ధనుస్సును కూడా పరుశురాముడుకి ఇచ్చి అది అజేయమైన విల్లు అని చెప్పాడు. పరుశురాముడు చేయబోతున్న క్షత్రియ సంహారం తరువాత రానున్న రామావతారంలో ఆ ధనుస్సును తిరిగి తీసుకుంటానని కృష్ణుడు చెబుతాడు. అలా వరాలు పొందిన పరుశురాముడు 21 సార్లు ప్రపంచం అంతా తిరిగి క్షత్రియులను చంపి ఆ రక్తంతో ఐదు చెరువులను నింపాడు. అవే శమంతక పంచకంగా పిలుపస్తారు. 

ఆ తరువాత పరుశురాముడు తాను సంపాదించిన భూమిని అంతా కశ్యప మహర్షికి దానం చేసి గోకర్ణంలో తపస్సుకు వెళ్ళిపోయాడు. పరుశురాముడికి దొరకకుండా తప్పించుకున్న కొద్దిమంది క్షత్రియులకు కశ్యపుడు ఆ భూమిని పంచి ఇచ్చాడు. దానితో మళ్ళీ రాజవంశాలు ఏర్పడ్డాయి. అలా వచ్చిన వాటిలోని సూర్యవంశంలోనే విష్ణువు మళ్ళీ రాముడుగా పుట్టాడు. సీతా స్వయంవరంలో రాముడి శివ ధనస్సును ఎక్కుపెట్టినప్పుడు అది విరిగిపోయిన శబ్దం ఎక్కడో తపస్సు చేసుకుంటున్న పరశురాముడి చెవులకు తాకింది. 

దీంతో మళ్ళీ క్షత్రియ సంహారం చెయ్యాలని బయలుదేరి మిథిలకు చేరి రాముడిని తన దగ్గర ఉన్న హరి ధనుస్సును ఎక్కుపెట్టాలంటూ సవాల్ చేశాడు. రాముడు ఆ విల్లును తీసుకోవడానికి చేతిని చాపి పరుశురాముడిని తాకగానే ఆయన విష్ణువు అవతారమని తెలిసిపోయింది పరుశురాముడికి. అలాగే ఆయనలోని దైవాంశ కూడా రాముడిలోకి వెళ్ళిపోయింది. గతంలో గోలోక కృష్ణుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆ విల్లును రాముడికి ఇచ్చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు పరుశురాముడు. 

గోలోకం లో ఉండే కృష్ణుడు ఎవరు?
ఈ కథ చెబుతున్న సూతుడికి అడ్డుతగిలిన మునులు ఈ గోలోక కృష్ణుడు ఎవరని అడగడంతో సూతుడు ఆ చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. వైకుంఠంపైన ఉండే సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. ఆ సత్య లోకం పైన అనేక నక్షత్రమండలాలతో మధ్య గోలోకం ఉంటుంది. అక్కడ ఎప్పుడూ వెన్నెల లాంటి వెలుగు మాత్రమే ఉంటుంది. ఆ లోకంలో మహావిష్ణువు తన మరో రూపం అయిన కృష్ణుడుగా నలుపు రంగులో ఉంటాడు. అక్కడ ప్రవహించే దివ్యమైన విరజా నది ఒడ్డున తులసివనంలో మురళిని వాయిస్తూ ఒక విధమైన పరవశంలో ఉంటాడు. ఆయన మురళి నుంచి వెలువడిన నాదం ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమే రాధ. రాధ ప్రకృతి, కృష్ణుడు పురుషుడు. వారిద్దరూ ‍ఒకే జంటగా ఎప్పుడూ కలిసి ఉంటరు. అలాగే విరజానది కూడా స్త్రీ రూపం ధరించి కృష్ణుడిని కొలుస్తుంటుంది. ఆమే బృంద. అక్కడి కృష్ణుడి అంశ నుంచి సుదాముడు పుట్టాడు. తను ఎప్పుడూ గోలోకంలోనే ఉంటూ కృష్ణుడు,రాధను సేవిస్తూ ఉంటాడు. ఆ కృష్ణుడిని ఆరాధించే పరుశురాముడు కృష్ణ కవచాన్ని, హరి విల్లును పొందాడని సూతుడు మునులకు తెలిపాడు.

Also Read: ఈ కాలా హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే శని దృష్టి మిమ్మల్ని ఎప్పటికీ తాకదు..ఎక్కడ ఉందంటే..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget