అన్వేషించండి

YS Sharmila : తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాలని నాన్న చెప్పారు - అమెరికాలో పార్టీ సానుభూతిపరులతో షర్మిల భేటీ !

అమెరికాలో వైఎస్ఆర్ ఆత్మీయులతో వైఎస్ షర్మిల సమావేశం అయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పారు.

YS Sharmila :  తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న చెప్పారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గుర్తు చేసుకున్నారు. అమరికా పర్యటనలో ఉన్న షర్మిల YSR అభిమానులతో వైఎస్ షర్మిల గారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు.  YSR రాజకీయ జీవితం 30 ఏళ్లు అని..  ఇందులో 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు.  ఆ 5 ఏళ్లు వైఎస్సార్ కోటానుకోట్ల మంది గుండెల్లో నిలిచి పోయారని గుర్తు  చేశారు.  లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారని.. మహిళలకు పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారన్నారు.  వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా ఆర్థికంగా తోడ్పాటు అందించారని గుర్తు చేసుకున్నారు  ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారన్నారు. 

వైఎస్ తెచ్చిన పథకం వల్ల పేద బిడ్డలు ఫీజు రీయింబర్స్మెంట్ తో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారని..  దేశంలో ఏ నాయకుడు ఆలోచన చేయని అరోగ్య శ్రీ  పథకాన్ని అమలు చేశారన్నారు.   వైఎస్సార్ ముఖ్యమంత్రిగా 46 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్లులు కట్టించారన్నారు.  వైఎస్సార్ మరణం వార్త భరించలేక   700 వంది చనిపోయారు అంటే..వైఎస్సార్ మీద ప్రేమ అంతా ఇంతా కాదన్నారు.  వైఎస్సార్ అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమను ప్రజలు పెట్టుకున్నారన్నారు.  ఎక్కువ శాతం తెలంగాణ లోనే వైఎస్సార్ మరణ వార్త విని చనిపోయారని.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను సమానంగా గౌరవించారని షర్మిల తెలిపారు. 
 

ఇవ్వాళ వైఎస్సార్ గారు బ్రతికి ఉన్నా... తెలంగాణ ముఖ్యమా..? ఆంధ్రా ముఖ్యమా అంటే సమాధానం చెప్పలేరన్నారు.  వైఎస్సార్ ను అమితంగా ప్రేమించిన తెలంగాణ ఈరోజు ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు.  ఉద్యమ కారుడు కదా అని పాలన చేతిలో పెడితే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.  8 న్నర ఏళ్లలో 8 వేల మంది రైతు .. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం  చేశారు.  రుణమాఫీ అని రైతులను మోసం చేశారు ... సున్నా వడ్డీకి రుణాలు అని మహిళలను మోసం చేశారు.. కేజీ టూ పీజీ అని విద్యార్థులను మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇ  35 వేలు కూడా ఇప్పుడు ఇవ్వడం లేదని.. అరోగ్య శ్రీ కేసులు ఆసుపత్రులు  తీసుకోవడం మానేశాయని షర్మిల వివించారు.  

 జలయజ్ఞం పథకంలో బాగంగా తెలంగాణ లోనే ఎక్కువ ప్రాజెక్ట్ లు వైఎస్ కట్టించారన్నారు.  తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని నాన్న నాకు చెప్పినట్లు అనిపించిందని.. .తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న చెప్పారని గుర్తు చేసుకున్నారు.  నన్ను ప్రేమించిన ప్రజలు..నేను ప్రేమించిన ప్రజలు అని నాన్న చెప్పాడని..  తెలంగాణ ప్రజల మేలు కోసం పోరాడాలి అని నాన్న నా గుండెల పై విల్లు రాశాడని షర్మిల భావోద్వేగంగా చెప్పారు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానన్నారు.  వైఎస్సార్ పార్టీ జెండాలో వైఎస్సార్ ఉన్నాడు..అజెండా లో వైఎస్సార్ సంక్షేమం ఉందని.. మళ్లీ రాజన్న పాలనతీసుకొస్తామన్నారు. 

తెలంగాణ ప్రజల కోసం చిత్త శుద్ది గా నిలబడిన పార్టీ YSR తెలంగాణ పార్టీ అని షర్మిల స్పష్టం చేశారు. ఇప్పటికే 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశామన్నారు.  ఎమ్మెల్యే ల అవినీతి నీ ఎత్తి చూపించామని..   వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం చేసే వరకు నిరుద్యోగం అనే అంశం చర్చ కే లేదన్నారు.  నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం.. అప్పుడు ప్రతిపక్షానికి సోయి వచ్చింది. అధికార పక్షానికి బుద్ది వచ్చిందని వ్యాఖ్యానించారు.  కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 70 వేల కోట్ల అవినీతి జరిగిందని.. దీనిపై ఢిల్లీ వెళ్లి పోరాటం చేశామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget