By: ABP Desam | Updated at : 31 Mar 2023 06:57 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ద్రోణి నేడు ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య భాగాల నుంచి ఈరోజు ఉత్తర చత్తీస్ఘడ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నేడు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వచ్చే 5 రోజులు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 3 వరకూ ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 50 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా..
మార్చి నెల ముగియనున్న వేళ ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం భిన్నంగా ఉంది. గురువారం మరోసారి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీ, న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ పటేల్ నగర్, బుద్ధ జయంతి పార్క్, రాష్ట్రపతి భవన్, రాజీవ్ చౌక్, ఢిల్లీ కాంట్, ఇండియా గేట్, సఫ్దర్జంగ్, లోడీ రోడ్, వసంత్ విహార్, ఆర్కే పురం, డిఫెన్స్ కాలనీ, వసంత్ లైట్ వరకు కుంజ్, పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. బుధవారం కూడా రాజధాని పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
IMD ప్రకారం, గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, ఢిల్లీలో గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) 175 నమోదైంది, ఇది 'మోడరేట్' విభాగంలోకి వస్తుంది. 0 - 50 మధ్య ఉన్న AQI 'మంచిది', 51 - 100 'సంతృప్తికరమైనది', 101 - 200 'మితమైన', 201 - 300 'పూర్', 301 - 400 'చాలా దారుణం', 401 - 500 మధ్య 'తీవ్రమైనది'గా పరిగణించబడుతుంది. . IMD ప్రకారం, దేశ రాజధానిలో తేమ శాతం గురువారం ఉదయం 8.30 గంటలకు 70 శాతంగా నమోదైంది.
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్షిప్ వివరాలు ఇలా!
3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే
TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!
Minister KTR: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ - ఆందోళనలో కొందరు నేతలు!
Hayathnagar Murder Case: హయత్నగర్ రాజేశ్, సుజాత మృతి కేసులో వీడిన మిస్టరీ, ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !