అన్వేషించండి

AP Voters Death: తెలంగాణ నుంచి ఏపీకి పయనం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Telangana News: ఓటు వేసేందుకు సొంతూళ్లకు ఎంతో మంది వెళ్తున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి ఏపీకి బయలుదేరిన ఇద్దరు ఓటర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది.

Voters dies in Road Accident: వరంగల్: మే 13న ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. అందులోనూ ఈసారి వీకెండ్ కూడా తోడవ్వడంతో పెద్ద ఎత్తున ఓటర్లు హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాల నుంచి ఏపీకి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ నుంచి ఏపీకి బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో విషాదం నెలకొంది.

ప్రమాదం ఎలా జరిగిందంటే.. 
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వద్ద జనం మీదకు టిప్పర్ దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ బస్ స్టాప్ వద్ద కొందరు బస్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఇసుక లోడ్ తో ఉన్న టిప్పర్ బస్ కోసం నిలబడిన ప్రయాణికుల మీదకు దూసుకురావడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. ఓటు వేయడానికి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సొంతూళ్లకు పోటెత్తిన ఓటర్లు 
శుక్రవారం నుంచే ఏపీ ప్రజలు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారు. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ఓటర్లు జిల్లాలకు తరలి వెళ్తున్నారు. సొంతూళ్లకు ఒక్కసారిగా నగరవాసులు క్యూ కట్టడంతో.. ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఓటింగ్ సందర్భంగా దాదాపు 2 వేల బస్సులు అధికంగా నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటన చేసింది. ఈ స్పెషల్ బస్సుల్లో  500 ఎంజీబీఎస్ నుంచి, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు, ఎల్బీ నగర్ నుంచి 300, ఉప్పల్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపుతోంది. పోలింగ్ సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 

ఇదే చాన్స్ అని ప్రైవేట్ ట్రావెల్స్ ట్రావెలింగ్ ఛార్జీలను మూడింతలు, నాలుగు రెట్లు పెంచేసి సామాన్యులపై బారం మోపుతున్నారు. కొన్నిచోట్ల బుక్ చేసుకున్న బస్సు ఒకటైతే ఏర్పాట్లు చేస్తున్న బస్సు మరొకటి అని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా సొంత వాహనాలలో ఏపీకి బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగ సమయంలో ఎక్కువ రద్దీతో ట్రాఫిక్ జామ్ అయ్యే పంతంగి టోల్ ప్లాజా వద్ద సైతం పోలింగ్ టైమ్ కావడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kodali Nani: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
HCU Lands Issue: ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
Bandi Sanjay: సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ బండి సంజయ్ ఆగ్రహం
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP DesamAniket Verma Young Super Star in SRH IPL 2025 | సన్ రైజర్స్ కొత్త సూపర్ స్టార్ అనికేత్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodali Nani: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
HCU Lands Issue: ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
Bandi Sanjay: సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ బండి సంజయ్ ఆగ్రహం
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Malaika Arora: క్రికెటర్ తో జంటగా ఐపీఎల్ మ్యాచ్ చూసిన మలైకా అరోరా... డేటింగ్ లో ఉన్నారా ?
క్రికెటర్ తో జంటగా ఐపీఎల్ మ్యాచ్ చూసిన మలైకా అరోరా... డేటింగ్ లో ఉన్నారా ?
Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
Sardar 2 Movie: 'సర్దార్ 2'లో కార్తీ ఫస్ట్ లుక్ అదుర్స్ -  సీక్రెట్ సర్దార్ ఏజెంట్ వచ్చేస్తున్నాడు.. యుద్ధం వస్తే పోరాటమే!
'సర్దార్ 2'లో కార్తీ ఫస్ట్ లుక్ అదుర్స్ - సీక్రెట్ సర్దార్ ఏజెంట్ వచ్చేస్తున్నాడు.. యుద్ధం వస్తే పోరాటమే!
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Embed widget