


జనగామ/వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల మహదేవ్పూర్ మండలం కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద బారీకేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు కిందకు సముద్రంలోకి వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కింద నీరు వృధాగా పోతుంటే, పైన ఉన్న మిడ్ మానేరుతో సహా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి రిజర్వాయర్ నీళ్లు లేక నోరెళ్లబెట్టి చూస్తోందని అన్నారు. నీటి లభ్యత లేక తెలంగాణవ్యాప్తంగా రైతులు కనీసం నాట్లు వేసే పరిస్థితి కూడా లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల సీనియర్ నేతలతో కూడిన బృందం హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బయలుదేరింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుని వృధాగా పోతున్న జలాలను పరిశీలించి, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మీడియా సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ భావించింది. అయితే, ఈ పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ వద్ద తమ వాహనాలను అడ్డుకోవడంపై మండిపడ్డారు.
బారీకేడ్లు బద్దలు కొట్టి కన్నెపల్లి పంప్ హౌస్ వైపు దూసుకెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు 🔥
— BRS Party (@BRSparty) July 5, 2026
కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న @KTRBRS బృందాన్ని హైదరాబాద్ - వరంగల్ హైవేపై పెంబర్తి వద్ద బారికేడ్లను పెట్టి అడ్డుకున్న… pic.twitter.com/FKVSqXVYZ9
మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా, 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు.. కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఒకవేళ నీళ్లిస్తే యూరియా ఇవ్వాలని, పంటను మద్దతు ధరతో కొనాలని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో చేతగాని సీఎం రేవంత్ రెడ్డి రైతులను కావాలనే ఎండబెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి సూచనల మేరకు పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుని తీరుతామని, వృధా జలాలను రైతులకు, రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు బారీకేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.
కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతుండగా, కాళేశ్వరం రిజర్వాయర్లు నీరు లేక ఖాళీగా ఉన్నాయని పరిశీలించేందుకు. రైతులు నీటి లభ్యత లేక పంటలు పండించలేకపోతున్నారని ఆయన అన్నారు.
పంటలు పండితే యూరియా, మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ముఖ్యమంత్రి కావాలనే రైతులను ఎండబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ గేట్లతో సంబంధం లేకుండా, 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.






