అన్వేషించండి

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

MLA Redya Naik: సీఎం కేసీఆర్ ఆగస్టులోనే ఎన్నికలు ఉండొచ్చని చెప్పినట్లు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. బీజేపీ అనుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. 

MLA Redya Naik: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమేళనంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కార్ అనుకుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆగస్టులోనే ఎన్నికలు ఉండొచ్చన్నారని వివరించారు. ఇటీవల జరిగిన సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ నేతలకు సూచించినట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. 

"మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయిన పదిహేను రోజుల క్రితం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులందరినీ కూడా బీఆర్ఎస్ భవన్ కు పిలిచి సమావేశం నిర్వహించారు. నిర్వహించి వారిచ్చిన సూచనలు.. వచ్చే సెప్టెంబర్ లోనే నోటిఫికేషన్ రావొచ్చు. ఇంకా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇక్కడ అధికారంలో ఉన్నం కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటరు వీళ్లు. అనే ఒక కపటం తోటి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆగస్టులోనే పెట్టినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఎన్నికల కోడ్ వస్తే ఏం చేయాలి. అందుకనే మనం ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలే. జాగ్రత్త పడాలే. అని కొన్ని సూచనలు చేసిర్రు. అందులో ముఖ్యమైనవి ఆత్మయ సమ్మేళనం. అంటే ఎమ్మెల్యేకు, పార్టీ పెద్దలకు కొంత గ్యాప్ ఉండొచ్చు. మీకూ ప్రజలకు గ్యాప్ ఉండొచ్చు. నాకు ప్రజలకు గ్యాప్ ఉండొచ్చు. మన పార్టీ వాళ్లే మనకు వ్యతిరేకంగా పని చేస్తూ ఉండవచ్చు. మనందర్నీ కూడా కుటుంబ సభ్యుల్లాగా పిలిపించుకొని వాళ్లకింత భోజనం పెట్టి పొద్దుందాకా ఏన్న లోటుపాట్లు ఉంటే మాట్లాడుకొని మనం ఈ కార్యక్రమం చేసుకుంటే మనకు వాళ్లకు దగ్గర సంబంధం ఏర్పాటైంది. సంబంధాలు పెరుగుతయ్. వాళ్ల మనుసులో ఉన్నటువంటి భావన దూరం అయితది. కాబట్టి మీరు తప్పక నిర్వహించడని చెప్పడం జరిగింది. మనం నిర్వహిస్తమో లేదో అని సతీష్ గారి లాంటి అనుభవం ఉన్న నాయకులను మనకు ఇచ్చారు. వారం రోజుల నుంచి ఆయన నన్ను అడుగుతనే ఉన్నరు. నేనొకటే చెప్పిన 28వ తేదీన పెట్టుకుందామని. మేం అన్ని కూడా చేస్తాం." - ఎమ్మెల్యే రెడ్యా నాయక్

ప్రజలకు చేరువయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలు

ఎన్నికలు వస్తే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి.. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని అభివృద్ధి పనులు పూర్చి చేయాలని కేసీఆర్ అన్నారని రెడ్యా నాయక్ గుర్తు చేశారు. నియోజకవర్గాల్లో నేతలు సమన్వయంతో పని చేయాలని తమకు కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని.. వారికి తాము చేరువ అయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. ఈ క్రమంలోనే తాము కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నామని, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పార్టీలో ఉన్న వాళ్లందరినీ కలిసి, వారి సమస్యలు కూడా తీరుస్తున్నామన్నారు. పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
Pawan Kalyan:
"గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget