అన్వేషించండి

Journalist Passes Away: ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో విషాదం - గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

Journalist Mendu Srinivas Dies: క్రికెట్ ఆడుతూ తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందారు. పలువురు ప్రముఖులు శ్రీనివాస్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆదివారం సరదాగా ఆట విడుపుగా క్రికెట్ ఆడటంతో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకున్న మెండు శ్రీనివాస్.. పరిస్థితి బాగోలేదని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సీనియర్ జర్నలిస్టు అకాల మరణంపై తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం ప్రకటించాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి.

ఫ్రెండ్లి మ్యాచ్‌తో విషాదం.. 
సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ పరకాల (ఆంధ్రజ్యోతి) క్రికెట్ టీమ్ పీసీసీ క్రికెట్ క్లబ్ ఫ్రెండ్లి మ్యాచ్ కోసం పరకాలకు వచ్చారు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు మెండు శ్రీనివాస్ 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. బాగా అలసిపోయానని, బై రన్నర్ కావాలని అడిగాడు. అయితే ఆయన పరిస్థితి గమనించిన సహచర ఆటగాళ్లు, బాగా అలసిపోయావు బై రన్నర్ వద్దు.. బయటకు వచ్చి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. తోటి ఆటగాళ్లు వారించడంతో క్రీజు వదిలి బయటకు వచ్చిన మెండు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. 

చికిత్స పొందుతూ మృతి
ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుందామనుకున్న శ్రీనివాస్ కు పరిస్థితి చేజారుతున్నట్లు అనిపించి దగ్గర్లోని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా.. గుండెపోటు రావడంతో కన్నుమూశారని సమాచారం. 

రాజకీయ నేతల సంతాపం..
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్, గత 21ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ వార్తలు ప్రజలకు చేరవేస్తున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం వారి స్వగ్రామం పరకాలలో తీవ్రగుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ మృతిచెందారు. తనకు అత్యంత ఆప్తుడు మెండు శ్రీనివాస్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవండుడిని ప్రార్థించారు రేవంత్ రెడ్డి.

సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ హఠాత్ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన ఆకస్మిక మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్ట్ గా మెండు శ్రీనివాస్ పోషించిన పాత్ర మరువలేనిది అన్నారు.

సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ కొద్ది సేపటి క్రితం వారి స్వగ్రామం పరకాలలో గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ మృతిచెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ లు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో గవర్నర్ జోక్యం - CS, DGP కి తమిళిసై కీలక ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget