అన్వేషించండి

Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి. మైనింగ్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని మావోయిస్టు నేత అశోక్ పేరుతో ఇవి వెలిశాయి. దీంతో సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిఘా పెంచాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భద్రతా బలగాలు అప్రమత్తమై సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి.

Gadchiroli News: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టుల ప్రభావం తగ్గిందని భావిస్తున్న తరుణంలో, తాజాగా వెలుగుచూసిన కరపత్రాలు భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేశాయి. ముఖ్యంగా ఎటపల్లి తాలూకాలో జరుగుతున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు గళం విప్పారు.ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దీంతో భద్రతా బలగాలు నిఘా పెంచాయి.   

గడ్చిరోలిలో మైనింగ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్లు

గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి తాలూకా పరిధిలో ఉన్న జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో మావోయిస్టులకు సంబంధించిన కరపత్రాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ కరపత్రాలను మావోయిస్టు నేత కామ్రేడ్ అశోక్ పేరుతో వెలిశాయి. ప్రధానంగా మైనింగ్ కంపెనీల తీరును తప్పుబడుతూ వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న మైనింగ్ ప్రాజెక్టులను గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజలు అడ్డుకోవాలని కోరారు.

గడ్చిరోలిలో మైనింగ్ ఆపాలని డిమాండ్

గడ్చిరోలి జిల్లా అటవీ సంపదతోపాటు ఖనిజ సంపద విస్తారంగా ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఐరన్‌ ఓర్‌ ఉంది. దీంతో మైనింగ్ ప్రాజెక్టులను విస్తరించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది పర్యావరణానికి, గిరిజనులకు నష్టాన్ని కలిగిస్తుందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అందుకే మైనింగ్ ప్రాజెక్టులు పూర్తిగా నిలిపివేయాలి అనే నినాదంతో పోస్టర్లు వేశారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భద్రతా బలగాలు హై అలర్ట్

ఈ కరపత్రాలు ఎటపల్లి తాలూకాలోని ప్రధాన సరిహద్దు గ్రామాల్లో కనిపించాయి. గడ్చిరోలి-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం మొన్నటి వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రభుత్వాలు ప్రకటించాయి. గడ్చిరోలిలో మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ లేఖలు విడుదల కావడం ఆందోళనకలిగిస్తున్నాయ. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి యత్నిస్తున్నారని ఈ పోస్టర్లు చూస్తుంటే అర్థమవుతోంది.  

అనుమానితుల కదలికలపై నిఘా 

మావోయిస్టుల కరపత్రాల వెలుగులోకి రావడంతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. గడ్చిరోలి జిల్లాతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను మరింత కఠినతరం చేశారు. భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. అనుమానిత కదలికలపై నిఘా ఉంచారు.  

టెన్షన్ పడుతున్న ప్రజలు 

గడ్చిరోలి ప్రాంతంలో మైనింగ్ దశాబ్దాలుగా వివాదాస్పద అంశంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం మైనింగ్ ద్వారా ఉపాధి, అభివృద్ధి వస్తుందని చెబుతుంటే, మరోవైపు మావోయిస్టులు పర్యావరణ విధ్వంసం, గిరిజన నిర్వాసితుల అంశాన్ని ఎత్తిచూపుతున్నారు. మావోయస్టుల పార్టీ పూర్తిగా అంతరించిందని భావిస్తున్న ప్రజలకు ఈ పత్రాలు టెన్షన్ పెడుతున్నాయి.  

Frequently Asked Questions

గడ్చిరోలిలో మైనింగ్ ఎందుకు వివాదాస్పద అంశంగా మారింది?

ప్రభుత్వం మైనింగ్‌తో అభివృద్ధి వస్తుందని చెబుతుండగా, మావోయిస్టులు పర్యావరణ విధ్వంసం, గిరిజన హక్కుల ఉల్లంఘనను ఎత్తిచూపుతున్నారు. జిల్లాలో విస్తారమైన ఐరన్ ఓర్ ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget