అన్వేషించండి

Eatala Rajender: టీఎస్పీఎస్సీ పేపర్స్‌ లీక్‌ను డైవర్ట్ చేసేందుకే మాపై అక్రమ కేసులు: విచారణలో ఈటల

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు.

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు. వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌లో కొద్ది రోజుల క్రితం 10వ తరగతి హిందీ పేపర్ లీక్ అయింది. పరీక్ష ప్రారంభమైన గంటసేపటికే ప్రశాంత్ అనే వ్యక్తి ఈటల రాజేందర్‌కు వాట్సప్‌లో పేపర్ పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా వాట్సప్ లో వెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో ఈ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు దూకుడు పెంచి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ కోసం ఈటల రాజేందర్‌కు కొద్దిరోజుల క్రితం నోటీసులు జారీ చేశారు.  ఆ ప్రకారమే ఈటల నేడు వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ డీసీపీతో పాటు ఏసీపీ, కమలాపూర్ ఇన్స్పెక్టర్లు కలిసి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. 

ఇప్పటికే ఈ కేసులో ఈటల రాజేందర్ పీఏలను పోలీసులు విచారించి వారి సెల్‌ఫోన్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. పేపర్ లీక్ కేసులో డీసీపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఫోన్ ను పోలీసులకి ఇచ్చి, వారికి కావాల్సిన సమాచారం ఇచ్చారు. పోలీసుల నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుండి ఎలాంటి వాట్సప్ మెసేజ్ రాలేదు. వేరే నంబర్ నుండి వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదని పోలీసులకి వివరణ ఇచ్చారు.

బయటికి వచ్చిన తరువాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు ఎలాంటి వాట్స్ ఆప్ కాల్ రాలేదు. వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా. పరీక్షల సమయంలో ఒక ప్రధాన మంత్రి నేరుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి ధైర్యం చెప్తున్న ఏకైక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే. అలాంటి పార్టీలో నేను ఉన్నా. మా పార్టీ పిల్లల భవిష్యత్తు కోరే పార్టీ. 9.30కి పరీక్ష మొదలు అయితే 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ అని ఎలా అంటారు? కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చొని ఎలా అయినా మమ్మల్ని ఇరికించాలని కుట్ర పూరితంగా మా మీద కేసులు పెట్టించారు.

టీఎస్పీఎస్సీకి చెందిన ఆరు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. నెగెటివ్ చర్చ జరుగుతుంది అని దానిని డైవర్ట్ చెయ్యడానికి ఈ కేసులు పెడుతున్నారు. చంద్రశేఖర్ కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి రేంజ్ రోవర్ కారులో ఇచ్చానని చెప్తుంటే ఆ చర్చ జరగవద్దు అని పక్కదోవ పట్టిస్తున్నారు. ఆ లీక్ కేస్ పై చర్చ జరగవద్దు అని ఈ డైవర్ట్ చేస్తున్నారు.  

కేసీఆర్ దేశమంతా ఎన్నికల కోసం ఖర్చు పెడతా అని రాజ్ దీప్ సర్‌దేశాయ్ చెప్తున్నారు. ఆ అంశం మీద చర్చ జరగవద్దు అని ఈ కేసులు పెడుతున్నారు. తెలంగాణలో డైట్ ఛార్జీలు ఇవ్వరు, పెన్షన్ సకాలంలో ఇవ్వరు. కాంట్రాక్టర్స్ డబ్బులు రావు కానీ దేశమంతా ఎన్నికల ఖర్చు పెడతారట. ఈ అంశాలన్నింటినీ పక్కదోవపట్టించే ప్రయత్నమే ఈ కేసులు. 

కేసీఆర్ ఓడగొట్టేంత వరకు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవరకు ప్రజలకు అండగా ఉంటా. ఇది ఒక అక్రమ కేసు. TSPSC పేపర్ లీకు కేసుల నుండి ప్రజల ఫోకస్ డైవర్ట్ చేయడానికే ఎస్సెస్సీ కేసులు తెరపైకి వచ్చాయి’’ అని ఈటల రాజేందర్ అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget