అన్వేషించండి

New Ministers: రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు, ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్

Telangana News | సామాజిక సమీకరణాలతో తెలంగాణ కేబినెట్ లోకి ముగ్గురు మంత్రులు చేరారు. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. కేబినెట్ లోకి ముగ్గురు నేతలకు అవకాశం లభించింది. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ మొదట వివేక్ వెంకటస్వామితో ప్రమాణం చేయించగా, అనంతరం అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు ఫ్లవర్ బొకే ఇచ్చి మంత్రివర్గంలోకి స్వాగతించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి అనసూయ (Seethakka), కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డిజిపి జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో 15 మంది మంత్రులు.. సామాజిక సమీకరణాలు..

64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో బీసీలు 7 మంది ఎమ్మెల్యేలు ఉండగా పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలకు మంత్రి పదవులు వచ్చాయి.

రెడ్డి సామాజివకవర్గం నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉండగా.. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి లక్ష్మణ్

బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు.

ఎస్టీ సామాజిక వర్గం నుంచి దనసరి అనసూయ (సీతక్క)

వెలమ, కమ్మ సామాజికవర్గాల నుంచి జూపల్లి కృష్ణారావు, తుమ్మలనాగేశ్వరావు మంత్రులుగా కొనసాగుతున్నారు.

ఏడాదిన్నర తరువాత కేబినెట్ విస్తరణ

2023 డిసెంబర్ లో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపు 18 నెలలకు కేబినెట్ విస్తరణ చేశారు. కేబినెట్‌లో కొత్తగా ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఎస్సీల నుంచి ఇద్దరు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిలను మంత్రి పదవి వరించింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న పలుమార్లు రాష్ట్ర కేబినెట్ విస్తరణ అని ప్రచారం జరిగేది. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్ది సుదర్శన్, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, విజయశాంతిలకు కేబినెట్ ఛాన్స్ దక్కుతుందని ప్రచారంలో ఉండేది. మరికొందరు నేతలు సైతం తమకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేవారు.

ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టాక పరిస్థితిలో మార్పు వచ్చింది. రాష్ట్ర మంత్రులతో పాటు సీనియర్ నేతలు, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించిన తరువాత మాల నుంచి వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే  అడ్లూరి లక్ష్మణ్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిలకు మంత్రి పదవులు ఇచ్చారు. మక్తల్ నియోజకవర్గానికి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget