అన్వేషించండి

Telangana BJP : కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన రాములమ్మ - కిరణ్‌కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి నష్టమేనా ?

కిరణ్ రెడ్డి వల్లే తాను కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం నుంచి వెళ్లిపోయానని విజయశాంతి ప్రకటించారు. ఇది తెలంగాణ బీజేపీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది.

 

Telangana BJP :  తెలంగాణ బీజేపీ కీలక నేత  విజయశాంతి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. కనీసం మాట్లాడలేదు. లఆమెను ఎవరూ పట్టించుకోలేదన్న ఆగ్రహంతో వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. కానీ విజయశాంతి తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసిన వారు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయానని.. అలాంటి వేదికపై ఉండలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. నేరుగా పేరు చెప్పలేదు కానీ.. ఆమె మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

కిషన్ రెడ్డి ప్రమాణంలో కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక గౌరవం

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించారు. ఆయన అదే హోదాలో కిషన్ రెడ్డి ప్రమాణానికి వచ్చారు. మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు అంటున్నారని తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని అన్నారు. కారు తాళాలు మనం తీసుకోవాలన్నారు. కారు స్టీరింగ్ తమ దగ్గర ఉందని పతంగి పార్టీ వాళ్లు అంటుంటారు.. తాళాలు తీసుకుంటే కారు ముందుకు వెళ్లదు అని వ్యాఖ్యానించారు. కిరణ్ రెడ్డి ప్రసంగం చాలా మంది  బీజేపీ నేతలకు అసౌకర్యంగానే అనిపించింది. 

తేనే తుట్టెను కదిపిన విజయశాంతి

తెలంగాణ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి కి పాజిటివ్ ఇమేజ్ లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోనంటూ ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తూంటారు. ఇక ఆయన పక్కా సమైక్యవాది. జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో చీకట్లలో మగ్గిపోతుందని వ్యాఖ్యలు చేశారు. అందుకే..బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే విజయశాంతి నేరుగానే తన అసంతృప్తిని బయట పెట్టడం ద్వారా.. కారణం కోసం చూసుకుంటున్న చాలా మంది బీజేపీ నేతలకు దారి చూపించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

బీఆర్ఎస్ కు అస్త్రం దొరికినట్లేనా ?

విజయశాంతి తాను కార్యక్రమంలో పాల్గొనలేకపోవడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డేనని చెప్పకనే చెప్పారు. అయితే ఆ కిరణ్ కుమార్ రెడ్డిని జాతయ నాయకత్వం ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంది. జాతీయ కార్యవర్గ  భేటీలో చోటు కల్పించింది. అలాంటి నేతను వ్యతిరేకించడం అంటే..  హైకమాండ్ ను ధిక్కరించినట్లే. విజయశాంతి వ్యూహాత్మకంగా  చేశారా లేకపోతే.. అనుకోకుండా చేశారా అన్నదానిపై స్పష్టత లేదు కానీ బీజేపీపై ఇతర పార్టీలు ఎటాక్ చేయడానికి ఓ అవకాశంలాగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget