అన్వేషించండి

Vande Bharat Train : ఎదురుచూపులకు ముగింపు - 24 నుంచే బెంగళూరుకు కాచిగూడ నుంచి వందే భారత్ ట్రైన్ !

24వ తేదీ నుంచి వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ ట్రైన్ ను ప్రారంభిస్తారు.


Vande Bharat Train :మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ - బెంగళూరు మధ్య  ఈ నెల 24 నుంచి పరుగులు పెట్టనుంది.  ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బయలుదేరి బెంగళూరుకు (610 కి.మీ. దూరం) 8.30 గంటల్లోనే చేరుకోనుంది.ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు రెండు ఐటీ నగరాల మధ్య మూడో వందే భారత్ రైలు ప్రారంభం వస్తోంది.               

నిజానికి హైదరాబాద్ నుంచి మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభించాలని గతంలో అనుకున్నారు. కానీ వాయిదాలు పడ్డాయి. గత ఆగస్టు పదిహేనో తేదీన  క చిగూడ-బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీస్ ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నారు. సాంకేతిక కారణాలతో చివరికి వాయిదా పడింది.  అయితే తాజాగా ఈ వందే భారత్ ప్రారంభంపై నిర్ణయానికి వచ్చారు.  రైల్వే అధికారులు ధరలను కూడా ఖరారు చేశారు. కాచిగూడ టు బెంగళూరు వందే భారత్ ట్రైన్‌లో టిక్కెట్ ధరాలను కూడా ఖరారు చేశారు.   వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1545, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టిక్కెట్ ధర రూ. 2,050 అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారులు అదికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  

హైదరాబాద్ నంచి  బెంగళూరు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. చాలా మంది రైలు టిక్కెట్లు దొరకక.. బస్సుల్లో వెళ్తూంటారు.    కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రెండు స్టేషన్ల మధ్య దాదాపు 618 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడున్నర గంటల్లో  చేరుకుంటుంది.  అంటే.. సాధారణ రైలుతో పోలిస్తే.. ప్రయాణ సమయం నాలుగైదు గంటలు తగ్గుతుంది. ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని తెలుస్తోంది.                                            

హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య రెండు మార్గాల్లో అనేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు, ఒక మార్గం. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం. మరోవైపు, కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా రోజూ ఏడు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వారం రోజులు మరియు వారాంతాల్లో చాలా రద్దీగా ఉంటాయి.  అందుకే కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌ వరకు ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.                                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
Bandi Bageerath Case: బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
Bandi Bhageerath: బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షాక్! ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ!
బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షాక్! ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ!
Bandi Sanjay Mother Heart Attack:కేంద్రమంత్రి బండి సంజయ్‌ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!
కేంద్రమంత్రి బండి సంజయ్‌ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
Reliance AI Data Centre At Bhogapuram: ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
Anasuya Bikini Photos: బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్
బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో సూర్య బాక్సాఫీస్ స్టామినా ఇంతేనా... వీరభద్రుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో సూర్య బాక్సాఫీస్ స్టామినా ఇంతేనా... వీరభద్రుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Bandi Bageerath Case: బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
Breaking News: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
Anasuya Bharadwaj: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్... ఫ్యామిలీతో బీచ్ రిసార్ట్‌లో హ్యాపీ హ్యాపీగా
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్... ఫ్యామిలీతో బీచ్ రిసార్ట్‌లో హ్యాపీ హ్యాపీగా
Prateek Yadav Snake Tattoo: వైరల్ అవుతోన్న ప్రతీక్ యాదవ్ చేతిపై పాము టాటూ! దీని అర్థం ఏంటో తెలుసా?
వైరల్ అవుతోన్న ప్రతీక్ యాదవ్ చేతిపై పాము టాటూ! దీని అర్థం ఏంటో తెలుసా?
Embed widget