Top Headlines Today: నారా లోకేశ్ 'యువగళం' పునఃప్రారంభం! తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
Top Telugu Headlines Today 27 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
AP Telangana News updates 27 November 2023: హరీష్ రావు నోట 'రైతుబంధు' మాట - నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
తెలంగాణ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం (Central elections commission) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం 'రైతుబంధు' (Rythu Bandhu) నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని తాజాగా ఉపసంహరించుకుంది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రైతుబంధు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 28న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.7 వేల కోట్లు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'ఓట్లు దండుకోవాలన్న దురాశ తప్ప ఏం లేదు' - రైతుబంధుపై ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన రేవంత్ రెడ్డి
'రైతుబంధు' (Rythubandhu) నిధుల విడుదలకు ఈసీ అనుమతి వెనక్కు తీసుకున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. 'రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశం మామ, అల్లుళ్లకు లేదు. మంత్రి హరీష్ రావు (HarishRao) వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతి వెనక్కు తీసుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలివ్వడం దీనికి నిదర్శనం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హిందూపురం వైసీపీలో అంతే - బాలకృష్ణకు ముందుగానే భారీ మెజార్టీలు వస్తాయని జోస్యం !
ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారు.. గెలిపించుకుంటాం అని అంటారు.. కానీ ఆ నియోజకవర్గంలో తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది ? ఎవరానేత?. హిందూపురం వైసీపీలో వర్గ పోరాటం కంట్రోల్ చేయలేనంత పీక్స్కు చేరుతోంది. ప్రతిపక్ష అభ్యర్థి అయిన నందమూరి బాలకృష్ణ మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాలు సాధిస్తాడని వైసిపి పార్టీ నేతలు చెప్పడం హిందూపురం నియోజకవర్గం లో పొలిటికల్ కాకను రేపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీలో అడుగుపెడతారా ?
జయప్రకాష్ నారాయణ వంచి ఐఏఎస్, వీవీ లక్ష్మినారాయణ వంటి ఐపీఎస్లు రాజకీయాల్లోకి వచ్చి ఏ మాత్రం సక్సెస్ కాలేక.. రాజకీయ లౌక్యం కూడా తెలుసుకోక చతికిలపడ్డారు. వీరిని చూసిన తర్వాత ఐపీఎస్క వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకివచ్చి ప్రవీణ్ కుమార్ పైనా ఎక్కువ మంది ఆశలు పెట్టుకోలేదు. కానీ ప్రవీణ్ తాను భిన్నమైన సివిల్ సర్వీస్ అధికారినని నిరూపించారు. చాలా వేగంగా రాజకీయ నాయకుడి రూపంలోకి మారిపోయారు. తన బలాన్ని గుర్తించుకుని దానిపైనే దృష్టి పెట్టి ముందుకు సాగారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నారా లోకేశ్ 'యువగళం' పునఃప్రారంభం - మంత్రుల కౌంట్ డౌన్ మొదలైందన్న లోకేశ్
రాష్ట్రంలో మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదు కనుకే మళ్లీ ఇక్కడ నిలబడ్డానని పేర్కొన్నారు. 'టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుంది అనుకున్నారు. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదు. వ్యవస్థలను మేనేజ్ చేసి 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు. నాపై కూడా సీఐడీ కేసులు పెట్టారు. ఇప్పటి వరకూ 6 కేసులు పెట్టినా ఒక్క ఆధారం లేదన్నారు’ లోకేష్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets