Top Headlines Today: దొంగ ఓట్ల తొలగింపుపై 28న ఢిల్లీకి చంద్రబాబు - కుమారుడే ముఖ్యమని తేల్చేసిన మైనంపల్లి!
Top 5 Telugu Headlines Today 22 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 22 August 2023:
AP Fake Votes : దొంగ ఓట్లు, ఓట్ల తొలగింపుపై టీడీపీ పోరాటం - 28న ఢిల్లీకి చంద్రబాబు !
ఏపీలో అనేక నియోజకవర్గాలలో వేల ఓట్లను అక్రమంగా తొలగించారని పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారన్న ఆధారాలతో సహా ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 28న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లో చీఫ్ ఎలక్షన్ కమిషర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఉరవకొండ, విశాఖ ఈస్టు, పర్చూరు నియోజకవర్గాల్లో అవకతవకలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్ కు గురయ్యారు. రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన అక్రమాల్లో బాధ్యులపై చర్యలకు టీడీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఓట్లు తొలగించిందని టీడీపీ ఆరోపిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా తొలగించిన ప్రతి ఓటుపై దర్యాప్తుకు టీడీపీ పట్టుబడుతోంది. పూర్తి వివరాలు
ముదురుతున్న మైనంపల్లి వివాదం - కుమారుడే ముఖ్యమని తేల్చేసిన ఎమ్మెల్యే !
తనను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బదులిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. తన కుమారుడికి టిక్కెట్ ప్రకటించకపోవడానికి హరీష్ రావు కారణం అని ఆయనపై తిరుమలలో సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మరోసారి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కూడా ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు. హైదరాబాద్ వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు. పూర్తి వివరాలు
రజనీకాంత్ రీసెంట్ డైలాగ్తో సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సొంత పార్టీ నేతలపైనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను అమెరికా వెళ్ళినప్పుడల్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ అగ్ర నాయకత్వం తన పట్ల సానుకూలంగానే ఉందని చెప్పుకొచ్చారు. మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చారు. ఈ అమెరికా పర్యటనపై సొంత పార్టీనాయకులే లేనిపోని ఊహగానాలు ప్రచారం చేశారని కృష్ణ ప్రసాద్ అంటున్నారు. పూర్తి వివరాలు
మహిళల హక్కుల పట్ల మీ ఆందోళన ఆశ్చర్యకరంగా ఉంది- ఎమ్మెల్సీ కవిత
బంగారు కుటుంబం పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్లో డ్రామా సృష్టించిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల హక్కుల పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన ఆశ్చర్యకరంగా ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రెండుసార్లు హామీలు ఇచ్చిన బీజేపీ మహిళలను మోసం చేసిందని అన్నారు. పార్లమెంటులో భారీ మెజార్టీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. పూర్తి వివరాలు
గుడివాడలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించిన కొడాలి నాని
తనకు చిరంజీవికి మద్య అగాధాన్ని క్రియేట్ చేసేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోందిన మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ శాసన సభ్యుడు కొడాలి నాని వ్యాఖ్యానించారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా కొడాలి నాని గుడివాడలో అభిమానులతో కలసి కేక్ కట్ చేశారు. గుడివాడలో చిరంజీవి యువత ఆధ్వర్యాన చిరు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets