అన్వేషించండి

రజనీకాంత్‌ రీసెంట్ డైలాగ్‌తో సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చారు. ఈ అమెరికా పర్యటనపై సొంత పార్టీనాయకులే లేనిపోని ఊహగానాలు ప్రచారం చేశారని కృష్ణ ప్రసాద్ అంటున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సొంత పార్టీ నేతలపైనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను అమెరికా వెళ్ళినప్పుడల్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ అగ్ర నాయకత్వం తన పట్ల సానుకూలంగానే ఉందని చెప్పుకొచ్చారు. 

అమెరికా వెళితే అంతేనా
మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చారు. ఈ అమెరికా పర్యటనపై సొంత పార్టీనాయకులే లేనిపోని ఊహగానాలు ప్రచారం చేశారని కృష్ణ ప్రసాద్ అంటున్నారు. వారందరికి కూడా తానే స్వయంగా పార్టీలో నామినేటెడ్ పదవులను కట్టబెట్టానని అన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే ఇలాంటి పోకడలు ఉన్నాయని వాపోయారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తన నియోజకవర్గంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు తీసుకుంటున్నారని, తన పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా సానుకూలంగానే ఉన్నారని ఆయన వివరించారు.

సైలెంట్‌గా ఉంటా అలా అని కాంప్రమైజ్ కాను...
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు రాజకీయాన్ని మరోమారు వేడెక్కించాయి. మైలవరంలో అసంతృప్తవాదులపై శాసన సభ్యుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపిణిలో వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో 175 మంది శాసన సభ్యుల్లో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైన ఉంటే వాళ్ళల్లో తాను కూడా ఉన్నానని తెలిపారు. తాను సౌమ్యంగా ఉన్నంత మాత్రాన కాంప్రమైజ్ అయినట్టు కాదన్నారు. అలాంటి పరిస్థితే రాదని స్పష్టం చేశారు. 
 భయపెట్టో బెదిరించో లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు వసంత కృష్ణప్రసాద్‌. పదవులు ఇచ్చే దాకా నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారు. సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్ళు, ఈ రెండూ లేని ఊళ్ళు ఉండవు రాజా అంటూ వసంత వ్యాఖ్యలు చేశారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని శాసన సభ్యుడు వసంత మండిపడ్డారు. ఇలాంటి వాటిని లెక్క చేసేది లేదన్నారు.

ఎన్నికల సమయంలో...
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ టైంలో సొంత పార్టీలో ఉన్న నాయకులను కేంద్రంగా చేసుకొని శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేయటంపై సర్వత్రా చర్చనీయాశంగా మారింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి, నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు కేటాయింపులు చేశామని, అయితే ఇప్పుడు వారే తిరిగి విమర్శించటం వెనుక ఉన్న అంతర్యం ఏంటని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం తనకు అండగా ఉందన చెప్పటం ద్వార వారందరికి వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారని పార్టీలో టాక్ నడుస్తోంది.

Also Read:తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం- ఏపీలో మాత్రం అయిదేళ్ల కనిష్ఠానికి తగ్గుదల

Also Read:  నీళ్లు లేవు, జాగ్రత్తగా వాడుకోండి- తెలుగు రాష్ట్రాలకు కృష్ణాబోర్డు సూచన

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget