అన్వేషించండి

Krishna River Management Board: నీళ్లు లేవు, జాగ్రత్తగా వాడుకోండి- తెలుగు రాష్ట్రాలకు కృష్ణాబోర్డు సూచన

Krishna River Management Board: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం రాయిపురే సూచించినట్లు సమాచారం.

Krishna River Management Board: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు కీలక సూచన చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం రాయిపురే సూచించినట్లు సమాచారం. సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. 

సమావేశానికి తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ హాజరవలేదు. తాను పలు కారణాలతో హాజరుకాలేకపోతున్నట్లు బోర్డుకు ముందే సమాచారం పంపారు. రాష్ట్ర అవసరాలకు సంబంధించిన ఇండెంట్‌ను బోర్డుకు పంపారు. ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. 

సెప్టెంబరు వరకు ఏపీ తరఫున తాగు, సాగు నీటికి శ్రీశైలం, సాగర్‌ల నుంచి 30.09 టీఎంసీలు అవసరమని ఇండెంట్‌లో కోరారు. సమావేశంలో మాత్రం తాగునీటికే సెప్టెంబరు నాటికి 25 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జలాశయాల్లో నిల్వలు లేనందున తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు నారాయణరెడ్డి తెలిపారు. 

సమావేశంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం రాయిపురే ఇరు రాష్ట్రాలకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అన్ని చోట్లా వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన దృష్టా నీటి వినియోగంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎగువ నుంచి ప్రవాహాలు లేకపోవడంతో రిజర్వాయర్లలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించనట్లు తెలుస్తోంది. నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

బేసిన్‌ వెలుపలకు తరలింపును అడ్డుకోండి
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలకు కేటాయింపులు చేయాలని బోర్డుకు పంపిన ఇండెంట్‌ లేఖలో తెలంగాణ కోరింది. జలాశయాల్లో సరిపడా నిల్వలు లేవని, ప్రవాహాలు వచ్చే అవకాశాలు కూడా లేనందున ఈ మేరకు తాగునీటికి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది. బేసిన్‌ పరిధిలోనే నీటికొరత ఉండగా శ్రీశైలం జలాశయం నుంచి బేసిన్‌ వెలుపలకు ఆంధ్రప్రదేశ్‌ నీటిని తరలించడాన్ని కట్టడి చేయాలని కోరింది. ఏపీ ఇప్పటికే 7.4 టీఎంసీలను పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్‌ వెలుపలకు తరలించిందని తెలిపింది.

జూన్‌ నుంచి ఈ నీటి సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీ నాటికి ఏపీ 42.96 టీఎంసీలు, తెలంగాణ 12.67 టీఎంసీలను వినియోగించుకున్నాయని ఇండింట్‌లో పేర్కొంది. ఈ నెల 19 నాటికి ఏపీకి పులిచింతల ప్రాజెక్టులో 26.72 టీఎంసీలు, తుంగభద్రలో 23 టీఎంసీలు కలిపి 49.72 టీఎంసీల నిల్వలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణకు జూరాలలో 8.43 టీఎంసీలు, తుంగభద్రలో 2.52 టీఎంసీలు కలిపి 10.95 టీఎంసీల నిల్వ ఉన్నట్లు పేర్కొంది. సాగర్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం నీటిని విడుదల చేయడానికి ట్రైబ్యునల్‌ అనుమతులున్నాయని అని లేఖలో తెలిపింది.

తెలంగాణకు 38.73 టీఎంసీలు కావాలి
వచ్చే మే వరకు తాగునీటి అవసరాలకు 38.78 టీఎంసీల నీరు అవసరమని కృష్ణాబోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం నుంచి కల్వకుర్తికి 5.55 టీఎంసీలు అవసరం అవుతాయని తెలంగాణ కోరింది. సాగర్‌ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలతో పాటు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 15.40 టీఎంసీలు అవసమవుతాయని పేర్కొంది. సాగర్‌ ఎడమ కాలువ కింద 6 టీఎంసీలు మొత్తం కలిపి 26.95 టీఎంసీలు తాగునీటికి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబరు వరకు సాగునీటి అవసరాలకు 38.73 టీఎంసీలు అవసరమని శ్రీశైలం నుంచి 15.73 టీఎంసీలు, సాగర్‌ నుంచి 23 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది.

ఏపీకి 30.09 టీఎంసీలు అవసరం
సెప్టెంబర్ చివరి వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం మొత్తం 30.09 టీఎంసీల నీరు అవసరమని ఏపీ ప్రభుత్వం కోరింది. సాగర్‌ కుడి కాలువకు 9 టీఎంసీలు, ఎడమ కాలువకు 1.80 టీఎంసీలు కలిపి 10.8 టీఎంసీలు కావాలని విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 13.29 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కింద 6 టీఎంసీలు కలిపి 19.29 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. ఈ నెల 16 వరకు శ్రీశైలం, సాగర్‌ నుంచి 8.30 టీఎంసీలు వినియోగించుకున్నట్లు పేర్కొంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
Embed widget