అన్వేషించండి

TS News Developments Today: నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ అధికారులు వెళ్తారా? లేదా? అనేది ఉత్కంఠ గా మారింది. సిబిఐ అధికారులు సోమవారమే హైదరాబాద్ చేరుకున్నారు. వారు ఏం చేస్తారనేది ఇంతవరకూ తెలియదు. 

నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

నేడు లిక్కర్ స్కాం కు సంబంధించి సిబిఐ ఎమ్మెల్సీ కవితని విచారించనుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులకు అందజేశారు. మొదట తాను ఆరున అంటే ఈరోజు అందుబాటులో ఉంటానని చెప్పారు. కానీ తర్వాత ఎఫ్ఐఆర్ పరిశీలించిన తర్వాత అందులో తన పేరు లేదనీ, తాను ఈరోజు అందుబాటులో ఉండడం లేదని సిపిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాదులో ఇంట్లో ఉంటానని, ఏదైనా ఒక రోజు కలవచ్చని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ అధికారులు వెళ్తారా? లేదా? అనేది ఉత్కంఠ గా మారింది. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు సిబిఐ అధికారులు సోమవారమే హైదరాబాద్ చేరుకున్నారు. వారు ఏం చేస్తారనేది ఇంతవరకూ తెలియదు. 

నేడు ఎల్పీనగర్ లో మంత్రి కేటిఆర్ పర్యటన. 

నేడు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఫతూల్లాగూడలో మూడు మతాలకు ఒకే చోట శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. దీన్ని 6.5 ఎకరాల్లో 16.25 కోట్లతో హెచ్ఎండిఏ ఈ పనులు పూర్తి చేసింది. దీన్ని ఈరోజు కేటిఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఒకే చోట మూడు మతాల శ్మశాన వాటికను నిర్మించడం ఇదే తొలిసారి. అదే విధంగా దేశ విదేశాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు తమ వారి అంత్యక్రియలు ప్రత్యక్షంగా లైవ్లో వీక్షించేందుకు లైవ్ లింక్ ను కూడా ఏర్పాటు చేశారు. 

ఇక నాగోల్ - గౌరెల్లి రేడియల్ రోడ్లో హిందూ అరణ్యా నుంచి ఫతూల్లాగూడ కూడా మీదుగా 60 కోట్ల వ్యయంతో మూసి వరకు నిర్మించిన 100 అడుగుల లింకు రోడ్డును  మంత్రి ప్రారంభిస్తారు. SNDP కింద సుమారు 30 కోట్లతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు మీదుగా మూసి వరకు చేపట్టిన నాలాను మంత్రి ప్రారంభిస్తారు. ఫతూల్లాగూడలో జంతుసంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన జంతువుల దహన వాటిక ప్రారంభిస్తారు. జంతువులు చనిపోతే వాటి ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి. అదే విధంగా పెంచుకున్న జంతువులు చనిపోతే వాటిని అంత్యక్రియలు ఎక్కడ చేయాలో తెలియక యజమానులు ఆందోళన చెందుతున్నారు. అలాంటివారికి GHMC ఆధ్వర్యంలో జంతువుల కోసం శ్మశాన వాటిక నిర్మించింది. పీపుల్స్ ఫర్ యానిమల్ అనే స్వచ్ఛంద సంస్థ కోటి రూపాయల వ్యయంతో ప్రత్యేక షెడ్ నిర్మించారు. కేవలం పెంపుడు జంతువులే కాక రోడ్డు పక్కన వీధిలో మృతి చెందిన వాటి వివరాలను ఇస్తే వాటిని ఇక్కడికి అంతక్రియలకు తరలిస్తారు. దీంతో పాటు వనస్థలిపురంలో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ఎయిర్‌పోర్టు మెట్రో టెండర్ల ప్రక్రియ షురూ. నేడు జనరల్‌ కన్సల్టెంట్‌ ఈవోఐపై ప్రీ అప్లికేషన్‌ సమావేశం.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు నిర్మించబోయే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించే పని మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి నేడు హైదరాబాద్‌లో (హెచ్‌ఏఎంఎల్‌) హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ప్రీ అప్లికేషన్‌ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో డిజైన్‌ అండ్‌ బిల్డ్‌ బేసిస్‌ మీద జనరల్‌ కన్సల్టెంట్‌(జీసీ)లను ఎంపిక చేయడానికిగాను ఈ నెల 1వ తేదీన ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఈవోఐ) ఆహ్వానించింది. ఈ ఈవోఐకి సంబంధించి కన్సల్టెంట్ల అనుమానాల నివృత్తికి ప్రీ అప్లికేషన్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు. ఈ ఈవోఐ గడువు ఈ నెల 13 వరకు ఉన్నట్లు హెచ్‌ఏఎంల్‌ ఈవోఐ ఆహ్వాన ప్రకటనలో తెలిపింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట

తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట కలిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. జగ్గుస్వామికి 41-ఏ సీఆర్పీఎఫ్ నోటీసులపై స్టే విధించింది. సిట్ నోటీసులపై ఈనెల 13 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అలాగే బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై విచారణ జరిగింది. బీఎల్ సంతోష్ కు ఈనెల ఈనెల 13వ తేదీ స్టే పొడిగించింది.

నేడు హోం గార్డు దినోత్సవం.. మూడేళ్లుగా వేడుకలు లేవు.

ఏటా డిసెంబరు 6న జాతీయ హోంగార్డు దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాల్సి ఉంది. కానీ మూడేళ్లుగా జరగడం లేదు. ఇంతకుముందు వేడుకలకు కొంత ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించేది. రాత్రి వరకు వేడుకల నిర్వహించే విషయమై సర్క్యులర్‌ కోసం గార్డులు ఎదురుచూశారు. రాకపోవడంతో  తెలంగాణ వ్యాప్తంగా హోం గార్డులు కొంత నిరాశకు గురయ్యారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget